వీరముష్టివారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ నాటికీ బిక్షుకులై తిరిగే వీర ముష్ఠి వారు ఆంధ్ర దేశంలో అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు. ఏనాడు వీర శైవం ఏయే ప్రాంతాల్లో విజృంభించిందో ఆనాటి నుంచీ ఈ వీర ముష్టులు ప్రాచుర్యంలో ఉన్నారు. వీర ముష్టి, వీర భట, భద్ర పాద మొదలైన పేర్లన్నీ వీర ముష్టులకు చెందుతాయి. ముష్టి అంటే పిడికిలి అనీ, వీరులైన యోధులనీ, వీర భిక్షుకులనీ, వీర శైవ భిక్షుకులనీ, వీర ముష్టి వారికి అర్థం చెప్పవచ్చునని డా: బి. రామరాజు గారు వారి జానపద గేయ సాహిత్యంలో ఉదహరించారు. వీరు వీర శైవ వాగ్మయానికి సంబంధించిన గేయాలనూ, శైవ భక్తుల గాథలనూ, కన్యకా పరమేశ్వరీ కథలనూ చెపుతూ వుంటారు. వీరు ముఖ్యంగా శైవ భక్తులైన జంగాలనూ, బలిజలనూ, వైశ్యులనూ యాచిస్తారు. కాని ఈ నాడు వారు అక్కడక్కడా వున్న కొద్ది మంది అందరినీ యాచిస్తున్నారు.

ఇలాంటప్పుడు వీరు ఎవరి నైతే యాచించే వారో వారే వీరిని మక్కువగా ఆదరించే వారు.[మార్చు]

ముఖ్యంగా వీరు వైశ్యులనే ఎందుకు యాచిస్తారో చెప్పేందుకు ఒక ఐతిహ్యం ఉంది. వీర ముష్టులు వైశ్యులకు ఇలవేల్పైన కన్యకను, రాజరాజు బలాత్కరించి పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన సైన్యంలో నున్న వీర ముష్టులూ, ఆయన పల్లకీని మోసే బోయీలుగా వున్న వీర ముష్టులు కావాలని కొంత ఆలస్యం చేయటం వల్ల కన్యక ఆమె వంశీయులూ అగ్నిగుండంలో ఆహుతి అవటానికి అవకాశం చిక్కింది. అలా ఆలస్యమే చేయక పోయినట్లైతే, కన్యకను రాజరాజు చెరబట్టి వుండే వాడు. ఈవిధాన వీర ముష్టులు వైశ్య జాతికి మహోపకారం చేసిన కారణాన వైశ్యులు వీర ముష్టులను గౌరవించి వారికి పారి తోషికములు ఇస్తారు.

వీర ముష్టులు గానం చేసే పాటలన్నీ కన్యకా ఇతి వృత్తానికే సబంధించిన వని అయ్యల రాజు నారాయణా మాత్యుడు వీర ముష్టులను గురించి ఆయ రచనలో ఉదపరించాడు.[మార్చు]

వీర ముష్టుల యొక్క జన్మ వృత్తాంతం గురించి ఒక వింత కథ ప్రదారంలో వున్నట్లు కూడా రామ రాజు గారు వివారిస్తున్నారు. ఎప్పుడో వీర భద్రుడు దక్షాధ్వర, ధ్వంసము చేసే సమయంలో, వీర భద్రుని శరీరంనుంచి స్రవించిన చెమట నుండి ఈ జాఅతి వారు జన్మించారట. వీరభద్ర, భిక్షుకు, విభూతి పిందాల వంటి గోత్ర నామాలు వీర శైవాన్ని చెపుతూ ఉన్నాయి. వీరిలో కొంత మంది జంగాలుగా మారారు. వీర ముష్టులకు గురువులు ఆరాధ్య బ్రాహ్మణులని చెపుతారు. వీరుష్టులు మారెమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ మొదలైన గ్రామ దేవతలను కూడా పూజిస్తారు. ముఖ్యంగా వీరు గంభీర ధ్వని నిచ్చే జేగంట శంఖం, తప్పెటా వాయిస్తూ భిక్షమెత్తుతారు. వీర ముష్టుల్లో ఆవేశ పరులైన కొందస్రు బుగ్గలకు నారసాలను పొడుచు కోవడం, నాలుకల్ని తెగ కోసు కోవడం మొదలైన భయంకర మైన ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. లింగ ధారులు తప్పా మిగిలిన వారందరూ మద్య మాంసాలను ఆరగిస్తారు. వీరు గడ్డాలనూ, మీసాలనూ పెంచుతారు, క్షుర కర్మ చేయరు, వీర ముష్టులైన వీరు యాచిస్తే, వీరి స్త్రీలు, చాపలు అల్లడం పచ్చ తొట్లు పొడవడంమొదలైన పనులు చేస్తారు. బ్రాహ్మణులు, వైశ్యులుజంగాలు, బలిజలు మొదలైన వారి ఇళ్ళలో తప్పా వీరు మెక్కడా భోజనం చేయరు.

ఆవేశ పరులైన వీర ముష్టులు వీరా వేశంతో కర్ర సాములు కూడా చేస్తూ వుంటారు. తాషామర్బా వాయిద్యానికి అనుకూలంగా అడుగులు వేస్తూ, కర్ర సాములో ఆరి తేరిన ఇరువురు ఇరు ప్రక్కల నుంచి కర్రలను చేత బూని గిర గిరా ఆత్రిప్పుతూ అమిత పౌరుషంతో ఒకరి మీదికి మరొకరు కర్రను విసురుతూ ఆ కర్ర విసురుకు రెండవ వ్వక్తి తప్పుకుని ఎదురు దెబ్బ తీస్తూ, వాయిద్యానికి అనుగుణంగా, వాయిద్య వేగంతో పాటు కర్ర త్రిప్పుతూ, తమతమ ప్రజ్ఞలను చూపిస్తూ, చూపరులను వుత్తేజ పర్చి, వారిలో ఉద్రేకాన్ని కలిగిస్తారు. పల్లెలలో సహసంగా జరిగే ఉత్సవాలలో ఈ వీర ముష్టులను ప్రదర్శనాలలో ప్రవేశ పెడతారు. వీరు కర్ర సాములో, ఎంతటి అసాధ్యులో, కత్తి సాములోనూ అంత అసాధ్యులే.

మూలాలు[మార్చు]