దొంతి మాధవ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంతి మాధవ రెడ్డి

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2018

మళ్లీ 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం

ముందు రేవూరి ప్రకాష్ రెడ్డి
తరువాత పెద్ది సుదర్శన్‌ రెడ్డి
నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 16 ఆగష్టు 1961
అమీనాబాద్ గ్రామం, చెన్నారావుపేట మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు నర్సింహ రెడ్డి
జీవిత భాగస్వామి షాలిని

దొంతి మాధవ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నర్సంపేట నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు.ప్రకాశ్ రెడ్డి గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో అధికారం ఉంటేనే పార్టీ లో ఉంటారా అని ఫ్లోర్ క్రాస్ అవుతున్నరని టి.డి.పి ఎమ్మెల్యేలు అని చాలా బాధ పడ్డారు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

దొంతి మాధవ రెడ్డి 16 ఆగష్టు 1961లో తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలం, అమీనాబాద్ గ్రామంలో జన్మించాడు. ఆయన నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ 1976లో పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1981 నుండి 1988 వరకు అమీనాబాద్ గ్రామా సర్పంచ్‌గా, 1995 నుండి 2000 వరకు వరంగల్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 1999, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నర్సంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.

ఆయనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌ రెడ్డి పై 18376 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[1][2] ఆయన 2018లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో ఏఐసీసీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[3] మాధవ రెడ్డి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌ రెడ్డి పై 16975 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

దొంతి మాధవ రెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పెద్దిసుదర్శన్ రెడ్డిపై 104,185 ఓట్లతో 18,889 వేల మెజారిటీతో గెలిచారు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Sakshi (4 November 2014). "కాంగ్రెస్లో చేరిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  3. Sakshi (21 March 2018). "గెలుపు మాదే". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.