విజయనగరం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?విజయనగరం ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 6,539 కి.మీ² (2,525 చ.మై) |
| ముఖ్య పట్టణము | విజయనగరం |
| ప్రాంతం | కోస్తా |
| జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
2,245,000 (2001) • 343/కి.మీ² (888/చ.మై) • 412000 • 1120000 • 11200004 • 51.82 • 63.0 • 40.73 |
అక్షాంశరేఖాంశాలు: విజయనగరం జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉన్నది. విజయనగరం ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. 1979 జూన్ 1 న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉన్నది. 2001 జనాభా లెక్కల ప్రకారము విజయనగరం జిల్లా యొక్క జనాభా 22,45,100.
విషయ సూచిక |
[మార్చు] విజయనగరం పట్టణం
విజయనగరం పట్టణం చారిత్రక ప్రశస్తి కలిగినది. ప్రపంచప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకంలోని ప్రధాన వేదిక విజయనగరమే! పట్టణంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలు - అయ్యకోనేరు, బొంకులదిబ్బ మొదలైన వాటి ప్రస్తావన ఈ నాటకంలో ఉంది. ఆ నాటక రచయిత గురజాడ అప్పారావు విజయనగరం రాజావారి ఆస్థానంలో ఉద్యోగస్తుడే.
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు విజయనగరం పట్టణంలో 300 ఏళ్లుగా జరుగుతున్నాయి. బొబ్బిలియుద్ధం సమయంలో విజయనగర రాజుల ఆడపడుచైన పైడితల్లి ఆత్మాహుతికి పాల్పడి ఇలవేల్పుగా అవతరించినట్లు భావిస్తారు. అప్పటినుంచి ఆమెను భక్తితో పూజిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు దీనికి హాజరవుతారు.
విజయనగరం పట్టణం మధ్యలో 'పెద్ద చెరువు' చాలా విశాలమైనది. 18వ శతాబ్దంలో కోట నిర్మాణానికి కావల్సిన మట్టి కోసం దీన్ని తవ్వించారు. ఈ చెరువులోని నీటితో ఆయకట్టు రైతులు ఏటా మూడు పంటలు పండిస్తుంటారు. ఈ చెరువు పశ్చిమ భాగంలోనే 'పైడిమాంబ' విగ్రహం సాక్షాత్కారమైనది. ఈ చెరువులోనే అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
విద్యుశ్చక్తి లేని రోజుల్లో నాటి పురపాలక సంఘం వారు 'మూడు లాంతర్లు కూడలి' లో మూడు వైపులా మూడు హరికెన్ లాంతర్లు ఏర్పాటుచేశారు. రాత్రిపూట నెల్లిమర్ల, ధర్మపురి, గంటస్తంభం దారులలో ఎడ్లబళ్ళుతో వెళ్ళేవారికి, పాదచారుల సౌకర్యార్ధం నెలకొల్పారు. విజయనగర రాజులు 'అవృతఖానా' ను పెద్ద పూలకోటలో నిర్మించారు. 'ఖానా' అంటే మదుము అని 'అవృత' అనే ఆంగ్లపదంతో కలిసి రూపొందింది. 'నీరు బయటకు పోయే మదుము' అని దీని అర్ధం. ఇది గంటస్తంభం నమూనాలో ఉన్నది. పైభాగంలో స్నానానికి అనువుగా పెద్ద తొట్టె ఉన్నది. క్రిందిభాగంలో నుయ్యి, దిగడానికి మెట్లు వున్నాయి. మహారాజులు ఇందులో స్నానాలు చేసేవారని పెద్దలు అంటారు.
కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని 'బొంకుల దిబ్బ' అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. 'బంకు' అనేది మహారాష్ట్ర పదం దీనికి 'తలవాకిట పహరా' అని అర్ధం. కాలక్రమేణా ఈ బంకులదిబ్బే బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉన్నది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ఇంజినీరు పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది.
[మార్చు] చరిత్ర
విజయనగరం ఒక సంస్థానం. పూసపాటి వంశం వారు దీని పాలకులు. 1754 లో, విజయనగర పాలకుడైన పూసపాటి విజయరామ గజపతి రాజు, ఫ్రెంచి వారితో ఒప్పందం కుదుర్చుకొని, తన పాలన సాగించాడు. కానీ కొంత కాలానికే ఈ సంస్థానం బ్రిటిషు వారి ఏలుబడిలోకి వెళ్ళింది. స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటిషువారి ఏలుబడిలోనే ఉంది.
