ముడివేముల
గ్రామం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | త్రిపురాంతకం మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
Area code | +91 ( 08403 ) |
పిన్కోడ్ | 523326 |
ముడివేముల, ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
లువా తప్పిదం: Coordinates not found on Wikidataముడివేముల చరిత్ర-శ్రీనివాసప్రసాద్ తురిమెళ్ళ ఇక్ష్వాకులు సా.శ.225-625 మధ్య ఆంధ్రదేశమును పాలించిరి.వారితర్వాతవచ్చినవాలో ముఖ్యులు పల్లవరాజులు.త్రిలోచన పల్లవుడు సా.శ.458-80 మధ్య కాలమున శ్రీశైలము అనబడు అరణ్య ప్రదేశములను కొట్టించి బ్రాహ్మణులకు నివాసయోగ్యములుగా చేసి కొన్నిగ్రామములను అగ్రహారములుగా యిచ్చెను.ఇచ్చట ఒక చారిత్రికాంశముకలదు.చాళుక్యులమూల పురుషుడైన విజయాదిత్యుడు త్రిలోచనపల్లవునితో యుద్దైముచేసి మరణించెను.అతనుమరణించునాటికి అతని భార్య గర్భవతి.ఆమె తప్పించుకొనిపోయి హిరణ్యరాష్ట్రమున నేటి త్రిపురాంతకం సమీపమున గల "ముడివేము" గ్రామముచేరి విష్ణుభట్ట సోమయాజి అనుబ్రాహ్మణునిచే రక్షింపబడి, మగశిశువునుకనెను.ఆబాలుడు పెద్దవాడై పల్లవులను ఓడించి చాళుక్య రాజ్యస్థాపన చేసెను.ఆబాలుడు రాజైనపిదప విష్ణుభట్ట సోమయాజులకు ఆగ్రామమును అగ్రహారముగ యిచ్చెను.తదనంతరం ముడివేము ముడివేముల గ్రామము అయినది.దీనికిసమీపములోగల ఒడ్డుపాలెం అనుగ్రామముకలదు.ఈ ఊరిలో కొంతభాగమును చిన్నముడివేముల అనిపిలువబడును.చిన్నముడివేములకు ఉత్తరభాగమున ఒక చెరువుకలదు దీనికి వుత్తరభాగమున కొంత దూరమున నేటికి కొన్ని శాసనములు శిథిలమై కన్పించును.అలాగే ముడివేముల చిన్నముడివేముల మధ్య భాగమున కూడా దద్దనాలు అని పురాతన శిథిల శివాలయం కలదు