భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి.[1] 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. రంగారెడ్డి, వరంగల్, నల్గొండ మూడు జిల్లాలకు చెందిన శాసనసభ నియోజకవర్గములతో కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లానుంచి ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గములు, వరంగల్ జిల్లా నుంచి జనగామ శాసనసభ నియోజకవర్గముతో పాటు గతంలో మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, భువనగిరి శాసనసభ నియోజకవర్గములు దీనిలో కలిపారు.[2]

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 18,85,698[3]
  • ఓటర్ల సంఖ్య: 14,37,604
  • ఎస్సీ, ఎస్టీల సంఖ్య : 18.67%, 5.38%.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 14 భువనగిరి జనరల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 504103 నోముల నరసింహయ్య పు సె.పి.యం. 364215
2014 14 భువనగిరి జనరల్ బూర నర్సయ్య గౌడ్ పు తెలంగాణ రాష్ట్ర సమితి 5,04,103 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 4,17,751
2019 14 భువనగిరి జనరల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు బూర నర్సయ్య గౌడ్ పు తెలంగాణ రాష్ట్ర సమితి

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున చింతా సాంబమూర్తి పోటీ చేసారు.[4] కాంగ్రెస్ పార్టీ తరఫున కె.రాజగోపాల్ రెడ్డి పోటీ చేసారు.[5] ప్రజారాజ్యం పార్టీ తరఫున గెడ్డం చంద్రమౌళి గౌడ్ పోటీ చేసారు.[6] ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీప సి.పి.యం ప్రత్యర్థి అయిన నోముల నర్శింహయ్య పై విజయం సాధించారు.

2014 ఎన్నికలు[మార్చు]

2014 లో ఈ స్థానం నుండి టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గారు సమీప అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై గెలుపొందారు

2019 ఎన్నికలు[మార్చు]

2019 లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సమీప అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య పై గెలిచారు

2024 ఎన్నికలు[మార్చు]

లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.[7][8]

మూలాలు[మార్చు]

  1. EENADU (22 April 2024). "ఒక్క ఎంపీ స్థానం.. ఐదు జిల్లాలు". Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
  2. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92790&subcatid=8&categoryid=3
  3. సాక్షి పత్రిక, తేది 13-09-2008
  4. ఈనాడు దినపత్రిక, తేది 27-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  6. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  7. Andhrajyothy (30 April 2024). "బరిలో 61 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  8. Andhrajyothy (30 April 2024). "నల్లగొండ, భువనగిరి బరిలో 61 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.

ఇతర లింకులు[మార్చు]