భోగరాజు నారాయణమూర్తి

వికీపీడియా నుండి
(భోగరాజు నారాయణ మూర్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భోగరాజు నారాయణమూర్తి
తెలుగు రచయిత
జననం(1891-10-08)1891 అక్టోబరు 8
దేవుపల్లి
మరణం1940 ఏప్రిల్ 12(1940-04-12) (వయసు 48)
వృత్తితెలుగు నవలాకారుడు, నాటక కర్త
తల్లిదండ్రులు
  • బాల ప్రసాదరావు (తండ్రి)
  • జోగమ్మ (తల్లి)

భోగరాజు నారాయణమూర్తి (అక్టోబర్ 8, 1891 - ఏప్రిల్ 12, 1940) ప్రముఖ నవలా రచయిత, నాటక కర్త.

జననం[మార్చు]

ఈయన 1891, అక్టోబర్ 8గజపతినగరం, బొండపల్లి మండలం లోని దేవుపల్లి గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు బాల ప్రసాదరావు, జోగమ్మ. విజయనగరం మహారాజా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.

రచనలు[మార్చు]

నవలలు[మార్చు]

  • విమలాదేవి (1915)
  • ఆంధ్ర రాష్ట్రము (1918)[1]
  • అస్తమయము : ఆంధ్రుల ప్రాచీన వైభవాన్ని తెలిపే నవల
  • ఆంగ్ల రాజ్య స్థాపన (1917) : దేశభక్తి ప్రబోధాత్మకమైన నవల
  • ప్రచండ పాండవము
  • చంద్రగుప్త
  • కాలచక్రము (1949):[2] సమకాలీన సాంఘిక జీవనాన్ని ప్రతిబింబించే నవల
  • అల్లాహో అక్బర్ : కాకతీయులకు, మహమ్మదీయులకు మధ్యగల మతరాజకీయాలను వివరించే నవల.
  • ఉషఃకాలము : శివాజీ జీవితం ఇతివృత్తంగా సాగిన నవల
  • పండుగ కట్నము (1927)

పద్య కావ్యాలు[మార్చు]

  • కంకణము : నీటిబొట్టు చెప్పిన ఆత్మకథ[3]
  • కృష్ణకుమారి : రాజపుత్ర స్త్రీ జీవిత చరిత్ర
  • వాసవీ పరిణయము : విజయనగరంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆశువుగా చెప్పిన పద్యకావ్యం
  • ప్రత్యక్ష రాఘవము : భద్రాచల రామదాసు కథ
  • పార్థివలింగ శతకము

నాటకాలు[మార్చు]

  • లక్షణ (సాంఘిక నాటకము) [4]
  • లతాంగి (1915)
  • ఉషా పరిణయము (1909)
  • ఆంధ్ర భారతి (1911)
  • నౌరోజ్ (1926)

మరణం[మార్చు]

1940, ఏప్రిల్ 10 న పరమపదించాడు.

మూలాలు[మార్చు]