బాదామి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 108: పంక్తి 108:
==కట్టడాలు==
==కట్టడాలు==
[[Image:6th century Kannada inscription in cave temple number 3 at Badami.jpg|thumb|200px|left|Old Kannada inscription of Chalukya King Mangalesa dated 578 CE at Badami cave temple no.3]]
[[Image:6th century Kannada inscription in cave temple number 3 at Badami.jpg|thumb|200px|left|Old Kannada inscription of Chalukya King Mangalesa dated 578 CE at Badami cave temple no.3]]
==మూలాలు==
<references/>
==బయటి లంకెలు==
==బయటి లంకెలు==
{{Wikivoyage|Badami}}
{{Wikivoyage|Badami}}

10:28, 3 జూన్ 2014 నాటి కూర్పు

బాదామి
వాతాపి
నగరము
బాదామి గుహ ఆలయాలు
Country India
రాష్ట్రముకర్ణాటక
జిల్లాబాగల్‌కోట్ జిల్లా
Area
 • Total10.9 km2 (4.2 sq mi)
Elevation
586 మీ (1,923 అ.)
Population
 (2001)
 • Total25,851
 • Density2,400/km2 (6,100/sq mi)
Languages
 • Officialకన్నడ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
587 201
Telephone code08357

బాదామి లేదా వాతాపి కర్ణాటక రాష్ట్రం లోని బాగల్‌కోట్ జిల్లా లోని ఒక పట్టణము మరియు అదే పేరు గల తాలూకా కేంద్రము. ఈ పట్టణము క్రీస్తు శకం 540 నుండి 757 వరకు బాదామి చాళుక్యుల రాజధానిగా ఉండేది.

ప్రకృతి

బాదామి పట్టణములోని అగస్త్య చెరువు వీక్షణము
బాదామి పట్టణములోని అగస్త్య చెరువు వీక్షణము

చరిత్ర

Extent of Badami Chalukyas Empire, 636 CE, 740 CE

ఈ ప్రాంతం చుట్టూ అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగినవి ఖ్యాద్ గ్రామము, హిరేగుడ్డ, సిద్లఫడి మరియు కుట్‌కంకేరి (జుంజున్‌పాడి, షిగిపాడి మరియు అనిపాడి). ఇక్కడ పురాతన రాతి సమాధులు మరియు వర్ణచిత్రాలు చూడవచ్చును.

బాదామి చాళుక్య సామ్రాజ్యము మరియు ఇతర సామ్రాజ్యాలు

పురాణగాధ

పురానగాధల ప్రకారం వాతాపి రాక్షసుడు అగస్త్య మహర్షిచే ఈ ప్రాంతంలోనె సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని వాతాపి అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా అయ్యవోలె అయినూరవరు అనే వర్తక సంఘం ఉండేది. ఇది కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్ద పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని మనవడు పులకేశి వాతాపిలో కోట కట్టించాడు.

బాదామి చాళుక్యులు

కీర్తివర్మ కుమారుడు పులకేశి. ఇతను వాతాపిని బలోపేతం చేసి విస్తరించాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. రెండవ పులకేశి, విష్ణువర్ధన మరియు బుద్దవరస. అతను మరణించేనాటికి ముగ్గురు కుమారులు చిన్నవారు కావడంచేత కీర్తివర్మ మరియొక కుమారుదు మంగలేశ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతను తనదైన శైలిలో పరిపాలించి శాశ్వతంగా పగ్గాలు చేపట్టాలనుకున్నాడు. కానీ రెండవ పులకేశి చేతిలో హత్యకు గురయ్యాడు. తర్వాత రెండవ పులకేసి క్రీస్తుశకం 610 నుండి 642 వరకు బాదామి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. వాతాపిని కేంద్రముగా చేసుకొని చాళుక్యులు కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 6 నుండు 8 వ శతాబ్దం వరకు వీరు విజయవంతంగా పరిపాలన సాగించారు.

శాసనాలు

బాదామిలో మొత్తం ఎనిమిది శాసనాలు కలవు. వీటిలో కొన్ని అతి ప్రధానమైనవి. వీటిలో మొదటిది సంస్కృత మరియు పాత కన్నడ భాషలో 543 CE పులకేశి కాలం నాటిది.రెండవది 578 CE మంగళేశ శాసనము కన్నడ భాషలో కలదు. మూడవది కప్పే ఆరభట్ట రికార్డులలోనిది. ఇది కన్నడ సాహిత్యంలో త్రిపది వాడుకలో లభించిన మొదటి కవిత. భూతనాధ ఆలయం వద్ద లభించిన ఒకశాసనం 12 వశతాబ్దమునకు చెందినదిగా భావింపబదుతున్నది. ఇందులో జైన శైలిలో త్రికంటర ఆదినాధను కీర్తిస్తూ రాతలు రాయబడ్డాయి.

వాతాపి గణపతి

కర్ణాటక సంగీతం లోని హంసధ్వని రాగం లోని వాతాపి గణపతిం భజే కీర్తన. సంకలనం శ్రీ ముత్తుస్వామి దీక్షితార్.[1]. వాతాపి గణపతి విగ్రహమును తదనంతరం పల్లవులు తమ రాజధాని ఐన తంజావూరు కు తరలించుకొని పోయారు. 7వ శతాబ్దంలో చాళుక్యులను ఓడించి పల్లవులు ఈ విగ్రహాన్ని తరలించుకొని పోయారు.[2]

చిత్ర మాలిక

కట్టడాలు

Old Kannada inscription of Chalukya King Mangalesa dated 578 CE at Badami cave temple no.3

మూలాలు

  1. Kalpana sunder (2010-03-07). "Rocky tryst with history". The Hindu. Chennai, India. Retrieved 2010-03-28.
  2. "Vatapi Ganapati". Retrieved 2010-03-28.

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=బాదామి&oldid=1164442" నుండి వెలికితీశారు