దీవకొండ దామోదర్ రావు
Jump to navigation
Jump to search
దీవకొండ దామోదర్ రావు | |||
![]() దీవకొండ దామోదర్ రావు | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | ఏప్రిల్ 1, 1958 మద్నూర్, బుగ్గారం మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
నివాసము | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
దీవకొండ దామోదర్ రావు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక వ్యవస్థాపకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు.[1]
జననం - కుటుంబం[మార్చు]
దామోదర్ రావు జగిత్యాల జిల్లా, బుగ్గారం మండలం, మద్నూర్ లో 1958, ఏప్రిల్ 1న జన్మించాడు. భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
తెలంగాణ ఉద్యమం[మార్చు]
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరిగిన తెలంగాణ మలిదశ, తుదిదశ ఉద్యమాల్లో పాల్గొన్నాడు.[2]
రాజకీయరంగం[మార్చు]
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభమైన నాటినుంటి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన దామోదర్ రావు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ-ఫైనాన్స్గా వ్యవహరించాడు.
ఇతర వివరాలు[మార్చు]
- తెలంగాణ పబ్లికేషన్స్ను స్థాపించి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలకు, టీ న్యూస్ ఛానల్కు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశాడు.
- 2019, సెప్టెంబరు 18న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమించబడ్డాడు.[3]
మూలాలు[మార్చు]
- ↑ టీ న్యూస్, తెలంగాణ (19 September 2019). "టీటీడీ బోర్డులో తెలంగాణకు పెద్దపీట". Tnews. Retrieved 2 February 2020.[permanent dead link]
- ↑ Telangana Today, Telangana (18 September 2019). "TTD board reconstituted, TPPL C&MD Damodar Rao nominated to board". Archived from the original on 2 February 2020. Retrieved 2 February 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, అమరావతి (17 September 2019). "టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు". Archived from the original on 2 February 2020. Retrieved 2 February 2020.