గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
| ఆచార్య గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి | |
|---|---|
| జననం | 1966, సెప్టెంబరు 5 పొతారెడ్డిపేట్, అక్బర్పేట-భూంపల్లి మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ |
| మరణం | 2023 ఏప్రిల్ 24 (వయసు: 56) హైదరాబాదు, తెలంగాణ |
| వృత్తి | అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ |
| ప్రసిద్ధి | సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు |
| తండ్రి | గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ |
| తల్లి | పద్మావతి |
ఆచార్య డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి (1966, సెప్టెంబరు 5 – 2023, ఏప్రిల్ 24) తెలంగాణకు చెందిన సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]బాలశ్రీనివాసమూర్తి 1966, సెప్టెంబరు 5న మెదక్ జిల్లాలోని పోతారెడ్డిపేటలో జన్మించాడు.[2] ఇతని తండ్రి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ కవి, అవధాని. తల్లి పద్మావతి.
విద్య
[మార్చు]ఏం. ఏ (తెలుగు) ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. ఆ తర్వాత ఏం.పిల్ తెలుగులో ఆధ్యాత్మిక వచన కావ్యాలు అనే అంశం మీద హైద్రాబాద్ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ ముదిగొండ వీర భద్రయ్య ఆధ్వర్యంలో ఎం . ఫిల్ పూర్తి చేశారు. ఆ తర్వాత యుజిసి వారు అందించే ఫెలోషిప్ లో ఉత్తీర్ణత సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో "తెలంగాణలో సాహితీ సాంస్కృతిక చైతన్యం పత్రికల పాత్ర (1920- 56) అంశంపై పి హెచ్. డి ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.
సహాచార్యుడిగా
[మార్చు]తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి బోధన విధుల్లో ఉన్న బాలశ్రీనివాసమూర్తి విశ్వవిద్యాలయంలోని వివిధ పరిపాలన పదవులు నిర్వహించాడు.[3]
సాహిత్య ప్రస్థానం
[మార్చు]జాగృతి వార పత్రికలో సాహిత్య వ్యాసాలను, జాతీయ-అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించాడు. దాదాపు పది పుస్తకాలను వెలువరించాడు. తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించిన 'సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర' పుస్తక సంపాదక బృందంలో సభ్యునిగా పనిచేశాడు.
రచనలు
[మార్చు]- ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ[4]
- సమకాలీన వాదాలు - సాహిత్య విమర్శ
- తెలంగాణం - తెలుగు మాగాణం
- తుషార సమీరం
- తెలంగాణ పత్రికలు
- వెలుతురు కొలను
- మా ప్రసిద్ధిపేట[5]
- విలక్షణ పి. వి.-– నరసింహారావు గారి జీవిత చరిత్ర[6]
- దేవులపల్లి రామానుజనరావు (మోనోగ్రాఫ్)[7]
- జీవన హిందోళం (గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మగారి జీవితం – అవధానం)[8]
సంపాదకత్వం
[మార్చు]- తెలంగాణ వైతాళికులు (మూడు సంపుటాలు, జననేతలు-అక్షరమూర్తులు-ప్రతిభామూర్తులు)[9]
- సాహితీ సుధ
- తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వం
- తెలంగాణ సాహిత్య చరిత్ర
మరణం
[మార్చు]ఆచార్య బాలశ్రీనివాసమూర్తి 2023, ఏప్రిల్ 24న హఠాత్తుగా గుండెపోటుతో హైదరాబాదు సుచిత్రలోని తన స్వగృహాంలో మరణించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2023-04-25). "సాహితీవేత్త బాలశ్రీనివాసమూర్తి మృతి". www.ntnews.com. Archived from the original on 2023-04-25. Retrieved 2023-04-25.
- ↑ ABN (2023-04-27). "మహావక్త బాల శ్రీనివాసమూర్తి". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-27. Retrieved 2023-04-27.
- ↑ 3.0 3.1 "ఆచార్య బాలశ్రీనివాసమూర్తి హఠాన్మరణం". EENADU. Archived from the original on 2023-04-25. Retrieved 2023-04-25.
- ↑ గుమ్మన్నగారి, బాలశ్రీనివాసమూర్తి (జూన్ 2014). ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ. హైదరాబాద్: ఎమెస్కో బుక్స్. ISBN 978-9383652051.
- ↑ Thum, Jayadeep (2016-09-02). "మళ్ళీ చదవాలనిపించే " మా ప్రసిద్ధిపేట". తెలంగాణ. Archived from the original on 2023-04-25. Retrieved 2023-04-25.
- ↑ Velugu, V6 (2022-07-24). "సమగ్ర జీవిత చరిత్ర". V6 Velugu. Archived from the original on 2022-07-24. Retrieved 2023-04-25.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Dr. Gummannagari Bala Srinivasa Murthy (2017). డా. దేవులపల్లి రామానుజరావు.
- ↑ telugu, NT News (2021-10-31). "ఒక అవధాని జీవనరాగ సుధ". www.ntnews.com. Archived from the original on 2021-10-31. Retrieved 2023-04-25.
- ↑ Thum, Jayadeep (2017-09-02). "జిజ్ఞాసువులకు కరదీపికలు 'తెలంగాణ వైతాళికులు'". తెలంగాణ. Archived from the original on 2023-04-25. Retrieved 2023-04-25.