మచిలీపట్నం

వికీపీడియా నుండి

(బందరు నుండి దారిమార్పు చెందింది)
  ?మచిలీపట్నం మండలం
కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లా జిల్లా పటములో మచిలీపట్నం మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో మచిలీపట్నం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°10′N 81°08′E / 16.17, 81.13
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము మచిలీపట్నం
జిల్లా(లు) కృష్ణా జిల్లా
గ్రామాలు 28
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
250,521 (2001)
• 125334
• 125187
• 71.46
• 76.67
• 66.24

అక్షాంశరేఖాంశాలు: 16°10′N 81°08′E / 16.17, 81.13

మచిలీపట్నం (మచిలీపట్టణం) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా కు ముఖ్యపట్టణం మరియు తీర పట్టణం. దీనిని బందరు లేదా ముసలిపట్నము లేదా ముసుల అని కూడా పిలుస్తారు.[1] ఈ పట్టణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ప్రత్యేక పురపాలక సంఘ స్థాయి కల్పించబడింది. ఈ పట్టణం చరిత్ర 3 వ శతాబ్ధం శాతవాహనుల కాలములో నుండి ఉన్నదని దానిని మైసలోస్ (టోలిమి) మసిలా (పెరిప్లస్) అని పిలిచేవారని తెలుస్తున్నది.[2]. తీరపట్టణం అవడం చేత 17 వ శతాబ్ధములో బ్రిటీష్ వారు, ఫ్రెంచ్ వారు డచ్ వారు ఇక్కడనుండి వర్తకం జరిపేవారు. 350 పడవలు పట్టే సన్నకారు చేపల రేవు ఉన్నది. ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి (కూరగాయల నుండి తీసిన రంగుల), తివాచీలకు, బందరు లడ్డు లకి ప్రసిద్ధి.[3][4][5] ఒంగోలు, మచిలీపట్నం మధ్య నున్న తీర ప్రాంతం తరచు తుఫాను మరియు వరదల బారిన పడుతుంటుంది. బియ్యము, నూనె గింజలు, బంగారపు పూత నగలు మరియు వైజ్ఞానిక పరికరాలు ఇక్కడి ఇతర ఉత్పత్తులు.

విషయ సూచిక

[మార్చు] చారిత్రక ప్రశస్తి

బందరుకి మచిలీపట్నం అన్న పేరు రావటానికి వెనుక కథ ఒకటి ఉంది. సముద్రపుటొడ్డున ఉన్న కోట ద్వారం దగ్గర ఒక చేప విగ్రహం ఉండేది. అందుకని ఈ ఊరికి మచిలీపట్నం అన్న పేరొచ్చిందంటారు. 'మచిలీ' అంటే హిందీలో చేప, పట్నం అంటే పెద్ద ఊరు.

తెలుగు దేశంలో పట్టణం అనేది సర్వసాధారణంగా సముద్రపు ఒడ్డున ఉన్న రేవులకే వాడతారు. ఉదాహరణకు చెన్నపట్నం, విశాఖపట్టణం, భీమునిపట్నం, కళింగపట్నం, నిజాంపట్నం మొదలైనవి. పట్నంతో ముగిసే పేర్లు కల ఊళ్ళు అన్ని తూర్పుకోస్తాలో ఉన్నాయి. నర్సీపట్నం మినహాయించి.. ఫైలు:MTM.jpg

[మార్చు] ప్రముఖ వ్యక్తులు

[మార్చు] కలంకారి అద్దకము మరియు ఇతర కళలు

ఫైలు:Kalamkari-spread.jpg
కలంకారీ తివాచీ

మచిలీపట్నపు కలంకారీ వస్తువులు ప్రసిద్ధి చెందినవి. దుస్తులు, తివాచీలు, గోడకు వేలాడతీసే వస్తువులు మొదలైనవి కలంకారీ చేసే వస్తువులలో ముఖ్యమైనవి. కలంకారీ అనేది ఒక విధమైన అద్దకము పని. కలంకారీ అనే పేరు కలం అనే పర్షియన్ పదం నుండి వచ్చింది. కలం అంటే ఒక రకమైన పెన్ను. వెదురు బొంగుకి చివర ఖద్దరు గుడ్డ చుట్టి దానితో దుస్తుల మీద కాని తివాచీల మీద కాని రంగులు పులుముతారు. ఈ రంగులు నూనెగింజల నుండి లేదా కూరగాయల నుండి తయారు చేస్తారు. ఈ కలంకారీ పనిలో ఉతకడం, పిండడం, నానబెట్టడం, బ్లీచింగ్ చేయడం, కొన్ని మోడరెంట్లు, రంగులు కలపడం చేస్తారు.

