తాడేపల్లి పేరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాడేపల్లి పేరయ్య (1886 – 1942) కూచిపూడి నాట్యాచార్యుడు. ఆధునిక కాలంలో కూచిపూడి నృత్యాన్ని విస్తృతం చేయడంలో ఆయన కృషి చాలా ఉంది.[1] ఆయన భామాకలాపం, గొల్లకలాపం వంటి ప్రదర్శనలలో నిష్ణాతుడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన గౌరమ్మ, సుబ్బారాయుడు దంపతులకు 1886లో జన్మించాడు. ఆయన భామాకలాపం, గొల్లకలాపాలను ప్రదర్శనలిచ్చేవాడు. ఆయన ప్రదర్శకుని కంటే గురువుగా సుపరిచితుడు. ఆయన స్వతంత్ర్యానికి పూర్వం కూచిపూడి నాట్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుటకు ఎంతో కృషిచేసిన వ్యక్తులలో మొదటివాడు. ఆయన మేడూరు, నంగిగడ్డలలొ దేవదాసీలకు నాట్యంలో శిక్షణనిచ్చేవాడు. వారితో ప్రదర్శనలను ఏర్పాటుచేసి అందులో సూత్రధారుని పాత్ర పోషించేవాడు. నంగిగడ్డకు చెందిన కృష్ణవేణి, రేపల్లెకు చెందిన బాలాత్రిపురసుందరి అందులో ప్రసిద్ధులు. ఆయన స్వయంగా సూత్రధారునిగా ఏకైక శైలిలో ప్రదర్శనలిచ్చేవాడు. ఇది ప్రేక్షకులతో మంచి సంబంధాలను ఏర్పరిచింది. ఆయన దేవదాసీలకు శిక్షణనిచ్చి మంది ప్రదర్శనకారులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారి జీవితాలను మలచడానికి సంస్కరణల కోసం పాటుపడేవాడు.

ఆయన శిష్యులలో అగ్రగణ్యులు వెంపటి చినసత్యం, జోస్యుల సీతారామయ్యలు. వారి కుటుంబంలో నాట్య సాంప్రదాయ వారితోనే ముగిసింది. అనుకున్న సందర్భంలో వారి మనవడు తాడేపల్లి సత్యనారాయణ శర్మ డాక్టర్ తాడేపల్లిగా ప్రసిద్ధి చెందారు తాడేపల్లి వారి పరంపరను జగత్ విఖ్యాతం చేశారు. తాడేపల్లి గారు నాట్య కళాకారుడిగా నాట్య విమర్శకుడిగా ప్రసిద్ధి చెందారు సాంప్రదాయ భాగవత కుటుంబములలో తాడేపల్లి వంశానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలిపారు డాక్టర్ తాడేపల్లి గారు కూచిపూడి భాగవత మేళం కార్యదర్శి గా వ్యవహరిస్తున్నారు [3]

మూలాలు[మార్చు]

  1. నృత్య ‘సత్య’సాధకుడు[permanent dead link]
  2. "Guru Tadepalli Perayya Sastry". Archived from the original on 2015-07-05. Retrieved 2016-11-12.
  3. "కూచిపూది వెబ్‌సైట్ లో ఆయన జీవిత విశేషాలు". Archived from the original on 2016-10-18. Retrieved 2016-11-12.

ఇతర లింకులు[మార్చు]