బాషా మహబూబ్

వికీపీడియా నుండి
(బాషా మహబూబ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బాషా మహబూబ్‌ తెలుగు కథా రచయిత. ఆయన వ్రాసిన కథ పలు భాషల్లోకి అనువదించబడి ఆయా ఇతర భాషా పత్రికలలో చోటు చేసుకుంది.

బాల్యము[మార్చు]

బాషా మహబూబ్‌ గుత్తి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 1952 మే 1 న గుత్తి రసూల్‌ బీ, గుత్తి నబీ రసూల్‌ దంపతులకు జన్మించారు .ఆయన బి.యస్సీ చదివారు. ఆయన ఫార్మాసూటికల్‌ కంపెనీలో ఏరియా సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

రచనా వ్యాసంగము[మార్చు]

తిలక్‌- చలంల కథలు-నవలల ప్రభావంతో సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. ఆ క్రమంలో 2003లో 'శాన్యంలోంచి శాన్యంలోకి' శీర్షికన రాసిన తొలి కథా 'రచన' మాసపత్రికలో ప్రచురితం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభంఅయ్యింది. ఆ క్రమంలో 2005లో రాసిన 'బెపాస్‌ రడర్స' కద తొలుత ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధలో ప్రచురితమై 'కథ-2005' కు ఎంపికయ్యింది. ఈ కథ పలు భాషల్లోకి అనువదించబడి ఆయా ఇతర భాషా పత్రికలలో చోటు చేసుకుంది.

రచనలు[మార్చు]

కథలు, కథానికలు, 'సగం మనిషి' (నవల). ప్రచురితమైనాయి.

మూలాలు[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647.

మూలాల జాబితా[మార్చు]