Coordinates: 18°06′39″N 83°24′38″E / 18.11083°N 83.41056°E / 18.11083; 83.41056

విజయనగరం కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయనగరం కోట
విజయనగరం కోట రక్షణ గోడ
విజయనగరం కోట is located in India
విజయనగరం కోట
Shown within India
ఇతర పేర్లుపూసపాటి వారి కోట
స్థానంవిజయనగరం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ , భారత దేశం
నిర్దేశాంకాలు18°06′39″N 83°24′38″E / 18.11083°N 83.41056°E / 18.11083; 83.41056
రకందుర్గం లేదా కోట
పొడవు240 feet (73 m)
వెడల్పు240 feet (73 m)
ఎత్తు20 feet (6.1 m)
చరిత్ర
స్థాపన తేదీ1713
వదిలేసిన తేదీఆక్రమితం
స్థల గమనికలు
యజమానివిజయనగరం రాజులు

విజయనగరం కోట, దక్షిణ భారతదేశంలోని ఈశాన్య ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో 18 వ శతాబ్దపు కోట. దీనిని 1713 లో విజయనగర మహారాజు విజయ రామరాజు నిర్మించారు.ఈ కోట నిర్మించకుముందు వారు కుమిలి అనే ప్రదేశంలో మట్టి కోటలో ఉన్నట్లు తెలుస్తుంది.[1] కోటకు పునాది వేసిన అధికారక వేడుకరోజు చాలా శుభప్రదమైంది. ఎందుకంటే ఇది విజయానికి ఐదు సంకేతాలను సూచిస్తుంది. చదరపు ఆకారంలో ఉన్న కోటలో రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన ప్రవేశ ద్వారం "నగర్ ఖానా" విస్తృతమైన నిర్మాణ లక్షణాలను కలిగి ఉంది.కోట లోపల అనేక దేవాలయాలు, రాజభవనాలు, విజయానికి చిహ్నంగా నిర్మించిన టవర్ ఉన్నాయి.

ఉనికి[మార్చు]

విశాఖపట్నంనకు వాయువ్య దిశలో 40 కి.మీ.దూరంలోని విజయనగరంలో ఉంది.కోటకు 18 కి.మీ దూరంలో బంగాళాఖాతం సముద్రం ఉంది.

కోట చరిత్ర[మార్చు]

కోట పశ్చిమ ద్వారం

విజయనగరం కోటను 1713 లో నిర్మించారు.ఇది ఐదు విజయానికి ఐదు సంకేతాలు కలిగియున్న ప్రదేశం.దీని స్థాపకుడు మహారాజ విజయ రామరాజు (1671-1717).ఇతనిని ఆనంద రాజు అని కూడా పిలుస్తారు. విజయనగరం మహారాజు.మహారాజుకు కోట నిర్మాణం కోసం మహారాజుకు ఈ ప్రదేశం అడవిలో తపస్సు చేస్తున్న ముస్లిం సాధువు మహాబుూబ్ వలి, అనువైన స్థలాన్ని సూచించాడు. కోట నిర్మాణానికి పునాది వేసే వేడుక రోజును పవిత్రమైన హిందూ క్యాలెండరు ప్రకారం దసరా పండగ రోజులలో పదవ రోజు (విజయం రోజు) విజయ దశమినాడు మంగళ వారం (జయ వారం అని అంటారు) నాడు ఎంపిక చేసి కోట కు శంకుస్థాపన చేయబడినట్లుగా తెలుస్తుంది.

కోట లక్షణాలు[మార్చు]

