సన్నిహిత్ సరోవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సన్నిహిత్ సరోవర్

సన్నిహిత్ సరోవర్ భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గల కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్ పట్టణంలో గల ఒక పవిత్ర సరస్సు. దీనిని సప్త సింధు అనీ, ఏడుగురు సరస్వతీదేవిల సమావేశ స్థలం అనీ పిలుస్తారు. ఈ సరస్సు 48 కోసుల కురుక్షేత్ర ప్రదక్షిణ యాత్రలో ఒకటి.[1]

నమ్మకాలు[మార్చు]

హిందువులు హిందూ ధర్మం ప్రకారం ఈ సరస్సు పవిత్రమైన నీటిని కలిగి ఉంటుంది అని నమ్ముతారు. అమావాస్య రోజు లేదా గ్రహణం రోజున ఇక్కడి నీటిలో స్నానం చేస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత సమానమైన ఫలితాలను ఇస్తుందనీ, ఈ సరోవర్‌లో స్నానం చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మలకు శాంతి లభిస్తుందని కూడా నమ్ముతారు.[2]

కార్యక్రమాలు[మార్చు]

చనిపోయినవారికి పిండ ప్రధానం చేయడం వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు.[3]

ఆలయాలు[మార్చు]

సరోవర్‌తో పాటు విష్ణువు, ధ్రువ నారాయణ్, లక్ష్మీ నారాయణ్, ధ్రువ భగత్, శ్రీ హనుమాన్, దుర్గాదేవి వంటి చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. సన్నిహిత్ సరోవర్ ను విష్ణువు నివాసం అని కూడా నమ్ముతారు.[4]

మూలాలు[మార్చు]

  1. "Tirath in Kurukshetra - Sannehit Sarovar". Kurukshetra district website. Archived from the original on 2014-08-06. Retrieved 2014-08-08.
  2. "Tirath in Kurukshetra - Sannehit Sarovar". Kurukshetra district website. Archived from the original on 2014-08-06. Retrieved 2014-08-08.
  3. "Tirath in Kurukshetra - Sannehit Sarovar". Kurukshetra district website. Archived from the original on 2014-08-06. Retrieved 2014-08-08.
  4. "Tirath in Kurukshetra - Sannehit Sarovar". Kurukshetra district website. Archived from the original on 2014-08-06. Retrieved 2014-08-08.