పెళ్ళి చేసి చూడు (1952 సినిమా)
| పెళ్ళిచేసి చూడు (1952) | |
| దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్ |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి , జి.వరలక్ష్మి |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | విజయ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
విషయ సూచిక |
కధా విశేషాలు [మార్చు]
తెలుగు చిత్రసీమలో హేమా హేమీలంతా కలసి నటించిన చిత్రాలలో ఇది ఒకటి.
ఒక పల్లెలో తన తల్లి(కన్నాంబ), చెల్లి అమ్మడు(వరలక్ష్మి)లతో నివసించే రాజు నాటకాలలో వేషాలేస్తూ ఆ ఊరి స్కూలులో పనిచేస్తుంటాడు. అతని మావయ్య అయిన గోవిందయ్య అదే ఊరిలో ఉంటూ మేనల్లుడిని తన కూతురుకు ఇచ్చి వివాహం చేయాలనుకొంటాడు. అతని పొరుగింటి దూరపు బంధువు భీమన్న ఆమెను ఇష్టపడుతుంటాడు. ఆమె కూడా ఇతడిని పెళ్ళిచేసుకోవలనుకొంటూ ఉంటుంది.
రాజు తన చెల్లి పెళ్ళి అయితే కాని తను పెళ్ళిచేసుకోనని సంభందాలకోసం వెంకటపతి అనే ఆయనను కలుసుకోవటం కోసం వేరే ఊరు వెళతాడు. అక్కడ పూటకూళ్ళమ్మ ద్వారా దూపాటి వియ్యన్న(ఎస్.వి.రంగారావు) అనే ఆయన ద్వారా పని జరుగుతుందని తెలిసి ఆయన ఇంటికి వెళతాడు. ఆయన తన తండ్రికి స్నేహితుడని తెలుస్తుంది. ఆయన తన కూతురు చిట్టి(సావిత్రి)ని చేసుకోమని అతని చెల్లి పెళ్ళి తను చేస్తానని చెప్పడంతో చిట్టిని పెళ్ళాడుతాడు.
మద్రాసులో ఉద్ధ్యోగం చేస్తున్నవెంకటపతి కొడుకు రమణ(ఎన్.టి.రామారావు)తో వివాహం నిర్ణయిస్తారు. తన కూతురిని పెళ్ళి చేసుకోకపోవడం వలన ద్వేషంతో ఉన్న గోవిందయ్య వెంకటపతిని రెచ్చగొదతాడు. వివాహం పూర్తయ్యే సమయానికి వియ్యన్న అనుకొన్న మొత్తం ఇవ్వలేకపోవడంతో పెళ్ళిపీటలమీద ఉన్న తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు వెంకటపతి.
రాజు తన చెల్లి,తల్లి,బార్యల నగలు ఇంటి దస్తావేజులు తీసుకొని వెంకటపతి ఇంటికి వెళ్ళి తన చెల్లిని కాపురానికి తీసుకొని వచ్చేందుకు అనుమతి ఇవ్వమని అడుగుతాడు. వెంకటపతి ససేమిరా అని మోసం చేసి తనకొడుకుతో తాళి కట్టించారని తిట్టి తనకొడుకుకు వేరే పెళ్ళి చేస్తానని చెపుతాడు. రమణ అతడిని ప్రక్కకు తీసుకెళ్ళి తను తండ్రికి తెలియకుండా వస్తానని ప్రస్తుతం వెళ్ళిపొమ్మనీ చెపుతాడు. తరువాత తాను మద్రాసు పోతున్నానని చెప్పి అత్తగారి ఊరు వెళతాడు. అక్కడ కొద్దికాలం ఉండి తన భార్యను తీసుకొని మద్రాసు వెళతాడు.
ఈ లోగా తనకు తండ్రి వేరే సంభందాలు చూస్తున్నట్టు తెలియడంతో తండ్రి వచ్చేసరికి పిచ్చిఎక్కినట్టుగా నాటకం ఆడుతూ తనకు సేవలు చేసే నర్సుగా తనభార్యను కూడా తనతో తీసుకొని ఊరు వెళతాడు. అక్కడ పిచ్చివాడైన తనకు నర్సులాంటి భార్య అయితే బావుంటుందనిపించేలా తండ్రికి చెప్పి మద్రాసు వెళతారు. అక్కడ గర్భవతి అయిన భార్యను తన అత్తగారి ఇంట దించి ఆమె బిడ్డను కన్న తరువాత తిరిగి తీసుకు వెళతాడు. ఇదంతా గమనించిన గోవిందయ్య రమణ నాటకం బట్టబయలు చేసేందుకు వెంకటపతితో కలసి మద్రాసు వస్తాడు. తండ్రి రాకతో మళ్ళీ పిచ్చి ఎక్కినట్టుగా నాటకం ఆడుతున్న కొడుకును చూస్తాడు. ఇంతలో లోపల పిల్లవాడి ఏడుపు వినబడటంతో లోనికి వెళ్ళి చూస్తారు. అక్కడ కోడలు అమె బిడ్డతో ఉండటం గమనిస్తాడు. ఆమెను వెంటనే ఇంటి నుండి వెళ్ళిపొమ్మని చెప్పి కొడుకుతో నీకు గోవిందయ్య కూతురితో వివాహం నిశ్చయించానని వెంటనే ఇంటికి రమ్మని లేదంటే తన ఆస్థిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వననీ చెపుతాడు. తనకు ఆస్థి అవసరం లేదని భార్య వెంటే తానూ పోతానని సామాను తీసుకొని ఆమెను తీసుకొని వెళ్లబోతుంటే వియ్యన్న వచ్చి అతడిని ఆపి గోవిందయ్య కూతురుకు అప్పటికే అతని బంధువు భీమన్నతో పెళ్ళి జరిగిందని మాయమాటలు చెప్పి వెంకటపతిని మోసం చేస్తున్నడని చెపుతాడు. తన తప్పు తెలుసుకొన్న వెంకటపతి కొడుకుని ఆపి కోడలిని మనవడిని వెంటబెట్టుకొని తన ఊరు వెళతాడు.
ఇతర విశేషాలు [మార్చు]
పాటలు [మార్చు]
- అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే (గాయకులు: రామకృష్ణ, స్వర్ణలత)
- పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్ (గాయకులు: ఘంటసాల)
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా | ఊటుకూరి సత్యనారాయణ | ఘంటసాల | కోమల, కె. రాణి, ఉడుతా సరోజిని |
| ఎవడొస్తాడో చూస్తాగా పోటీ ఎవడొస్తాడో చూస్తాగా | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, జి.భారతి |
| పెళ్ళి చేసి చూపిస్తాం మేమే పెళ్ళి పెద్దలనిపిస్తాం | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | పిఠాపురం, రామకృష్ణ |
| ఎచ్చతనుండొచ్చినారు బల్ చక్కటి రాజులు మీరు | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | శకుంతల, రామకృష్ణ |
| ఎక్కడోయి హా ప్రియా హా ఎక్కడోయీ | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | పి.లీల, పిఠాపురం, రామకృష్ణ |
| హై ఏవూరిదానవే వన్నెలాడి బల్ ఠీవిగా ఉన్నావె గిన్నెకోడీ | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | శకుంతల, రామకృష్ణ |
| ఈ జగమంతా నిత్యనూతన నాటకరంగం | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల
మూలాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు] |