[మార్చు] విజయనగరం కోట
విజయనగర రాజులు మొదట్లో కుమిలి లోని మట్టి కోటలో నివసించేవారు. ఆనంద గజపతి రాజు విజయనగరం కోట నిర్మాణాన్ని క్రీ.శ. 1712-1714 ల మధ్య ప్రారంభించారు. అయిదు విజయాలకు చిహ్నంగా అనగా విజయ నామ సంవత్సరంలో, విజయదశమి, మంగళవారం నాడు (తెలుగులో జయవారం) ఈ కోట నిర్మాణం మొదలైంది. తన కుమారుడు విజయరామ రాజు పేరిట దీనికి 'విజయనగరం' అని పేరు వచ్చింది. అయితే 1717 సంవత్సరంలో ఆనందరాజు పరమపదించగఅ విజయరామరాజు కోట నిర్మాణాన్ని పూర్తిచేశారు.
విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. కోట చుట్టూ 19,653 చదరపు అడుగుల కందకం తవ్వించారు. నాడు కందకం నిండా నీరు ఉండేది. ఇది సుమారు రెండు ఏనుగులు మునిగేటంత లోతు ఉంటుంది. గోడలు సుమారు 30 అడుగుల ఎత్తు కలిగివున్నాయి.
[మార్చు] పూసపాటి వంశం
- పూసపాటి అమల రాజు (స్థాపకుడు)
- పూసపాటి రాచి రాజు
- పూసపాటి తమ్మ భూపాలుడు (1620-1670)
- పూసపాటి పెద విజయరామ రాజు (1670-1756)
- పూసపాటి చిన విజయరామ రాజు (1760-1794)
- పూసపాటి విజయరామ గజపతి రాజు (1826-1879)
- పూసపాటి ఆనంద గజపతి రాజు (1879-1897)
- పూసపాటి విజయరామ గజపతి రాజు (1883-1902)
- పూసపాటి అలక నారాయణ గజపతి రాజు (1902-1937)
- పూసపాటి విజయరామ గజపతి రాజు (1945-1995)
- పూసపాటి ఆనంద గజపతి రాజు (1950- )
- పూసపాటి అశోక గజపతి రాజు (1951- )
- పూసపాటి కార్తికేయ విజయవంశీరామ రాజు (1983- )
[మార్చు] నియోజకవర్గాలు==నియోజక వర్గ పునర్విభజనలో విజయనగరం జిల్లాలొని పార్లమెంట్క్ష్ నియోజక వర్గాలు ఒకటికి తగ్గిపోయాయి.=
[మార్చు] లోకసభ నియోజకవర్గాలు
- విజయనరగం
- పార్వతీపురం 2009 నుంఛీ నియొజక వర్గ హోదా కోల్పోయింది. అరకు పార్లమేంట్క్ష్ స్థానం లొ కలిసి పోయింది
- బొబ్బిలి2009 నుంఛీ నియొజక వర్గ హోదా కోల్పోయింది. అరకు పార్లమెంట్ స్థానంలొ కలిసి పోయింది.
[మార్చు] శాసనసభ నియోజకవర్గాలు: నియోజక వర్గ పునర్విభజనలో విజయనగరం జిల్లాలొని అసెంబ్లీ నియోజక వర్గాలు తొమ్మిదికి తగ్గిపోయాయి.
- సాలూరు
- శృంగవరపుకోట
- భోగాపురం 2009 నుంఛీ నియొజక వర్గ హోదా కోల్పోయింది.
- విజయనగరం
- బొబ్బిలి
- చీపురుపల్లి
- తెర్లాం ...2009 నుంఛీ నియొజక వర్గ హోదా కోల్పోయింది.
- పార్వతీపురం
- సతివాడ ...2009 నుంఛీ నియొజక వర్గ హోదా కోల్పోయింది.
- గజపతి నగరం
- ఉత్తరపల్లి... 2009 నుంఛీ నియొజక వర్గ హోదా కోల్పోయింది.
- నాగూరు ... 2009 నుంఛీ నియొజక వర్గ హోదా కోల్పోయింది.
- నెల్లిమర్ల కొత్తగా ఏర్పడిన నియొజకవర్గం.
- కురుపాం కొత్తగా ఏర్పడిన నియొజకవర్గం.
[మార్చు] విజయనగరం శాసనసభా నియోజకవర్గం
- పూర్తి వ్యాసం విజయనగరం శాసనసభా నియోజకవర్గం లో చూడండి.
- విజయనగరం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గం. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత విజయనగరం మండలాన్ని మాత్రం ఇందులో ఉంచారు.
[మార్చు] పైడితల్లి అమ్మవారి దేవాలయం
పైడిమాంబ లేదా పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం మరియు పూసపాటి రాజుల ఇలవేల్పు. అమ్మవారి దేవాలయం మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై 250 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. క్రీ.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి అనే వ్యక్తి పైకి తీశారు. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగఅ పూజారులుగా ఉంటున్నారు. ప్రస్తుత పూజారి బంటుపల్లి బైరాగి నాయుడు ఆరో తరంవాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆసీర్వదిస్తారు.
