సీహెచ్ గోపాల్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీహెచ్‌ గోపాల్‌రెడ్డి
జననం
చొల్లేటి గోపాల్‌రెడ్డి

జాతీయత భారతదేశం
వృత్తిప్రొఫెసర్,మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌

సీహెచ్‌ గోపాల్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌. ఆయన 2021, మే 21న నల్గొండ లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, వైస్ చాన్స్‌లర్‌గా నియమితుడయ్యాడు. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నాడు.[1][2][3]

జననం, విద్యాభ్యాసం[మార్చు]

సీహెచ్‌ గోపాల్‌రెడ్డి కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలం, పొతిరెడ్డిపేట గ్రామంలో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు హుజూరాబాద్ లోని చిగురుమామిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశాడు. గోపాల్‌రెడ్డి హుజూరాబాద్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆయన కాకతీయ విశ్వవిద్యాలయంలో 1981లో బీఎస్సీ (గణితం, ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌), ఉస్మానియా యూనివర్సిటీ లో నుండి 1983లో ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌) పీజీ పూర్తి చేసి, యూజీసీ నెట్‌, జేఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌ సాధించి పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[4]

వృత్తి జీవితం[మార్చు]

గోపాల్‌రెడ్డి 1990లో ఉస్మానియా ఫిజిక్స్‌ విభాగంలో ఫ్యాకల్టీగా ఉద్యోగం జీవితం ప్రారంభించాడు. ఆయన నల్లగొండ పీజీ కాలేజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా, సైఫాబాద్ యూనివర్సిటీ సైన్స్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా, యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ ఫిజిక్స్‌ హెడ్‌గా మూడేళ్లు పని చేశాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో హెడ్‌గా, ఓయూ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టరేట్‌లో డైరెక్టర్‌గా పని చేశాడు. గోపాల్‌రెడ్డి 2016లో ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యాడు.[5] ఆయన రిజిస్ట్రార్‌గా భాద్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, వైస్ చాన్స్‌లర్‌గా నియమితుడయ్యాడు.[6][7]

మైలురాళ్లు[మార్చు]

  • అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ నిధులతో ఏఈఆర్‌బీ ప్రాజెక్టు ముంబై లో పూర్తి చేశాడు.
  • ఇండోర్ లోని యూజీసీ డేయి కాన్సోరియం ఫర్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌
  • ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ శాశ్వత సభ్యుడు
  • లుంబినీసెస్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ సొసైటీ, రేడియేషన్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌ ట్రాక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌
    టీచర్స్‌ అండ్‌ సొసైటీ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ సాలిడ్‌ స్టేట్‌ సైన్సెస్‌లో పనిచేశాడు.

వైస్‌చాన్సలర్‌గా భాద్యతలు[మార్చు]

సీహెచ్‌ గోపాల్‌రెడ్డి 24 మే 2021న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[8]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (22 May 2021). "10 వర్సిటీలకు సారథులు". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  2. "After two years, 10 Telangana state universities finally get new Vice-Chancellors". The New Indian Express. 23 May 2021. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  3. TV9 Telugu, TV9 (22 May 2021). "Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ - telangana government announced universities new vice chancellors". TV9 Telugu. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andhrajyothy (23 May 2021). "ఉప'కుల'పతులు". www.andhrajyothy.com. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  5. "నేటినుంచి ఓయూ వందేండ్ల సంబురాలు". నవ తెలంగాణ. 26 April 2017. Archived from the original on 2023-02-19. Retrieved 28 May 2021.
  6. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  7. Eenadu (23 May 2021). "TS News: 10 వర్సిటీలకు కొత్త వీసీలు". EENADU. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  8. Namasthe Telangana (23 May 2021). "నేడు విధుల్లోకి ఎంజీయూ వీసీ". Namasthe Telangana. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.