జోగిందర్ జస్వంత్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జనరల్
జోగిందర్ జస్వంత్ సింగ్
పి.వి.ఎస్.ఎం, ఏ.వి.ఎస్.ఎం, వి.ఎస్.ఎం, ఏ.డి.సి
అరుణాచల్ ప్రదేశ్ 13వ గవర్నర్
In office
26 జనవరి 2008 - 28 మే 2013
Appointed byభారత రాష్ట్రపతి అప్పటి ప్రతిభా పాటిల్
Chief Ministerదోర్జీ ఖండూ
జర్బోం గామ్లిన్
నభమ్ తుకీ
అంతకు ముందు వారుకె. శంకరనారాయణన్ (అదనపు బాధ్యతలు)
తరువాత వారునిర్భయ్ శర్మ
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 47వ ఛైర్మన్
In office
31 మార్చి 2007 - 30 సెప్టెంబర్ 2007
అధ్యక్షుడుఏ.పి.జె. అబ్దుల్ కలామ్
ప్రతిభా పాటిల్
ప్రథాన మంత్రిమన్మోహన్ సింగ్
అంతకు ముందు వారుశశీంద్ర పాల్ త్యాగి
తరువాత వారుసురేష్ మెహతా
ఆర్మీ స్టాఫ్ 21వ చీఫ్
In office
1 ఫిబ్రవరి 2005 - 31 ఆగస్టు 2007
అధ్యక్షుడుఏ.పి.జె. అబ్దుల్ కలామ్
ప్రతిభా పాటిల్
ప్రథాన మంత్రిమన్మోహన్ సింగ్
అంతకు ముందు వారునిర్మల్ చందర్ విజ్
తరువాత వారుదీపక్ కపూర్
వ్యక్తిగత వివరాలు
జననం (1945-09-17) 1945 సెప్టెంబరు 17 (వయసు 78)
సమ్మ సత్తా, బహవల్పూర్ రాష్ట్రం, బ్రిటిష్ రాజ్
(ప్రస్తుతం బహవల్పూర్ జిల్లా, పంజాబ్, పాకిస్తాన్)
రాజకీయ పార్టీశిరోమణి అకాలీ దళ్
(2017 - 2019)
శిరోమణి అకాలీ దళ్ (తక్సాలి)
(2019 - 2022)
భారతీయ జనతా పార్టీ
(2022 - ప్రస్తుతం)
బంధువులుజస్వంత్ సింగ్ మార్వా (తండ్రి)
Writing(s)
  • ఎ సోల్జర్స్ జనరల్ (2012)
  • ది మెక్‌మాన్ లైన్ - ఎ సెంచరీ ఆఫ్ డిస్కార్డ్ (2019)
మారుపేరుజనరల్ జేజే
Military service
Allegiance భారతదేశం
Branch/serviceభారత సైన్యం
Years of serviceఆగస్ట్ 1964 - 30 సెప్టెంబర్ 2007
Rank జనరల్
Unit 9 మరాఠా లైట్ పదాతిదళం
Commands వెస్ట్రన్ ఆర్మీ
ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ (ARTRAC)
ఐ కార్ప్స్
కార్ప్స్ 9వ పదాతిదళ విభాగం
79వ (స్వతంత్ర) మౌంటైన్ బ్రిగేడ్
5 మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ
9 మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ
Battles/warsభారత పాక్ యుద్ధం 1971
కార్గిల్ యుద్ధం
ఆపరేషన్ పరాక్రమ్
Service numberIC-16078
Award(s)

జోగిందర్ జస్వంత్ సింగ్ (జననం 17 సెప్టెంబర్ 1945) భారతదేశానికి చెందిన మాజీ ఆర్మీ చీఫ్, రాజకీయ నాయకుడు. ఆయన 26 జనవరి 2008 నుండి 28 మే 2013 వరకు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పని చేశాడు.[1]

జనరల్ జేజే సింగ్ 2005 జనవరిలో భారత సైన్యానికి మొదటి సిక్కు చీఫ్ గా భాద్యతలు చేపట్టి[2] సెప్టెంబర్, 2007లో పదవీ విరమణ చేశాడు.[3] ఆయనను 2008లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించగా ఆయన 2008 నుండి 2013 వరకు గవర్నర్‌గా విధులు నిర్వహించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

జె.జె.సింగ్ శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు & పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సమక్షంలో శిరోమణి అకాలీదళ్ పార్టీలో చేరి[4] 2017 పంజాబ్ శాసనసభ ఎన్నికలలో పాటియాలా అర్బన్ స్థానం నుండి శిరోమణి అకాలీదళ్ అభ్యర్థిగా పోటీ చేసి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ చేతిలో ఓడిపోయాడు. జె.జె.సింగ్ 2019లో శిరోమణి అకాలీదళ్ (తక్సాలి) లో చేరి ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2022లో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Hindustan Times (24 January 2008). "General JJ Singh is Arunachal governor" (in ఇంగ్లీష్). Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
  2. The Times of India (28 November 2004). "J J Singh to take over as Army chief". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
  3. India Today (10 June 2012). "A Soldier's General: General (retd) J.J. Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
  4. The Times of India (7 January 2017). "Former Army chief General JJ Singh joins SAD, to contest against Amarinder Singh". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
  5. The Hindu (18 January 2022). "Former Army chief J.J. Singh joins BJP" (in Indian English). Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.