చుక్కభట్ల సత్యనారాయణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చుక్కభట్ల సత్యనారాయణమూర్తి
జననం1909
మరణంఆగష్టు 21, 1953
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, ప్రయోక్త, నాటక రచయిత, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త

చుక్కభట్ల సత్యనారాయణమూర్తి (1909 - ఆగష్టు 21, 1953) ప్రముఖ రంగస్థల నటుడు, ప్రయోక్త, నాటక రచయిత, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త.[1]

జననం[మార్చు]

సత్యనారాయణమూర్తి 1909లో సుబ్బారావు, సీతమ్మ దంపతులకు జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

1928-29 ప్రాంతంలో చర్లలో కొంతమంది మిత్రులతో కలిసి చెన్నకేశ్వర నాట్యమండలిని స్థాపించాడు. ఏలూరి హనుమంతరావు, గాలి లక్ష్మణస్వామి, బుయ్యవరపు తిరువెంగళయ్య, విశ్వన్మయాచారి, చింతలపూడి వెంకన్న, ముదపాక వెంకటరత్నం, చీమకుర్తి సుబ్బారావు, కామాడ జగ్గారావు, తోటపల్లి ఆదినారాయణ వంటి నటులకు శిక్షణ ఇచ్చాడు.

నటించినవి[మార్చు]

  1. చింతామణి
  2. వరవిక్రయం
  3. సత్యహరిశ్చంద్ర
  4. భక్తరామదాసు
  5. గయోపాఖ్యానం
  6. మధు సేవ

రచించినవి[మార్చు]

  1. ఝాన్సీలక్ష్మీబాయి (08.06.1931 లో ఈ నాటకాన్ని బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించింది)
  2. వీరతానాజీ
  3. గొల్లభామ

మరణం[మార్చు]

ఈయన 1953, ఆగష్టు 21న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.623.