కోటలోని విజయనగరం ప్యాలెస్ ముందు దృశ్యం

కోటను రాతితో నిర్మించబడింది. కోట 240 మీటర్లు (790 అడుగులు) చదరపు ఆకారంలో, 10 మీటర్లు (33 అడుగులు) ఎత్తులో నిర్మించబడింది.కోట గోడలు పైభాగంలో వెడల్పు 8 నుండి 16 మీటర్లు (26-52 అడుగులు) వరకు ఉండేట్లుగా నిర్మించబడింది. కోట యొక్క నాలుగు మూలలు రాళ్ళతో చేసిన బురుజుల రూపంలో కోట కలిగి ఉంది.దాని లోపలి భాగం వాలుతో కలిగిన భూమిపై రాతి పలకలతో బలోపేతం చేయబడింది. కోటలోకి ప్రవేశించడానికి రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. తూర్పు నుండి ప్రవేశించే కోట ప్రధాన ద్వారాన్ని "నగర్ ఖానా" అని పిలుస్తారు.ఇది సొగసైన నిర్మాణ నమూనాలను కలిగి ఉంది. "నగర్ ఖానా" నిర్మాణానికి ముందు, ప్రవేశ ద్వారం వద్ద విజయానికి సంకేతంగా వంపు నిలిచి ఉంటుంది. పడమర ముఖ ద్వారం చిన్నదే కాని,ఇది కూడా ప్రధాన ద్వారం వలె నిర్మాణ లక్షణాలతో ఉంటుంది. కోట చుట్టూ ఒక కందకం చుట్టుముట్టింది.రెండు ప్రధాన ద్వారాలు కాకుండా, కోట లోపల అనేక దేవాలయాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. రెండు ముఖ్యమైన దేవాలయాలు హనుమంతుడి ఆలయం, "కోట శక్తి" అని పిలువబడే లక్ష్మి దేవి ఆలయం ఉంది.ఈ ఆలయంలోని లక్ష్మీదేవిని కోట యొక్క సంరక్షక దేవతగా భావిస్తారు. ఏదైనా యుద్ధ ప్రచారానికి ముందు రాజులు లక్ష్మి ఆలయంలో పూజలు జరిపే ఆచారం పాటించబడుతుంది.కోటలోప భాగంలో ముఖ్యమైన స్మారక చిహ్నాలు, మోతీ మహల్, రాజభవనం, అలకానంద ప్యాలెస్, కొరుకొండ ప్యాలెస్ ఉన్నాయి. కోట వెలుపల భాగంలో విజయానికి మరో చిహ్నంగా విజయ టవర్ అనే పేరుతో క్లాక్ టవర్ ఉంది. కోట వెలుపల ఉన్న మరో రెండు ముఖ్యమైన చారిత్రక కట్టడాలు మోడ్డుకోవిల్లు ఆలయం, పెర్లా హోమ్. కానీ ఇవి నగర పరిధిలో ఉన్నాయి.

ప్రధాన ద్వారాలు[మార్చు]

కోట రెండు ప్రధాన ద్వారాలు వాస్తుపరంగా, రాజస్థానీ శైలిలో నిర్మించబడ్డాయి.తూర్పు ప్రధాన ద్వారం "నగర్ ఖానా" అని పిలువబడుతుంది.ఎందుకంటే పైభాగంలో "డ్రమ్ టవర్" ఉంది, ఇది రాజ ఆదేశాలు, రాజ అతిథుల రాక గురించి ప్రజలకు తెలియజేయడానికి డ్రమ్స్ కొట్టడానికి ఉపయోగించబడతుంది. పశ్చిమ ద్వారం విజయనగరం కోటకు వెనుక వైపు ఉంది.ఈ ప్రవేశ ద్వారాన్ని రాజస్థానీ శైలిలో పైన పెవిలియన్‌తో నిర్మించారు. ఈ ద్వారం రాజ సమాధులకు ప్రాప్తిని అందిస్తుంది.దహన సంస్కారాల కోసం మృతదేహాలను అంత్యక్రియలకు బయటకు తీసే సాంప్రదాయ ప్రవేశ ద్వారం.గతంలో ఉన్న ఒక కందకం స్థానంలో, ఇప్పుడు బాగా పెరిగిన ఉద్యానవనం పడమటి ద్వారం వరకు విస్తరించి ఉంది.

మోతీ మహల్[మార్చు]

మోతీ మహల్ 1869లో విజయరామ రాజు -3 నిర్మించిన రాయల్ కోర్ట్ లేదా దర్బార్ హాల్. ఈ హాలు ప్రవేశద్వారం వద్ద రెండు పాలరాయి విగ్రహాలు ఉన్నాయి.ఇది గత కీర్తిని సూచించే ఒక స్మారక చిహ్నం. మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్ట్ వ్యవస్థాపకుడు అయిన విజయనగరరాజులలో ఒకరైన పివిజి రాజు.[2] దీనిని విరాళంగా ఇచ్చాడు.మొదటి అంతస్తులో మహిళల కోసం కళాశాల, కోట నుండి పాలించిన గత రాజుల కళాఖండాలు ఉన్న మ్యూజియం కూడా ఇక్కడ ఉంది.

ఉద్ ఖాన[మార్చు]

ప్యాలెస్ స్నానశాల మెట్ల మార్గం పైకి దారితీస్తుంది

ఇది ఉద్ ఖాన విజయనగరరాజులు గొప్ప రాజభవనం.ఈ ప్యాలెస్ యొక్క ప్రత్యేక భాగం రాజుల సౌకర్యార్థం నిర్మించిన ప్రత్యేకమైన స్నానశాల.ఇది ఫూల్ బాగ్ ప్యాలెస్ ప్రక్కనే ఉన్న అష్టభుజి రాతితో 15 మీటర్లు (50 అడుగుల) రాళ్ళతో నిర్మించిన ఎత్తులో, మురి మెట్ల మార్గాన్ని కలిగి ఉంటుంది, ఇది పైభాగంలో ఉన్న నీటి ట్యాంకుకు దారి తీస్తుంది. ఇది సమీపంలోని బావి నుండి నీటిని పంపింగు ద్వారా ఎక్కించబడుతుంది.

