పొన్నాడ వెంకట సతీష్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు దాట్ల సుబ్బారాజు
తరువాత దాట్ల సుబ్బారాజు
నియోజకవర్గం ముమ్మిడివరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 14 ఫిబ్రవరి 1973
ముమ్మిడివరం గ్రామం, ముమ్మిడివరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ
తల్లిదండ్రులు సత్యారావు, రామానుజమ్మ
జీవిత భాగస్వామి నీరజ
సంతానం సత్య సుమంత్, రేవంత్

పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మిడివరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ 14 ఫిబ్రవరి 1973లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, ముమ్మిడివరం మండలం, ముమ్మిడివరం గ్రామంలో సత్యారావు, రామానుజమ్మ దంపతులకు అగ్నికులక్షత్రియ సామజికవర్గంలో జన్మించాడు. ఆయన బీకాం వరకు చదువుకున్నాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నడింపల్లి శ్రీనివాసరాజుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో పోటీకి దూరంగా ఉండి అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 5547 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

ఆయన 2023 ఆగస్ట్ 25న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 8 డిసెంబరు 2021 suggested (help)
  3. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  4. Andhra Jyothy (26 August 2023). "24 మందితో టీటీడీ బోర్డు". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. Eenadu (26 August 2023). "తితిదే పాలక మండలి సభ్యులుగా 24 మందికి అవకాశం". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.