Jump to content

అందడు ఆగడు

వికీపీడియా నుండి
అందడు ఆగడు
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.డి.లాల్
తారాగణం కృష్ణంరాజు,
లత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ శ్రీకాంత్ పిక్చర్స్
భాష తెలుగు

అందడు ఆగడు 1979లో విడుదలైన 'క్రైమ్‌ థ్రిల్లర్' సినిమా.శ్రీకాంత్ నహతా నిర్మాత గా, ఎస్. డీ. లాల్ దర్శకత్వంలో , కృష్ణంరాజు, లత, జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.[1] ఇది హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే మానవ అక్రమ రవాణా మీద తీసిన సినిమా. ఇందులో అమ్మాయిలను అక్రమంగా విదేశాలకు తరలించటం ముఖ్య ఇతివృత్తం. ఈ చిత్రానికి మూలం, ధర్మేంద్ర నటించిన "కీమత్" అనే హిందీ చిత్రం.

"అందడు ఆగడు"లో ఆకట్టుకునే రెండు ప్రధాన అంశాలలో ఒకటి, యువకునిగా కృష్ణంరాజు అయితే, రెండవది, కేరళ బ్యాక్ వాటర్స్ లో చేసిన చిత్రీకరణ. కృష్ణంరాజు గారు ఈ సినిమాలో చాలా ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఫైట్స్ డాన్సులు చేయడం జరిగింది. ఎక్కువ శాతం కేరళలోని బ్యాక్ వాటర్స్ లో, బోట్ చేజులు, హార్బర్ లోని సీన్లు, ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి. కృష్ణంరాజు గారు క్లైమాక్స్ లో నవాబు గెటప్ లో పాడే పాట కూడా ఉంది.

ఈ సినిమాలో హీరోయిన్ అయిన లత తాగిన మైకంలో పాడే పాట, కృష్ణంరాజు గారితో ఊటీలో డ్యూయెట్ సాంగ్ ఉన్నాయి. ఈ సినిమాలో ఇంకా కవిత, విజయ లలిత కూడా ఉన్నారు. హిందీలో ప్రేమ్ చోప్రా వేసిన పాత్రను తెలుగులో మోహన్ బాబు గారు వేశారు. రంగనాథ్ పోలీసు ఇనస్పెక్టరుగా, రాజబాబు, కాంతారావు కూడా ఈ సినిమాలో ఉన్నారు. సత్యం సంగీతం, శ్రీకాంత్ గారి కెమెరా పనితనం ఈ సినిమాకి ఎంతో తోడ్పడ్డాయి.

సినిమా ఆఖరి 8 నిమిషాలు మోటార్ బోట్ల చేజులు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో అధిక భాగం షాట్లు, జేమ్స్ బాండ్ ఫిలిం, "లీవ్ అండ్ లెట్ డై" సినిమాలోని బోట్ చేజింగ్ షాట్లను, చాకచక్యంగా డూప్ చేసి, దానికి మ్యాచింగ్ గా ఇక్కడ లైవ్ షూటింగ్ లు చేశారు. అందువల్ల ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ మొత్తం చాలా ఎంగేజింగా, వినోదాత్మకంగా ఉంటుంది.

రంజిత్ ఘరానా పెద్దమనిషి. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమ్మాయిలను ప్రలోభపెట్టి వారిని భుజంగం అనే వ్యక్తి దగ్గరకు పంపిస్తాడు. భుజంగం ఆ అమ్మాయిలను విదేశాలకు విక్రయిస్తుంటాడు. తమ పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులను పురస్కరించుకుని పోలీసులు రంగంలో దిగుతారు. విజయ్ అనే గూఢచారిని భుజంగం ఆచూకీ తీయడానికి నియమిస్తారు. పద్మ అనే సంపన్నయువతి రంజిత్ వలలో పడుతుంది. ఆమెను రక్షించడానికి విజయ్ శతవిధాలా ప్రయత్నిస్తాడు. పద్మ అక్క లత విజయ్‌తో చేతులు కలుపుతుంది. లత కూడా రంజిత్ దగ్గరకు ఉద్యోగానికి వెడుతుంది. విజయ్ లతను వెంబడించి భుజంగం కోటలోకి ప్రవేశిస్తాడు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎస్.డి.లాల్
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • ఛాయాగ్రహణం: ఎస్.వి.శ్రీకాంత్
  • నిర్మాత: శ్రీకాంత్ నహతా
  • నిర్మాణ సంస్థ: శ్రీకాంత్ పిక్చర్స్
  • సాహిత్యం: ఆరుద్ర, సి నారాయణ రెడ్డి, వీటూరి
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి
  • విడుదల:30:03:1979.

పాటలు

[మార్చు]

ఈ సినిమా కోసం ఆరుద్ర రెండు పాటలను రచించారు. ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.[2]

  1. ఈ సంతలో ఒక చిన్నది నిలుచున్నది కొను వారెవ్వరో - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల బృందం
  2. నీ కోడె వయసు - నా ఆడ మనసు - రచన: ఆరుద్ర - గానం: ఎస్.జానకి
  3. ఏమని చెప్పేది ఎవరికి చెప్పేది ఎదలో ఈవేళ - రచన: సినారె -గానం: ఎస్.జానకి
  4. చిక్కడపల్లి చినదానా చిత్రమైనదానా ఏమైందో ఈ రోజున - రచన: వీటూరి -గానం: పి.సుశీల
  5. ఓ చిటికీ ఎంత ముద్దుగున్నావే ఓ పటికి ఎంత తియ్య - రచన: సినారె -గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Andhadu Aagadu (1979)". Indiancine.ma. Retrieved 2026-03-29.
  2. 2.0 2.1 వి.ఆర్. (7 April 1979). "చిత్రసమీక్ష - అందడు ఆగడు" (PDF). ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66 సంచిక 6. Archived from the original (PDF) on 11 నవంబరు 2022. Retrieved 13 December 2017.

బయటి లింకులు

[మార్చు]