అలకానంద ప్యాలెస్[మార్చు]

అలకనంద ప్యాలెస్‌ను రాజ అతిథి గృహంగా నిర్మించారు. ఇది రాజ అతిథుల కోసం ఖరీదైన శైలిలో నిర్మించబడింది. ఇది నడక మార్గాలతో బాగా నిర్మించిన తోటలో ఏర్పాటు చేయబడింది.ఈ ప్యాలెస్ మైదానంలో రాయల్టీని ఉపయోగించడం కోసం ఇటీవలి సంవత్సరాలలో ఒక ఎయిర్‌స్ట్రిప్ నిర్మించబడింది. అయితే, ఈ ప్యాలెస్‌లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సాయుధ రిజర్వ్ పోలీసుల 5 వ బెటాలియన్ ఉంది.

కోరుకొండ ప్యాలెస్[మార్చు]

అలకానంద ప్యాలెస్‌కు దగ్గరగా కోరుకొండ ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్ చుట్టూ ఉన్న భూమి, సుమారు 1000 ఎకరాలు కలిగి ఉంటుంది.ఇది ఆట స్థలంగా ఉపయోగించబడుతుంది.ఈ ప్రదేశంలో బాగా తోటలు కలిగి ఉండి, ప్రస్తుతం విద్యాసంస్థలు నిర్మించబడ్టాయి. ఇంకా రక్షణ దళాలలో చేరాలని కోరుకునే యువతకు శిక్షణ ఇవ్వడానికి ఒక పాఠశాల కూడా ఉంది.

టవర్ క్లాక్[మార్చు]

గంట స్తంభం లేదా టవర్ క్లాక్

బ్రిటీషు రాజుల కాలంలో వారి ఆహ్వానం మేరకు తరచూ విజయనగరరాజులు లండన్ వెళ్లేవారు. లండన్ వెళ్లినప్పుడు లండన్లోని బిగ్ బెన్ తరహాలో ఉన్న క్లాక్ టవర్ చూసి,అదే తరహాలో కోటలో దీనిని నిర్మించారు. ఇది నగరం నడిబొడ్డున కోట పరిమితికి వెలుపల ఉంది.ఇది హైదరాబాదు నగరానికి చార్మినార్ ఎలాగో విజయనగరం పట్టణానికి టవర్ క్లాక్ అలాంటిది.1885 లో ఇసుకరాయితో నిర్మించిన అష్టభుజి టవర్ 68 అడుగుల (21మీటర్లు) ఎత్తుతో నిర్మించబడి ఉంది.[3]ఇది గతంలో పైభాగం తెల్లగా పెయింట్ చేయబడింది.తరువాత క్రీమ్, ఎరుపు రంగులతో పెయింట్ చేయబడింది.

ఇతర నిర్మాణాలు[మార్చు]

కోట పరిమితుల వెలుపల, పైడితల్లి అమ్మవార్కి అంకితం చేయబడిన ఒక పురాతన ఆలయం ఉంది.ఈ ఆలయాన్ని పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో భావిస్తారు.ఈ దేవత రాజ కుటుంబానికి చెందిన కుమార్తె యొక్క పునర్జన్మ రూపం అని పట్టణ ప్రజలు నమ్మకం.ఈ ఆలయంలో పూజించే దేవత యొక్క విగ్రహం కూడా 1757 లో విజయదశమి రోజున కనుగొనబడింది.ఆ రోజు అక్టోబర్ 21, 22 తేదీలలో " పైడితల్లి సిరిమానోత్సవం జాతర " వార్షిక వేడుకగా జరుగుతుంది.ఈ ఆలయంలో రెండు రంగులలో శివలింగం ఉంటుంది. ఇది శివ, పార్వతుల ఐక్యతకు ఉదాహరణగా చెప్పబడింది.

1895 లో నిర్మించిన "పెర్లా వరి" అని పిలువబడే పెర్లా హోమ్ నగరంలో బాగా నిర్వహించబడుతున్న స్మారక కట్టడాలలో ఒకటిగా చెప్పబడింది.ఇది ఈ ప్రాంతంలో విద్యుత్ కనెక్షన్ పొందిన మొట్టమొదటి భవనం. దీనికి వెండితో చేసిన మంచాలతో కూడిన బెడ్‌రూమ్ ఉంది.ఈ భవనంలో భాగమైన గ్రంధాలయం ఇప్పటికీ పనిచేస్తోంది.సొగసైన యూరోపియన్ ఫర్నీచర్ కలిగియుండి, గత కీర్తి యొక్క షాన్డిలియర్లు ఇతర కళాఖండాలతో ప్రదర్శనలో ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. https://telugu.nativeplanet.com/travel-guide/places-visit-vizianagaram-andhra-pradesh-000659.html
  2. "MRCP - VZM". web.archive.org. 2019-10-25. Archived from the original on 2019-10-25. Retrieved 2019-10-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Welcome to Vijayanagaram - Tourism". web.archive.org. 2019-10-25. Archived from the original on 2019-10-25. Retrieved 2019-10-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు[మార్చు]