సతీష్ కాసెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీష్ కాసెట్టి
జననం
సత్యనారాయణ కాసెట్టి
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు సినిమా రచయిత, దర్శకుడు
వెబ్‌సైటుhttp://satishkasetty.com/

సతీష్ కాసెట్టి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. 2006లో ఈయన తొలిసారిగా దర్శకత్వం వహించిన హోప్ చిత్రానికి ఉత్తమ సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా జాతీయ పురస్కారం బహుమతి వచ్చింది.

సినిమారంగ ప్రస్థానం[మార్చు]

సతీష్ 2006లో తొలిసారిగా హోప్ సినిమాకు దర్శకత్వం వహించాడు. నిర్మాత డి. రామానాయుడు, కళ్యాణి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం 54వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ సామాజిక అంశం కలిగిన చిత్రంగా బహుమతిని అందుకుంది. విద్యావ్యవస్థలోని ఒత్తిడి కారణంగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై ఈ చిత్రం రూపొందించబడింది.[1]

2009లో కమల్ కామరాజు, కలర్స్ స్వాతి జంటగా నటించిన కలవరమాయే మదిలో చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో పల్లవించని అనే పాటకు గాయని కె. ఎస్. చిత్రకు ఉత్తమ గాయనిగా నంది పురస్కారం లభించింది.[2] సతీష్ దర్శకత్వంలో 2016, ఫిబ్రవరిలో శ్రీకాంత్ హీరోగా టెర్రర్ సినిమా విడుదలైంది.

దర్శకత్వం వహించిన చిత్రాలు[మార్చు]

  1. హోప్ (2006)
  2. కలవరమాయే మదిలో (2009)
  3. టెర్రర్ (2016 సినిమా)

మూలాలు[మార్చు]

  1. "54th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 28 February 2018.
  2. "Kalavaramaye Madilo is appealing". Rediff.com. 17 July 2009. Retrieved 21 February 2013.

ఇతర వివరాలు[మార్చు]