దేవేంద్రనాథ ఠాకూరు చరిత్రము
Jump to navigation
Jump to search
దేవేంద్రనాథ ఠాకూరు చరిత్రము రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి రచించిన దేవేంద్రనాథ్ ఠాగూర్ జీవితచరిత్రకు సంబంధించిన అనువాద గ్రంథం.
దేవేంద్రనాథ్ ఠాగూర్ (మే 15 1817 – జనవరి 19 1905) హిందూ తత్వవేత్త, బ్రహ్మ సమాజంలో మత సంస్కర్త. ఈయన హిందూ మత సంస్కరణకు కృషిచేశరు. 1848 లో బ్రహ్మో మతం స్థాపించిన వ్యక్తి. ఈయన బెంగాల్ నందు శ్రీలైదాహలో జన్మించారు. ఈ గ్రంథంలో చలమయ్య ఆయన జీవిత చరిత్రను వివరించారు.[1] దీనికి దేవేంద్రనాథ భట్టాచార్య బెంగాలీ భాషలో రచన మూలం. దీని ప్రథమ ముద్రణ 1934లో విడుదలవగా, ద్వితీయ ముద్రణు, 1936లోను, తృతీయ ముద్రణము 1937లో విడులైనవి. వీటిని శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల ముద్రించగా; శాంతి కుటీరము, పిఠాపురం వారు ప్రచురించారు. రచయిత ఈ గ్రంథాన్ని బ్రహ్మశ్రీ రఘుపతి వేంకటరత్నం నాయుడు గారికి భక్తితో సమర్పించారు.
విషయసూచిక[మార్చు]
- ప్రథమ ప్రకరణము - పరిచయము
- ద్వితీయ ప్రకరణము - స్థితిగతులు
- తృతీయ ప్రకరణము - జన్మము
- చతుర్థ ప్రకరణము - దేవేంద్రనాథుడు, శైశవము
- పంచమ ప్రకరణము - స్వభావము
- షష్ఠ ప్రకరణము - తత్త్వబోధినీసభ
- సప్తమ ప్రకరణము - సంసారము
- అష్టమ ప్రకరణము - కర్మక్షేత్రము
- నవమ ప్రకరణము - సాధన
- దశమ ప్రకరణము - మహర్షి
- ఏకాదశ ప్రకరణము - శాంతినికేతనము