విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
స్వరూపం
(విశాలాంధ్ర ప్రచురణాలయం నుండి దారిమార్పు చెందింది)
తెలుగు సాహిత్యానికి పేరుగాంచిన ముఖ్యమైన ప్రచురణాలయములలో ఒకటి విశాలాంధ్ర ప్రచురణాలయం. దీని కేంద్రస్థానం హైద్రాబాద్లో నున్నది. దీని అనుబంధ సంస్థ అయిస విశాలాంధ్ర బుక్ హౌస్ ద్వారా పుస్తకాలు అమ్ముతుంది. తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులోని విశాలాంధ్ర బుక్ హౌస్ నవచేతన బుక్ హౌస్ గా మారింది [1]. 1953 లో ప్రారంభించబడిన ఈ సంస్థ 2013లో 60 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 3000 పైగా పుస్తకాలు ముద్రించింది. అభ్యుదయ రచయితల సంఘం తోడ్పాటుతో అభివృద్ధిచెందింది. 2013 లో 70 కొత్త పుస్తకాలతోపాటు, 300 పుస్తకాల పునర్ముద్రణలు చేసింది.[2]

ముఖ్యమైన ప్రచురణలు
[మార్చు]- గిడుగు రామమూర్తి సాహిత్యవ్యాసాలు, 1933, 1958, 1992
- ఆరుద్ర సినీ గీతాలు
- కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003)
- సీమ కథలు
- మహాకవి డైరీలు, 1954, 1961
- ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ, 1961
- తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు, 1990
- సుప్రసిద్ధుల జీవిత విశేషాలు, 1994
- ఈ విషయమై ఆలోచించండి, 1999
- స్వాతంత్ర సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు, 2000
- వెండితెర పాటలు, 2008
- ఎర్ర జెండాలు
మూలాల జాబితా
[మార్చు]- ↑ "'నవచేతన బుక్ హౌస్' ప్రారంభం". the original నుండి 2020-01-14 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-01-13.
- ↑ "Promoting and preserving Telugu literature for 60 years". The Hindu. 2013-12-28.