కిలివేటి సంజీవయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిలివేటి సంజీవయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - ప్రస్తుతం
నియోజకవర్గం సూళ్ళూరుపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1966
కడలూరు, తడ మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రాజయ్య, మస్తానమ్మ
జీవిత భాగస్వామి పసల సుభాషిణి
బంధువులు పసల పెంచలయ్య (మామ)
సంతానం సౌజన్య, దివిజ
నివాసం మిలిటరీ కాలనీ, నెల్లూరు

కిలివేటి సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సూళ్ళూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కిలివేటి సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, తడ మండలం, కడలూరు గ్రామంలో రాజయ్య, మస్తానమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బీటెక్‌ సివిల్‌ ఇంజినీర్‌ పూర్తి చేసిన ఆయన 1993లో గృహనిర్మాణ శాఖలో ఇంజినీర్‌గా ప్రవేశించి డీఈ ఉద్యోగం పొందాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

కిలివేటి సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పసల పెంచలయ్య రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2013లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో సూళ్ళూరుపేట నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ తరుపన పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] కిలివేటి సంజీవయ్య 2019లో నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.