గుంటూరు హిందూ నాటక సమాజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుంటూరు హిందూ నాటక సమాజం తెలుగు నాటకరంగంలో ఆధునికకాలంలో ప్రథమ దశలో స్థాపించబడిన నాటక సంస్థ.

ప్రారంభం[మార్చు]

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి తన మిత్రులైన తోలేటి అప్పారావు, పాతూరి శ్రీరాములు, పోలూరి హనుమంతరావు, ఇతర శిష్యులతో 1880-81 లలో ఈ సమాజాన్ని స్థాపించారు.[1] దీనికంటే ముందు కందుకూరి వీరేశలింగం పంతులు 1880వ సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలలో స్థాపించిన సమాజం విద్యార్థి నాటక సమాజవడం వల్ల, అది కొద్దిరోజుల్లోనే అంతరించిపోవుట వల్ల గుంటూరు హిందూ నాటక సమాజమే మొదటిది అవుతుంది.[2][3] గుంటూరు అగ్రహారంలోని ఏడుగొందుల సందులో నాటకశాలను నిర్మించుకున్నారు.[4]

ఈ సమాజ ప్రదర్శన లకు తగిన ప్రదేశంలో పాకలు వేయడం, తెరలు సిద్ధంచేయడం, నాటక పాత్రలకు కావలసిన దుస్తులు, అలంకారాలు మొదలైనవి పొత్తూరు కృష్ణయ్య, భువనగిరి హనుమద్దీక్షితులు, భాగవతుల రాఘవయ్యలు చూసుకునేవారు.[5] ప్రతి నాటకంలో నాయక పాత్రలను కలపటపు నరసంహం అనే విద్యార్థి, స్త్రీ పాత్రలను చెన్నూరి సూర్యప్రకాశరావు, భువనగిరి సూర్యనారాయణ అనేవారు వేసేవారు.

ఈ సమాజం నాలుగైదు సంవత్సరాలు మాత్రమే నడిచింది. ధనాపేక్ష లేకుండా వినోదం కోసమే నాటకాలను ప్రదర్శించారు. రాజమహేంద్రవరంలో హరిశ్చంద్ర నాటక మొదటి ప్రదర్శన సమయంలో ప్రదర్శన పాకపై ఎవరో నిప్పువేయడంతో స్వల్ప ప్రమాదం జరిగింది. మరలా 1884లో రెంవడసారి ప్రదర్శన విజయవంతగా జరిగింది. ఈ సమాజంవారు ఎక్కువగా వచన నాటకాలను ప్రదర్శించేవారు. అందుచేత, వచన నాటకాలకు వరవడి దిద్దినది గుంటూరు హిందూ నాటక సమాజమేనని చెప్పవచ్చు.

మూలాలు[మార్చు]

  1. గుంటూరు హిందూ నాటక సమాజం, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 513.
  2. నవతెలంగాణ. "తెలంగాణ తొలి నాటక కర్త కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి". Retrieved 19 July 2017.[permanent dead link]
  3. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.690.
  4. తొలి తెలుగు సంచార నాటక సమాజం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 2 జనవరి 2017, పుట.14
  5. గుంటూరు హిందూ నాటక సమాజం, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 514.