వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 25వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అతి పెద్దది. ఆంధ్ర ప్రదేశ్ లో నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నల్గొండ జిల్లా నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు. బౌద్ధాచార్యుడైన ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధించిన ఆధారాలు లభించడం వలన ఈ స్థలానికి చారిత్రక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దిగువ కృష్ణ ప్రాజెక్టుగా రూపకల్పన చేసి, నందికొండ వద్ద నిర్మించడానికి ప్రతిపాదించింది. ప్రణాళికా సంఘం కృష్ణా జలాల సమర్ధ వినియోగానికి సంబంధించి పరిశీలించేందుకు ఖోస్లా కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నందికొండ వద్ద కృష్ణా నదిపై డ్యాము నిర్మణాన్ని సూచించింది. ప్రణాళికా సంఘం ఈ సూచనలను 1952లో ఆమోదించింది. జలాశయ సామర్ధ్యం 281 టి.ఎం.సి. గా సూచించింది. 1955 డిసెంబర్ 10 న అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, 2005లో స్వర్ణోత్సవాలను జరుపుకుంది. పూర్తివ్యాసం : పాతవి