అమలాపురం
వికీపీడియా నుండి
| ?అమలాపురం మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | అమలాపురం |
| జిల్లా(లు) | తూర్పు గోదావరి |
| గ్రామాలు | 16 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
134,785 (2001) • 67636 • 67149 • 79.73 • 85.09 • 74.33 |
అమలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. గోదావరి నదీ జలముల మధ్య ఏర్పడిన త్రిభుజాకారపు సుందర కోనసీమలో ముఖ్యమైన ప్రదేశము ఈ అమలాపురం.అమలాపురం తూర్పు గోదావరి జిల్లాకాకినాడ కు 65 కి.మి దూరం లో ఉన్నది.
విషయ సూచిక |
[మార్చు] అమలాపురం పట్టణ చరిత్ర
అమలాపురం పూర్వనామం అమృతపురి. కాలక్రమేణా అమ్లీపురిగా మార్పు చెందింది. ఈ అమ్లీపురి కాలానుగతంగా అమలాపురంగా మారింది. అమలాపురంలో ఉన్న అమలేశ్వర స్వామి, సిద్దేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల వల్ల ఈ ఊరు పంచలింగాపురంగా కూడా పిలవబడేది. కోనసీమలో మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ అమలాపురంలోని SKBR కాలేజ్. ఇది సుమారు 60 ఏళ్ళ చరిత్ర కలిగిన కాలేజ్.
- అమలాపురంకి చెందిన ప్రముఖులు
- కళా వెంకట్రావు,
- GMC బాలయోగి (లోక్ సభ మాజీ స్పీకర్),
- BSమూర్తి (కేంద్ర మాజీ న్యాయ శాఖా మంత్రి),
- పలచోళ్ళ వెంకట రంగయ్య నాయుడు (కోనసీమ మొదటి IPS).
- గొలకోటి నరశింహ మూర్తి (మొదటి MLA)
- పుత్సా కృష్ణ కామేశ్వర్(గణితగని రచయిత)
[మార్చు] రవాణా సదుపాయాలు
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు. దగ్గరలో కోటిపల్లి స్టేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధానపట్టణాలైన విజయవాడ, హైదరాబాద్,విశాఖపట్ణం, రాజమండ్రి తదితర పట్టణాలకు బస్సు శౌకర్యం ఉంది. వివిద నగరాలకు దూరం: హైదరాబాద్ - 493 కి.మీ విజయవాడ - 198 కి.మీ విశాఖపట్ణం - 238 కి.మీ దగ్గరలోని రైల్వే స్టేషన్ : రాజమండ్రి, కాకినాడ.
[మార్చు] ప్రసిద్ధ దేవాలయాలు
- వేంకటేశ్వరస్వామి దేవాలయం,
- సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం,
- చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం అమలాపురం శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
[మార్చు] అమలాపురం పట్టణం నుండి ప్రముఖులు
భారత దేశపు 12వ, 13వ లోక్ సభాపతి పదవులను చేపట్టిన గంటి మోహన చంద్ర బాలయోగి అమలాపురం నియోజకవర్గం నుండే పోటి చేసి గెలుపొందాడు. ఈ ఊరిలో ఉన్నట్టి శ్రీభూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ కృష్ణేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానములు ప్రసిద్ధమైనవి. ఇవియేగాక ఈ పట్టణం లో రెండు సాంకేతిక కళాశాలలు (ఇంజినీరింగ్ కాలేజీలు), ఒక వైద్య కళాశాల (మెడికల్ కాలేజీ) ఉన్నవి.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- పాలగుమ్మి
- నడిపూడి
- నల్లమిల్లి
- ఎ.వేమవరం
- భట్నవిల్లి
- జనుపల్లి
- ఈదరపల్లి
- ఇందుపల్లి (అమలాపురం)
- గున్నపల్లి అగ్రహారం
- సాకూరు
- పేరూరు4
- ఇమ్మిడివరప్పాడు
- తాండవపల్లి
- వన్నె చింతలపూడి
- సమనస
- గరువు
- బండారులంక
- చిందాడగరువు
[మార్చు] బయటి లింకులు
|
|||||||