అనీ బిసెంట్: కూర్పుల మధ్య తేడాలు
చి →ప్రవేశిక |
|||
పంక్తి 19: | పంక్తి 19: | ||
1980లో అనీ బిసెంట్" హెలెనా బ్లావట్స్కీ" ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి [[దివ్యజ్ఞానం]] వైపు మళ్ళింది. ఆమె దివ్యజ్ఞానం సమాజంలో సభ్యత్వం స్వీకరించి, ఉపన్యాసకురాలిగా విజయం సాధించింది. దివ్యజ్ఞాన సమాజం సభ్యురాలిగా బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. 1898లో కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు సహకరించింది. 1902 లో అమె " కో-ఫ్రీమసోంరీ లీ డ్రాయిట్ హ్య్జమన్ " ను ఇంగ్లాండు లో స్థాపించింది. తరువాత కొద్ది సంత్సరాలలో ఈ తరహా నిర్మాణాలు బ్రిటన్ సామ్రాజ్యమంతటా ఆమె చేత స్థాపించబడ్డాయి. 1907లో ఆమె దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలైంది. |
1980లో అనీ బిసెంట్" హెలెనా బ్లావట్స్కీ" ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి [[దివ్యజ్ఞానం]] వైపు మళ్ళింది. ఆమె దివ్యజ్ఞానం సమాజంలో సభ్యత్వం స్వీకరించి, ఉపన్యాసకురాలిగా విజయం సాధించింది. దివ్యజ్ఞాన సమాజం సభ్యురాలిగా బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. 1898లో కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు సహకరించింది. 1902 లో అమె " కో-ఫ్రీమసోంరీ లీ డ్రాయిట్ హ్య్జమన్ " ను ఇంగ్లాండు లో స్థాపించింది. తరువాత కొద్ది సంత్సరాలలో ఈ తరహా నిర్మాణాలు బ్రిటన్ సామ్రాజ్యమంతటా ఆమె చేత స్థాపించబడ్డాయి. 1907లో ఆమె దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలైంది. |
||
ఆమె భారతీయ రాజకీయాలలో కూడా ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో ఆమె హోం రూల్ లీగ్ స్వాతంత్రోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. యుద్ధానంతరం ఆమె భారతీయ స్వాతంత్ర్య పోరాటం మరియు |
ఆమె భారతీయ రాజకీయాలలో కూడా ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో ఆమె హోం రూల్ లీగ్ స్వాతంత్రోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. యుద్ధానంతరం ఆమె భారతీయ స్వాతంత్ర్య పోరాటం మరియు దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలను 1933లో ఆమె మరణించే వరకు కొనసాగించింది. |
||
అనీ వుడ్ బిసెంట్ [ఆంగ్లం'Annie Wood Besant' ఉచ్ఛారణ :ˈbɛsənt )ఈమె ఒక ఐర్లాండ్ ఐరిష్ జాతి మహిళ. |
అనీ వుడ్ బిసెంట్ [ఆంగ్లం'Annie Wood Besant' ఉచ్ఛారణ :ˈbɛsənt )ఈమె ఒక ఐర్లాండ్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని [[:en:Clapham|క్లఫామ్]] లో, [[అక్టోబరు 1]] [[1847]] న జన్మించింది మరియు [[సెప్టెంబరు 20]] [[1933]] న [[తమిళనాడు]] లోని [[:en:Adyar (Tamil Nadu)|అడయారు]] లో మరణించింది. ఈమె [[:en:Theosophy|దివ్యజ్ఞాన తత్వజ్ఞి]], [[:en:women's rights|మహిళల హక్కుల]] [[:en:activist|ఉద్యమకారిణి]], [[:en:writer|రచయిత]] మరియు [[:en:orator|వక్త]]. ఈమె [[ఐర్లాండ్]] మరియు [[భారతదేశం|భారతదేశపు]] స్వాతంత్ర్యం మరియు [[స్వయంపాలన]] కొరకు పోరాడినది. |
||
ఈమె [[:en:Home Rule Movement| |
ఈమె [[:en:Home Rule Movement|స్వయం పాలన ఉద్యమం]] స్థాపించినది. |
||
తల్లి ధార్మిక స్వభావి.తండ్రి డా |
