సత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానములో నిత్యాన్నదాన సత్రం

దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోఉన్నధర్మసత్రాల బాధ్యత ధర్మకర్తల కుటుంబాలకే ఇవ్వబోతున్నారు.ఆ శాఖ చట్టంలోని సెక్షన్‌ 15, 29 కింద 2008 సెప్టెంబరు 11న జీవో ఎం.ఎస్‌. 1098 ప్రకారం కొన్ని సత్రాలకు ఈ మినహాయింపులనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈవోలుగా, మేనేజర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు తమ బాధ్యతలను వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదా ఆర్యవైశ్య సంఘాల సభ్యులకు అప్పగించాల్సి ఉంటుంది.ఆస్తులు దేవాదాయశాఖ పరిధిలోనే ఉంటాయి .ఆ సంస్థలకు సత్రాలకు ఇ.ఒ.లు, మేనేజర్లు ఉండకపోయినా ఆ ఆస్తులు దేవాదాయశాఖకే చెందుతాయి. కంట్రిబ్యూషన్స్‌, ఆడిట్‌ ఫీజులు, సి.పి.ఎఫ్‌.లు చెల్లించాలి. ఏటా ఆడిట్‌ చేసి జమాఖర్చులు చెప్పాల్సి ఉంటుంది. ధర్మాసత్రాలు, సంస్థల ఆస్తులు అన్యాక్రాంతం చేయటానికో, అమ్మటానికో ఎవరికీ అధికారులు హక్కులు ఉండవు. దాతలు, వదాన్యుల ఆశయాలకు అనుగుణంగా సత్రాలు నడపాలి.

కొన్ని ప్రముఖ సత్రాలు[మార్చు]

  • పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని టి.కె.ఎం.వి.భవనం, పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, పాలకొల్లులోని ఆదేపల్లి గంగరాజు సత్రం, అత్యం సుబ్బయ్య అన్నసత్రం, రేపాకవారి సత్రం, క్షీరపుర అన్నదాన సమాజం, మన్యం జగ్గమ్మ సత్రం, సలాది వారి సత్రం, బంగారు విశ్వనాధం సత్రం, భీమవరంలోని టి.ఎం.వి.భవనం, ఏలూరులోని చూడూరి వారి సత్రం, మద్దులవారి సత్రం, కేసరపల్లి ఆంజేయ ధర్మశాల, మోతేవారిసత్రం, ఆంజనేయ బాలభక్త సమాజం, నంగులూరి వారిసత్రం, చీమకుర్తి మల్లిఖార్జునరావు సత్రం, కామవరపుకోటలోని తాడిమళ్లవారిసత్రం, ఏలూరులోని కన్యకాపరమేశ్వరి సత్రం, కొత్తమాసు లింగయ్య సత్రం

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సత్రము&oldid=3711378" నుండి వెలికితీశారు