బైరెడ్డి రాజశేఖరరెడ్డి
బైరెడ్డి రాజశేఖరరెడ్డి | |
---|---|
![]() This file is a candidate for speedy deletion. It may be deleted after గురువారము, 19 డిసెంబర్ 2013. | |
జననం | 1957 కర్నూలు జిల్లా కి చెందిన ముచ్చుమర్రి, పగిడ్యాల మండలం |
ప్రసిద్ధి | రాజకీయ నాయకుడు |
తండ్రి | బైరెడ్డి శేషశయన రెడ్డి |
బైరెడ్డి రాజశేఖర రెడ్డి భారతదేశానికి చెందిన ఒక రాజకీయవేత్త, రాయలసీమ ప్రాంత శ్రేయోభిలాషి. తెలంగాణ విభజనవాదం సమయంలో రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న వాదనని తీసుకువచ్చిన వ్యక్తి. రాయలసీమతో కలిపిన తెలంగాణకి గానీ, కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన తెలంగాణకి గానీ (రెండింటినీ రాయలతెలంగాణ గానే వ్యవహరించారు) ఈయన వ్యతిరేకించారు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
కర్నూలు జిల్లాకి చెందిన పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రిలో 1957 లో మూడు పర్యాయములు ఎం ఎల్ ఏ అయిన బైరెడ్డి శేషశయన రెడ్డికి వీరు జన్మించారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము నుండి విద్యను పూర్తి చేశారు.
వృత్తి[మార్చు]
నందికొట్కూరు నియోజిక వర్గానికి 1994 నుండి 1999 వరకు తెలుగు దేశం పార్టీ తరపున ఎం ఎల్ ఏగా ఉన్నారు. 2004, 2009 లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఓటమి చెందారు.
రాయలసీమ పరిరక్షణ సమితి[మార్చు]
సెప్టెంబరు 2012 లో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్ పీ ఎస్) స్థాపించారు. రాయలసీమ వాసుల సమస్యలని జనం దృష్టికి తీసుకురావటానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. 3000 కి.మీ రాయలసీమ ప్రాంతంలో ట్రాక్టరు యాత్రని నాలుగు నెలల వరకు చేశారు.
2013 ఆగస్టు 5 న రాయలసీమ పరిరక్షణ సమితి నే తన పార్టీ పేరుగా ప్రకటించారు.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- రాయలసీమలో కరవు, సాగునీటి సమస్యలు, పరిశ్రమల లేమి ని వివరించిన బైరెడ్డి
- రాయలసీమని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న బైరెడ్డి వాదన
- రాయలసీమ విభజనని వ్యతిరేకించిన బైరెడ్డి
- తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన బైరెడ్డి
- తెలంగాణ ఏర్పాటు ప్రకటనికి వ్యతిరేకంగా 52 గంటల నిరాహారదీక్ష చేసిన బైరెడ్డి
- విభజన నేపథ్యంలో రాయలసీమ భవిష్యత్తు పై ఆందోళన వ్యక్తం చేసిన బైరెడ్డి
- పార్టీ పేరుని రాయలసీమ పరిరక్షణ సమితి గా ప్రకటించిన బైరెడ్డి