కోడి రామ్మూర్తి నాయుడు: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 8: | పంక్తి 8: | ||
* గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు. |
* గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు. |
||
* ఛాతీ మీదకు [[ఏనుగు]]ను ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు. |
* ఛాతీ మీదకు [[ఏనుగు]]ను ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు. |
||
* |
* రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు. |
||
==బిరుదులు== |
==బిరుదులు== |
15:15, 14 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని కోడి రామమూర్తి తో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి) |
కోడి రామ్మూర్తి నాయుడు (1882?-1942?) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతోవిజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. మద్రాసులో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్ సెకండరీ పాఠశాలలో వ్యాయమ శిక్షణోపాధ్యాయునిగా పని చేశారు. తరువాత ఒక సర్కస్ సంస్థను స్థాపించి తన బలప్రదర్శనతో దేశ విదేశాలలో ప్రేక్షకులను అబ్బురపరిచారు. తన చివరి రోజుల్లో రామ్మూర్తి నాయుడు బలంఘీర్ పాట్నాలో కల్వండే పరగణా ప్రభువు పోషణలో జీవితం గడుపుతూ మరణించారు.
బలప్రదర్శన విశేషాలు:
- గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.
- ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
- రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.
బిరుదులు
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, 'ఇండియన్ హెర్క్యులెస్' అనే బిరుదును ప్రసాదించారు. ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు. [1]
మూలాలు
- హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం
- ఆంగ్ల వికిపీడియా వ్యాసం
- [1]
- [2]
- Kody Rammoorthy (1880-1938): Luminaries of Andhra Pradesh by Dr. S. Shridevi, Andhra Pradesh Sahithya Akademi, Hyderabad, First edition: 115-120, 1976.