ఎ లక్ష్మణ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1974 కరీంనగర్ ధర్మపురిలో జన్మించిన లక్ష్మణ్ కుమార్ ఐటిఐతో తన విద్యాభ్యాసన పూర్తి చేసి వ్యాపారవేత్తగా తన ప్రత్యక్ష జీవితాన్ని మొదలుపెట్టారు .

భారత జాతీయ కాంగ్రెస్లో నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఉంటూ అంచలంచెలుగా ఎదుగుతూ క్రింది స్థాయి నుంచి ఎన్నో పదవులు అధిరోహిస్తూ పార్టీలో బలమైన నేతగా ఎదిగారు లక్ష్మణ్ కుమార్.

కాంగ్రెస్ నేతగా జడ్పీ మాజీ చైర్మన్ గా.. డిసిసి అధ్యక్షుడిగా నియోజకవర్గంలో పరిచయం అక్కర్లేని పేరు లక్ష్మణ్ కుమార్ ది.

2014 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగి ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత 2018 తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికల్లో ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి మరోసారి ఓటమి పాలయ్యారు .

2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో ముందున్నారు అడ్లురి లక్ష్మణ్ కుమార్ .

నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ బలంతో పాటు.. నిర్వహించిన అనేక సేవ, సామాజిక కార్యక్రమాలు లక్ష్మణ్ కుమార్ గెలుపుకు ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు.[1]

మూలాలు[మార్చు]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.