పింగళి నాగేంద్రరావు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
పింగళి నాగేంద్రరావు (1901 - 1971) ఒక తెలుగు సినిమా రచయిత. పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా రఛయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడు గా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే.
ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా రాజాం. నాగేంద్రరావు గారి వయస్సు రెండేళ్లప్పుడు ఆయన తండ్రి గారు మచిలీపట్నం వలస వచ్ఛారు. చల్లపల్లి జమీందారు స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని ఛేసేవారు. ఆయన ఇద్దరు మొగపిల్లల్లో నాగేంద్రరావు గారు రెండవ వారు.ఈయన ఆజన్మ బ్రహ్మచారి.
[మార్చు] చిత్ర సమాహారం
- 1. సి.ఐ.డి (1965) (writer)
- 2. శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) (adaptation)
- 3. మహామంత్రి తిమ్మరుసు (1962) (writer)
- 4. గుండమ్మ కథ (1962) (screen adaptation)
- 5. జగదేకవీరుని కథ (1961) (writer)
- 6. మహాకవి కాళిదాసు (1960/I) (dialogue) (screenplay)
- 7. పెళ్ళినాటి ప్రమాణాలు (1958) (dialogue) (story)
- 8. మాయా బజార్ (1957/I) (dialogue) (story) (screen adaptation)
- 9. మిస్సమ్మ (1955) (writer)
- 10. చంద్రహారం (1954) (writer)
- 11. పాతాళ భైరవి (1951) (dialogue) (story)
- 12. గుణసుందరి కథ (1949) (dialogue)
- 13. వింధ్యారాణి (1948) (dialogue) (story)
- 14. శ్రీకృష్ణ లీలలు (1935) (dialogue)