నీలం రంగుకు నీలిమందు, ఎరుపు కొరకు మంజిష్ఠ, పసుపుపచ్చ కోసం మామిడి చెక్క మరియు ఎండు కరక్కాయ, నలుపురంగు కోసం తాటిబెల్లం మరియు తుప్పుపట్టిన ఇనుములను ఉపయోగిస్తారు. ఈ అద్దకము అనేక రోజులపాటు సాగే పెద్ద ప్రక్రియ. కొన్ని చిన్న భాగాలు చేత్తో గీసినా, విస్తారమైన పెద్ద వస్తువులను అచ్చుతో అద్దుతారు. పౌరాణిక కథలు, పాత్రలు చిత్రించబడి గోడకు వేళ్ళాడదీసుకొనే వస్తువుల తయారీకి కాళహస్తి పేరుపొందినది. అదే విధంగా మచిలీపట్నం, చీరలలో ఉపయోగించే అచ్చుతో అద్దిన పెద్ద వస్తువులకు పెట్టింది పేరు. మచిలీపట్నంలో అచ్చులతోటీ, చేతితోటీ వేసే అద్దకం పనిలో పూలూ, మొక్కల డిజైన్ల తోటి ఎంతో అందంగా ఉంటాయి. ఈ అద్దకం పనులు స్థానిక పాలకుల ఆదరం పొందడమే కాక, బాగా ఎగుమతి కూడా అయ్యేవి. ఈ ఎగుమతులు మచిలీపట్నంపై ఐరోపా వర్తకులకు మోజు కలిగించింది.

[మార్చు] బందరు లడ్డు

బందరులో 150 సంవత్సరాల క్రితం స్ధిరపడిన సింగుల కుటుంబాలు బందరు లడ్డుల సష్టికర్తలుగా చెపుతారు. బొందిలీ లు అని కూడా పిలచే సింగుల కుటుం బాలు బందరులో ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. వీరిలో ఎవరు ఇప్పుడు ఈ లడ్డుల తయారీలో కానీ, ఈ వ్యాపారంలో కానీ లేరు. ఆ కుటుం బాల వద్ద పనిచేసి లడ్డు తయారీ నేర్చు కున్న ఒకటి రెండు కుటుంబాలలో ఒక కుటుంబం ఇప్పటికీ ఆ వ్యాపారాన్ని విడచిపెట్టలేదు. అందుకే బందరు లడ్డు అనగానే బందరులో ఠక్కున శిర్విశెట్టి సత్యనారాయణ కేరాఫ్‌ తాతారావు పేరు చెపుతారు. తాతారావును ఇప్పటికీ మిఠాయి కొట్టు తాతారావుగా పిలుస్తుంటారు. గత 50 ఏళ్లుగా ఆయన ఈ వ్యాపారంలో వున్నారు. బందరు లడ్డును తొక్కుడు లడ్డూ అని కూడా అంటా రు. స్వచ్ఛమైన శనగపిండి నుండి ముందు పూస తీస్తారు. దాని నాణ్యతలో ఎక్కడా రాజీలేకుండా ఘుమఘు మలాడే అతి స్వచ్ఛమైన నేతితో వేయించి ఆ తరువాత దంచుతారు. దాన్నలా ఉంచి సరైనపాళ్లలో బెల్లం పాకం తయారు చేస్తారు.ఆ పాకాన్ని దంచుతున్న పొడిలో పోస్తూ తొక్కుతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి సుమారు 9 గంటలు పడుతుంది. సరైన పక్వానికి వచ్చిన దశలో యాల కులు, పటికబెల్లం చిన్నచిన్న ముక్కలుగా చేసి కలిపి ఆ తరువాత లడ్డూలుగా చుడతారు. ఆ విధంగా తయారైన లడ్డూ 20 రోజులపాటు నిల్వ ఉంటుం ది. ఈ లడ్డులో ఎటువంటి రంగు, రసాయనాలు కలుపరు.

