ముకురాల రామారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముకురాల రామారెడ్డి
ముకురాల రామారెడ్డి
జననం
మంద రామారెడ్డి

(1929-01-01) 1929 జనవరి 1 (వయసు 95)
మొకురాల,
కల్వకుర్తి మండలం,
నాగర్‌కర్నూల్ జిల్లా,
తెలంగాణ
మరణం2003 ఫిబ్రవరి 24(2003-02-24) (వయసు 74)
మరణ కారణంఅనారోగ్యం
జాతీయతభారతీయుడు
విద్యఎం.ఎ.(చరిత్ర), ఎం.ఎ.(తెలుగు), పి.హెచ్.డి.
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తిఉపసంచాలకుడు
తెలుగు అకాడమీ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి,రచయిత
గుర్తించదగిన సేవలు
దేవరకొండ దుర్గము
నవ్వేకత్తులు
జీవిత భాగస్వామిఈశ్వరమ్మ
తల్లిదండ్రులుమంద బాలకృష్ణారెడ్డి, రామలక్ష్మమ్మ

ముకురాల రామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. 1976లో ఆకాశవాణి, ఢిల్లీ వారిచే 'జాతీయకవి 'గా గుర్తింపబడి, సన్మానం అందుకున్నాడు. పద్యాలు, కవితలు, పాటలు, కథలు వ్యాసాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రవేసిన సాహితీపరుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు పాలమూరు జిల్లా, కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో 1929 జనవరి 1వ తేదీన మంద రామలక్ష్ముమ్మ, బాలకృష్ణారెడ్డి దంపతులకు జన్మించాడు[1] గంగాపురం హనుమచ్చర్మ ఇతని గురువు. గ్రామంలోని కానిగి పాఠశాలలో ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. క్రమక్రమంగా పరీక్షలు ప్రైవేటుగా రాస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్రలో, తెలుగులో ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై, పి.హెచ్‌.డి. చేసి డాక్టరేటు పొందాడు. ప్రాథమిక పాఠశాలలో ఎలిమెంటరీ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా, డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకునిగా, తెలుగు అకాడమిలో ఉప సంచాలకునిగా 17 సం||ల సుదీర్ఘకాలం పదవీ బాధ్యతలు ఆదర్శప్రాయంగా నిర్వహించి పదవీ విరమణ చేశాడు. 1947-48లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. గ్రంథాలయోద్యంలో కూడా పాల్గొన్నాడు. తెలుగులో ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందాడు. దుందుభి అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణా రచయితల సంఘం, విజ్ఞానవర్ధని పరిషత్ మొదలైన సంస్థలలో చురుకుగా పాల్గొన్నాడు.ఇతడు 2003, ఫిబ్రవరి 24న కల్వకుర్తిలోని స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు. ఇతనికి భార్య ఈశ్వరమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు[2].

రచనలు[మార్చు]

  1. తెలుగు ఉన్నత వాచకం (సంపాదకత్వం)
  2. దేవరకొండ దుర్గము
  3. నవ్వేకత్తులు (దీర్ఘ కవిత) [3]
  4. హృదయశైలి (గేయ సంపుటి)
  5. మేఘదూత (అనువాద కవిత్వం)
  6. రాక్షస జాతర (దీర్ఘ కవిత)
  7. ఉపరిశోధన (పరిశోధనా పత్రాల సంకలనం)
  8. తెలుగు సాహిత్య పదకోశం (సంపాదకత్వం)
  9. పరిపాలన న్యాయపదకోశం (సంపాదకత్వం)
  10. ప్రాచీనాంధ్ర కవిత - ఆదర్శాలు - పరిణామాలు ( సిద్ధాంత గ్రంథం)
  11. సూతపురాణం[1]
  12. సాహిత్య సులోచనాలు[1]
  13. పుట్టగోచిలింగ పూలరంగ (శతకము) [1]
  14. రేడియో ప్రసంగాలు - కవితాప్రతిభ

కథారచయితగా[మార్చు]

ఇతడు కొన్ని కథలు వ్రాశాడు. సర్కారుకిస్తు కథలో సర్కారుకు పన్ను కట్టలేక తాను నమ్ముకున్న భూమిని అమ్ముకున్న పేదరైతు ఇక్కట్లు చిత్రించాడు. ఈ కథ 1956లో దేశోద్ధారక గ్రంథమాల వెలువరించిన పరిసరాలు అనే కథాసంకలనంలో చోటు చేసుకుంది.[1]. 1988 ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ఇతని క్షణకోపం కోపక్షణం కథ ప్రచురితమైనది[4]. 'విడిజోడు ' కథకు కృష్ణాపత్రిక కథల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది.[5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 గుడిపల్లి నిరంజన్ (మే 2019). నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్యచరిత్ర (1 ed.). హైదరాబాదు: తెలంగాణ సాహిత్య అకాడమీ. pp. 48–49. Archived from the original on 29 మార్చి 2020. Retrieved 29 March 2020.
  2. జి.యాదగిరి (6 October 2017). "'ఆత్మ విశ్వాస ప్రతీక కవి ముకురాల'". తెలంగాణ మాసపత్రిక. Archived from the original on 11 సెప్టెంబరు 2019. Retrieved 29 March 2020.
  3. ముకురాల, రామారెడ్డి (1971). నవ్వేకత్తులు (1 ed.). హైదరాబాదు: తిరుమల శ్రీనివాస పబ్లికేషన్స్. Retrieved 18 December 2014.
  4. ముకురాల, రామారెడ్డి. "క్షణకోపం కోపక్షణం". కథానిలయం. కథానిలయం. Retrieved 18 December 2014.[permanent dead link]
  5. సింగిడి-1,తెలుగువాచకం,9 వ తరగతి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015,పుట-26

వెలుపలి లంకెలు[మార్చు]