పార్థివ
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
పార్థివ తెలుగు సంవత్సరాలలో 19వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం తారణ, తర్వాత సంవత్సరం వ్యయ. ఇది పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.సస్యములు సంపదలు సమృద్ధి ఔతాయి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1885-1886, 1945-1946లో వచ్చిన తెలుగు సంవత్సరానికి పార్థివ అని పేరు.
2005 : పార్థివ నామ సంవత్సరం 9 ఏప్రిల్ 2005 శనివారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 30 మార్చి 2006 గురువారం వ్యయ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "పార్థివ"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 19 | పార్థివ | 25-26 | 85-86 | 145-146 | 205-206 | 265-266 | 325-326 | 385-386 | 445-446 | 505-506 | 565-566 | 625-626 | 685-686 | 745-746 | 805-806 | 865-866 | 925-926 | 985-986 | 1045-1046 | 1105-1106 | 1165-1166 | 1225-1226 | 1285-1286 | 1345-1346 | 1405-1406 | 1465-1466 | 1525-1526 | 1585-1586 | 1645-1646 | 1705-1706 | 1765-1766 | 1825-1826 | 1885-1886 | 1945-1946 | 2005-2006 | 2065-2066 | 2125-2126 | 2185-2186 | 2245-2246 | 2305-2306 | 2365-2366 | 2425-2426 | 2485-2486 | 2545-2546 | 2605-2606 | 2665-2666 | 2725-2726 | 2785-2786 |
సంఘటనలు
[మార్చు]- సా.శ. 1886 జనవరి 24వ తేదీ:యాత్రా చరిత్ర ప్రకారం పుష్య బహుళ పంచమి ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు.[3]
జననాలు
[మార్చు]- 1885 కార్తీక బహుళ తదియ : మాదిరాజు రామకోటీశ్వరరావు, నిజాం ఆంధ్రోద్యమంలో పాల్గొన్నవ్యక్తి, న్యాయవాది.
- 1886 మాఘ శుద్ధ పంచమి : యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ - రాయలసీమ కవి. కవిచంద్ర బిరుదాంకితుడు.[4]
- 1946 పుష్య బహుళ షష్ఠి : పరిమి రామనరసింహం - అవధాని, భాషాశాస్త్రవేత్త.[5]
- 1946 ఫాల్గుణ శుద్ధ పంచమి :చక్రాల లక్ష్మీకాంతరాజారావు -కవి, పండితుడు, అవధాని, గ్రంథ రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు.[6]
మరణాలు
[మార్చు]- సా.శ. 1885 - వైశాఖ శుద్ధ అష్టమి - శేషదాసులు - పాలమూరుకు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు.
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ మండపాక, పార్వతీశ్వర శాస్త్రి (1915). యాత్రా చరిత్ర పూర్వభాగము. Retrieved 21 June 2016.
- ↑ కల్లూరు అహోబలరావు (1975). రాయలసీమ రచయితల చరిత్ర మొదటి భాగం (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. p. 19. Retrieved 22 April 2020.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 498.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 504.