సాహిత్య సంస్థలు:

"సాహితీమిత్రులు" పేరుతో మినీకవిత పితామహుదు డా.రావి రంగారావు వ్యవస్థాపకాధ్యక్షుడిగా గత 30 సమ్వత్సరాలనుండి ఈ సంస్థలో కృషిచేస్తున్నారు. ఇప్పటివరకు సంస్థ పక్షాన 62 పుస్తకాలు ప్రచురించారు. 2000లో శతావధానం, 2001లో ద్విశతావధానం, కవిత్వశిక్షణ వర్కుషాపులు అనేకం నిర్వహించారు.

[మార్చు] శాసనసభ నియోజకవర్గం

[మార్చు] దర్శనీయ స్థలాలు

  • మంగినపూడి బీచ్ మచిలీపట్నానికి 11 కి.మీ. దూరంలో ఉంది. బెస్తవారు ఉండే చిన్న గ్రామమిది. ఇక్కడి బీచ్ లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది. విదేశీయులకు తూర్పు తీరానికి చేరడానికి ఇది ముఖ ద్వారముగా ఉండేది. ఇక్కడి బీచ్ లో సముద్రము లోతు తక్కువగా ఉంటుంది. ఈ బీచ్ లో ఉన్న నాట్య పాఠశాల లో నృత్య విద్యార్థులకు కూచిపూడి నృత్యము నేర్పిస్తున్నారు. ఇక్కడ తీరములో ఉన్న దత్తాశ్రమము ఒక పుణ్యక్షేత్రము మరియు తీర్థ స్థలము. దీనిని దత్తరామేశ్వరము అని కూడా పిలుస్తారు.ఇక్కడ ఉన్న శివాలయం చాలా పురాతనమైనది. రామేశ్వరములో ఉన్నట్లుగా ఇక్కడ మంగినపూడిలో పన్నెండు బావులు లింగాకారంలో ఉంటాయి. అంతే కాదు ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయంటారు. [6] అందువలన దీనిని దత్తరామేశ్వరము అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమికి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్నానము చేస్తారు.
  • పాండురంగస్వామి దేవాలయము: మచిలీపట్నానికి దగ్గరలో ఉన్న చిలకలపూడి లో ఈ పాండురంగస్వామి దేవాలయం ఉన్నది. ఇది మంగినపూడి బీచ్ కి చాలా దగ్గరలో ఉన్నది. ఇక్కడి దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు. పండరీపురములో ఉన్న దేవాలయము వలే ఇక్కడ దేవాలయము ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం చాలా విశాలంగా ఉంటుంది. అంతరాలయములోనున్న పాండురంగడి నల్లరాతి విగ్రహం మరియు గర్భగుడి బయటవున్న పాలరాతి అమ్మవార్ల విగ్రహలు చూపరులను భక్తిభావముతో కట్టిపడెస్తాయి. భక్తులు పాండురంగడిని అరాధించి, పటికబెల్లం నైవేద్యముగా సమర్పిస్తారు.
  • ఘంటసాల: మచిలీపట్నానికి 21 కి.మీ. దూరములో ఉన్న ఈ గ్రామములో పురాతన భౌద్ధ స్థూపాలు ఉన్నాయి. ఘంటసాల గ్రామములో జలదీశ్వరుడి దేవాలయము ఉన్నది.
  • అగస్త్యేశ్వర దేవాలయము: మచిలీపట్నానికి 36 కి.మీ. దూరములో ఉన్న శివాలయం. ఇక్కడ ప్రధాన దైవము ఏకరాత్రి మల్లికార్జున స్వామి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు విశేషముగా జరుగుతాయి.[7]

[మార్చు] ఇతర విశేషాలు

ఇక్కడి హిందూ కళాశాల ఎందరో ప్రముఖులకు విద్యాదానం చేసింది. బందరులో ఉన్న మరొక కళాశాల పేరు ఆంధ్ర జాతీయ కళాశాల. కోపల్లె హనుమంతరావు ఈ కళాశాల 1910లో స్థాపించారు. ఈ కళాశాల ప్రాంగణంలో మహాత్మా గాంధీ రెండు సార్లు విడిది చేశారు. దీనిని నేషనల్ కాలేజి అని కూడ అంటారు. ఈ కాలేజికి అడవి బాపిరాజు మొదలైన మహానుభావు లెందరో ప్రధాన ఉపాధ్యాయులుగా పని చేశారు.

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] మూలాలు


తుమ్మలఛెరువు->


<!-తుమ్మలఛెరువు-->

పేజీకి సంభందించిన లింకులు