తల్లి ధార్మిక స్వభావి. తండ్రి డా.విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు.1867 డిసెంబరులో తన తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ ని అనిబిసెంట్ వివాహమాడెను. అంతవరకూ అనీ గా పిలవబడిన ఆమె వివాహముతో అనీ బిసెంట్ గా మారింది. ఈమె 1874 లో ఇంగ్లాడులోని ''నేషనల్ సెక్యులర్ సొసైటీ ''అనే సంస్థలో చేరింది. ''లా అండ్ రిపబ్లిక్ లీగ్ ''ని స్థాపించి పోలీసు అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేసింది. భారతదేశంలోని ''దివ్యజ్ఞాన సమాజం" ఆహ్వానం మేరకు భారతదేశానికి వచ్చింది. ''మే యూనియన్ ''ని స్థాపించి కార్మికులకోసం పోరాడింది.1898 జులై 7న బనారస్ లోని ఒక చిన్న ఇంట్లో తాను కలలుగన్న విద్యాసౌధాన్ని ప్రారంభించి, దానిని అలహాబాదు విశ్వవిద్యాలయపు సంస్థగా పేర్కొనినది. బాలగంగాధర తిలక్ 1895 లో ప్రస్తావించిన "స్వయంపాలన" ను 1914 లో అనీ బిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన ''కామన్ వెల్త్ ''అనే వార పత్రికను ఆమె ప్రారంభించినది.1915 లో ఈమె ''హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడం''అనే పుస్తకాన్ని వ్రాసింది. భారతదేశ స్వాతంత్ర్యమును గురించి వివరించినది. |
||
ఈమె రచించిన ''లెక్చర్ ఆన్ పొలిటికల్ సైన్స్ |
ఈమె రచించిన ''లెక్చర్ ఆన్ పొలిటికల్ సైన్స్'' పుస్తకంలో పాశ్చాత్య, భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి పరిష్కృతం కాగలిగే సూచనలను ఇచ్చినది. 1917లో అనీ బిసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించబడింది. ఎన్నోరకాల ప్రాతిపదికలతో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించించినది. ''న్యూ ఇండియా''అనే దినపత్రిక ఈమెదే. ''ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్'' ను స్థాపించినది. ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం ''డాక్టర్ ఆఫ్ లెటర్స్'' బిరుదునిచ్చి సత్కరించినది. 80సంవత్సరాల వయసులో ''బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్, చికాగో ప్రపంచ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించినది.1933 సెప్టెంబర్ 20న ఆమె తుదిశ్వాస విడిచినది. |
||
== ఆరంభకాల జీవితం == |
== ఆరంభకాల జీవితం == |
05:11, 11 మే 2013 నాటి కూర్పు
అనీ బిసెంట్ | |
---|---|
జననం | 1847, అక్టోబర్ 1 |
మరణం | 1933 , సెప్టెంబర్ 20 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | స్త్రీ వాది ఉద్యమ నాయకురాలు, రచయిత |
జీవిత భాగస్వామి | ఫ్రాంక్ బీసెంట్ |
పిల్లలు | రచయిత, సామ్యవాది,బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది |
ప్రవేశిక
అనీ బిసెంట్ ప్రముఖ బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత మరియు వాక్పటిమ కలిగిన స్త్రీ. ఈమె భారతీయ మరియు ఐరోపా స్వరాజ్యపోరాటానికి మద్దతు ఇచ్చింది.
ఆమెకు తన 19వ సంవత్సరంలో ఫ్రాంక్ బిసెంటుతో వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమెకు భర్తతో మతపరమైన విభేదాలు కలిగిన కారణంగా ఇరువురు విడిపోయారు. తరువాత ఆమె జాతీయ సామ్యవాద సంఘానికి ప్రముఖ ఉపన్యాసకురాలుగా వ్యవహరించింది. ఆమెకు చార్లెస్ బ్రాడ్ లాఫ్ తో సన్నిహిత మైత్రి కుదిరింది. 1887 లో వారిరువురు రచయిత చార్లెస్ నోల్టన్ పుస్తకం బర్త్ కంట్రోల్ ప్రచురణ విషయంలో విచారణను ఎదుర్కొన్నారు. ఈ అపకీర్తి వారికి ప్రాబల్యం కలిగించింది. 1880లో బ్రాడ్లాఫ్, నార్తాంప్టన్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైయాడు.
1980లో అనీ బిసెంట్" హెలెనా బ్లావట్స్కీ" ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యజ్ఞానం వైపు మళ్ళింది. ఆమె దివ్యజ్ఞానం సమాజంలో సభ్యత్వం స్వీకరించి, ఉపన్యాసకురాలిగా విజయం సాధించింది. దివ్యజ్ఞాన సమాజం సభ్యురాలిగా బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. 1898లో కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు సహకరించింది. 1902 లో అమె " కో-ఫ్రీమసోంరీ లీ డ్రాయిట్ హ్య్జమన్ " ను ఇంగ్లాండు లో స్థాపించింది. తరువాత కొద్ది సంత్సరాలలో ఈ తరహా నిర్మాణాలు బ్రిటన్ సామ్రాజ్యమంతటా ఆమె చేత స్థాపించబడ్డాయి. 1907లో ఆమె దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలైంది.
