ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు దిక్కుగా ప్రవహించే నదులలో ఒకటైన గోస్థని నది తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించి విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలలో ప్రవహిస్తుంది. చివరకుఈ నది బంగాళాఖాతంలో చారిత్రాత్మక నగరమైన భీమునిపట్నం వద్ద కలుస్తుంది. బొర్రా గుహలు దీని జన్మస్థానంలొ ప్రవాహం వలన సున్నపురాయి కోత మూలంగా భావిస్తున్నారు.
[మార్చు] గోస్తని నదిపై నిర్మించిన ప్రాజెక్టులు
తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్టు గోస్తని నదిమీద 1963-68 మధ్యకాలంలో[1] నిర్మించారు. ఇది విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో తాటిపూడి గ్రామంలో ఉన్నది. విజయనగరం జిల్లాలో15,378 ఎకరాల ఆయకట్టు భూములను నీరందించడం మరియు విశాఖపట్నం నగరానికి త్రాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ రిజర్వాయర్ 3 శతకోటి ఘనపు అడుగుల (TMC) నీటిని నిలువచేస్తుంది.
|
విజయనగరం జిల్లాకు సంబంధించిన విషయాలు |
|
| ప్రముఖ పట్టణాలు |
|
|
| ప్రముఖ దేవాలయాలు |
|
|
| పర్యాటక ప్రదేశాలు |
|
|
| ప్రాజెక్టులు |
|
|
| చారిత్రక కోటలు |
|
|
| నదులు |
|
|
| లోకసభ నియోజకవర్గాలు |
|
|
| శాసనసభ నియోజకవర్గాలు |
|
|