[మార్చు] అమ్మవారి ఆత్మకథ
చారిత్రాత్మకంగా ఈమె పెద విజయరామరాజు చెల్లెలు. పసిప్రాయం నుండి అధ్యాత్మిక భావాలతో దేవీ ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది. బుస్సీ కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్కచేయలేదు. 1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు. వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని ఫణంగా పెట్టి విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు. కానీ విజయం విజయరామరాజునే వరించింది. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది. ఉపవాసదీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు, మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని బొబ్బిలి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్నది. తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్టించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయ్యింది.
[మార్చు] జాతర
అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవం చాలా ప్రాముఖ్యమున్నది. సిరిమాను అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూచ్చుని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం.[1]
[మార్చు] కొన్ని విశేషాలు
- రెవెన్యూ విభాగాలు (2): విజయనగరం, పార్వతీపురం
- నదులు: గోస్తని, చంపావతి, నాగావళి, గోముఖనది, సువర్ణముఖీ, వేగావతి. నాగావళిని దిగువ ప్రాంతాల్లో లాంగుల్య నది అని వ్యవహరిస్తారు.
- దర్శనీయప్రదేశాలు
- బొబ్బిలి, తాటిపూడి, పుణ్యగిరి, కుమిలి, రామతీర్థం. బొబ్బిలి చారిత్రక ప్రదేశాలు కాగా రామతీర్థం పుణ్యక్షేత్రం. ఇక్కడే బౌద్ధ స్తూపం కూడా ఉంది.
- ఆంధ్రుల పౌరుషాన్ని చాటిచెప్పిన బొబ్బిలి యుద్ధం జరిగిన జిల్లా.
- మహాకవి గురజాడ అప్పారావు జన్మ స్థానం.
- హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జన్మస్థలం.
- సుప్రసిద్ద తెలుగు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతం నేర్చుకున్నది విజయనగరం లొనే.
- సుప్రసిద్ద తెలుగు గాయకురాలు పి.సుశీల గారి జన్మస్థలం.
- కలియుగ భీమ గా పిలువబడే కోడి రామమూర్తి జన్మ స్థలం.
- సాలూరి రాజేశ్వరరావు గారు కూడ ఈ ప్రాంతానికి చెందినవారు.
[మార్చు] విజయనగరం మండలాలు
భౌగోళికంగా విజయనగరం జిల్లాను 34 రెవిన్యూ మండలములుగా విభజించినారు.[2]
![]() |
1 కొమరాడ | 13 రామభద్రపురం | 25 పూసపాటిరేగ |
| 2 గుమ్మలక్ష్మీపురం | 14 బాడంగి | 26 భోగాపురం | |
| 3 కురుపాం | 15 తెర్లాం | 27 డెంకాడ | |
| 4 జియ్యమ్మవలస | 16 మెరకముడిదాం | 28 విజయనగరం మండలం | |
| 5 గరుగుబిల్లి | 17 దత్తిరాజేరు | 29 గంట్యాడ | |
| 6 పార్వతీపురం | 18 మెంటాడ | 30 శృంగవరపుకోట | |
| 7 మక్కువ | 19 గజపతినగరం | 31 వేపాడ | |
| 8 సీతానగరం | 20 బొండపల్లి | 32 లక్కవరపుకోట | |
| 9 బలిజిపేట | 21 గుర్ల | 33 జామి | |
| 10 బొబ్బిలి | 22 గరివిడి | 34 కొత్తవలస | |
| 11 సాలూరు | 23 చీపురుపల్లి | ||
| 12 పాచిపెంట | 24 నెల్లిమర్ల |
[మార్చు] మూలాలు
- ↑ ఈనాడు పత్రిక విజయనగరం జిల్లా సంచికలో 2001 అక్టోబరు 24 వ తేదీ నాటి వార్త ఇది. (ఈ లింకుకు మూడు నెలల్లో కాలదోషం పడుతుంది.)
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటులో విజయనగరం జిల్లా తాలూకాల వివరాలు. జూలై 28, 2007న సేకరించారు.
- ఈనాడు విజయనగం ఎడిషన్ 14 అక్టోబర్ 2008 తేదీన, శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ప్రత్యేక అనుబంధంలో ప్రచురించిన సమాచారం.
[మార్చు] బయటి లింకులు
విజయనగరం జిల్లా అధికారిక వెబ్సైటు
|
||||||||||||||||||||||||||
|
||||||||||||||
