కాత్యాయన మహర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాత్యాయన మహర్షి (సా.పూ 3 వ శతాబ్దం) ప్రాచీన భారతదేశానికి చెందిన ఒక మహర్షి, సంస్కృత వ్యాకరణ పండితుడు, గణిత శాస్త్రవేత్త.[1] ఈయనకే కాత్యుడనీ, వరరుచియనీ,[2] మేధాజిత్ అనీ, పునర్వసుడనీ ఇతర పేర్లు ఉన్నాయి. సంస్కృత వ్యాకరణాన్ని రచించిన పాణిని ముఖ్య శిష్యుడనీ, దక్షిణ దేశానికి చెందిన వాడనీ పతంజలి ఒక సూత్రంలో ప్రకటించాడు. పాణినీయ వ్యాకరణాన్ని విస్తరిస్తూ ఈయన రాసిన వార్తికం అనే గ్రంథం ప్రాచుర్యం పొందినది.

రచనలు[మార్చు]

కాత్యాయనుడు రాసిన రెండు రచనలు బాగా ప్రసిద్ధి పొందాయి.

  • పాణినీయ వ్యాకరణంపై ఆయన రాసిన వార్తికం అనే భాష్యం, పతంజలి రాసిన మహాభాష్యం తో కలిపి సంస్కృత వ్యాకరణానికి తిరుగులేని మూల గ్రంథాలుగా పండితులు పేర్కొంటారు. ఇది ఆరు వేదాంగాల్లో ఒకటి.
  • ఆలయాల నిర్మాణంలో ప్రధాన పీఠం నిర్మించడానికి దీర్ఘ చతురస్రాలు, లంభకోణ త్రిభుజాలు, సమచతుర్భుజాల వర్ణన కలిగిన సులభ సూత్రాలు తొమ్మిది పుస్తకాలుగా రాశాడు.

పైన పేర్కొన్నవి కాకుండా నామమాల అనే నిఘంటువు రాశాడు.[3]

పింగళుడు లాంటి పండితుల కోవలోనే కాత్యాయనుడు కూడా గణిత శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన రాసిన సులభ సూత్రాలు అనే గ్రంథం జ్యామితి శాస్త్ర విషయాలు వివరిస్తుంది. ఇందులో సా.పూ 800 శతాబ్దంలో బౌధన్య సూత్రాలలో పేర్కొన్న పైథాగరస్ సిద్ధాంతాన్ని విపులీకరించాడు.[4]

సూచనలు[మార్చు]

  1. Joseph (2000), p. 328
  2. Edwards Byles Cowell (1854). The Prākrita-prakāsa or the Prākrit grammar of Vararuci with the commentary (Manorama) of Bhāmaha. Hertford, England: Stephen Austin, Book Sellers to East India College.
  3. రసజ్ఞ. "నిఘంటువులు". magazine.maalika.org. మాలిక పత్రిక. Archived from the original on 2 జూన్ 2015. Retrieved 9 November 2016.
  4. Pingree (1981), p. 6

మూలాలు[మార్చు]