కంచెర్ల పాలెం
కంచెర్ల పాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°16′40″N 80°39′00″E / 16.277651°N 80.649985°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | తెనాలి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి అరుణ కుమారి |
పిన్ కోడ్ | 522 202 |
ఎస్.టి.డి కోడ్ | 08644 |
కంచెర్ల పాలెం, గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ చరిత్ర[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]
తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
కడప జిల్లా గండిపేట ప్రాంతం నుండి వలస వచ్చిన కుటుంబాలతో వచ్చిన గ్రామమే "కంచల" అను ఊరు. తొలి నాళ్ళలో భూమిని గుంతలు తీయగా వచ్చిన నీటితో వ్యవసాయం చేయడం వలన "కంచల" అనే పేరుతో ఊరుగా పేరుతెచ్చుకున్న గ్రామం, కాలక్రమేణా "కంచలపాలెం" గా, తరువాత "కంచర్లపాలెం"గా రూపాంతరం చెందింది.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అరుణ కుమారి, సర్పంచిగా ఎన్నికైంది.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
- కంచెర్లపాలెం గ్రామంలో వెలసిన శ్రీ గంగా సర్వమంగళ సమేత ఓంకారేశ్వరస్వామివారి కళ్యాణోత్సవం, 2014, మే-10, శనివారం నాడు, కన్నులపండువగా నిర్వహించారు. ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలప్రాంగణంలో నిర్వహించిన విశేషపూజలలో గంగా సమేతుడైన శ్రీ ఓంకారేశ్వరస్వామివారికి, భక్తులు, తలంబ్రాలు అర్పించారు. ఉదయం స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి, మద్యాహ్నం అన్నసంతర్పణ నిర్వహించారు.
- ఈ గ్రామంలోని భగవాన్ వెంకయ్యస్వామి ఆలయంలో 2014, ఫిబ్రవరి-10 సోమవారం నాడు, విగ్రహప్రతిష్ఠా పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగినవి. దత్తాత్రేయ, నాగపంచమ మూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
- కాంచనమాల తొలితరం చలనచిత్ర కథానాయిక ఈ గ్రామ కోడలే.
- ఘట్టమనేని కృష్ణ ప్రముఖ కథానాయకుడు ఈ వూరి అల్లుడే.
- చుక్కపల్లి పిచ్చయ్య పాపులర్ గ్రూపు సంస్థల అధినేత.
గ్రామ విశేషాలు[మార్చు]
- జిల్లాలో మొట్టమొదట గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేసింది ఈ వూరిలోనే.
- గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం పిలుపు మేరకు, ఈ గ్రామాన్ని లోక్ సభ సభ్యులు గల్లా జయదేవ్ భార్య, గల్లా పద్మావతి, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయాడానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంది. పద్మావతి, ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయకుడు కృష్ణ కుమార్తె. ఈ గ్రామం ఆమె తల్లి ఇందిర స్వగ్రామం.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.