ఆమె భారతీయ రాజకీయాలలో కూడా ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో ఆమె హోం రూల్ లీగ్ స్వాతంత్రోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. యుద్ధానంతరం ఆమె భారతీయ స్వాతంత్ర్య పోరాటం మరియు దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలను 1933లో ఆమె మరణించే వరకు కొనసాగించింది.
అనీ వుడ్ బిసెంట్ [ఆంగ్లం'Annie Wood Besant' ఉచ్ఛారణ :ˈbɛsənt )ఈమె ఒక ఐర్లాండ్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని క్లఫామ్ లో, అక్టోబరు 1 1847 న జన్మించింది మరియు సెప్టెంబరు 20 1933 న తమిళనాడు లోని అడయారు లో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత మరియు వక్త. ఈమె ఐర్లాండ్ మరియు భారతదేశపు స్వాతంత్ర్యం మరియు స్వయంపాలన కొరకు పోరాడినది. ఈమె స్వయం పాలన ఉద్యమం స్థాపించినది.
తల్లి ధార్మిక స్వభావి. తండ్రి డా.విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు.1867 డిసెంబరులో తన తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ ని అనిబిసెంట్ వివాహమాడెను. అంతవరకూ అనీ గా పిలవబడిన ఆమె వివాహముతో అనీ బిసెంట్ గా మారింది. ఈమె 1874 లో ఇంగ్లాడులోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరింది. లా అండ్ రిపబ్లిక్ లీగ్ ని స్థాపించి పోలీసు అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేసింది. భారతదేశంలోని దివ్యజ్ఞాన సమాజం" ఆహ్వానం మేరకు భారతదేశానికి వచ్చింది. మే యూనియన్ ని స్థాపించి కార్మికులకోసం పోరాడింది.1898 జులై 7న బనారస్ లోని ఒక చిన్న ఇంట్లో తాను కలలుగన్న విద్యాసౌధాన్ని ప్రారంభించి, దానిని అలహాబాదు విశ్వవిద్యాలయపు సంస్థగా పేర్కొనినది. బాలగంగాధర తిలక్ 1895 లో ప్రస్తావించిన "స్వయంపాలన" ను 1914 లో అనీ బిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన కామన్ వెల్త్ అనే వార పత్రికను ఆమె ప్రారంభించినది.1915 లో ఈమె హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడంఅనే పుస్తకాన్ని వ్రాసింది. భారతదేశ స్వాతంత్ర్యమును గురించి వివరించినది.
ఈమె రచించిన లెక్చర్ ఆన్ పొలిటికల్ సైన్స్ పుస్తకంలో పాశ్చాత్య, భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి పరిష్కృతం కాగలిగే సూచనలను ఇచ్చినది. 1917లో అనీ బిసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించబడింది. ఎన్నోరకాల ప్రాతిపదికలతో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించించినది. న్యూ ఇండియాఅనే దినపత్రిక ఈమెదే. ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్ ను స్థాపించినది. ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించినది. 80సంవత్సరాల వయసులో బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్, చికాగో ప్రపంచ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించినది.1933 సెప్టెంబర్ 20న ఆమె తుదిశ్వాస విడిచినది.
ఆరంభకాల జీవితం
అనీ బిసెంట్ 1847లో లండన్లో ఐరోపా సంతతి వైరైన ఒక మద్యతరగతి దంపతులకు జన్మించింది. తనవారసత్వానికి గర్వించే ఆమె యువజీవితంలో ఐరోపా స్వతంత్ర రాజ్యానికి మద్దతు తెలియజేస్తుంది. ఆమెకు ఐదు సంవత్సరాల వయసులో ఆమె తండ్రి కుటుంబాన్ని పేదరికంలో వదిలి మరణించాడు. ఆమె తల్లి " హారో స్కూల్" బాలల వసతిగృహం నిర్వహణ చేస్టూ కుటుంబ పోషణ భారం వహించింది. అయినప్పటికీ ఆమె అనీ బిసెంట్కు సరైన సహకారం అందించ లేక ఆమె స్నేహితురాలైన మారియెట్కు ఆమె సంరక్షణా భారం అప్పగించింది. మారియెట్ అనీబిసెంట్కు మంచి విద్యాభ్యాసం అందిస్తానని మాట ఇచ్చింది. ఆమె అనిబిసెంట్కు సమాజం పట్ల బాధ్యత మరియు స్త్రీస్వాతంత్రత యొక్క అవశ్యకత పట్ల అవగాహన కల్పించింది. యువప్రాయంలోనే ఆమె ఐరోపా అంతా పర్యటించింది. అక్కడ ఆమెకు రోమన్కాథలిక్కు మతం పట్ల కలిగిన అభిరుచి ఆమెను ఎప్పటికీ వదిలి పెట్టలేదు.
1867లో ఆమె క్లర్జీకి చెందిన 26 సంవత్సరాల ఫ్రాంక్ బిసెంట్ను వివాహం చేసుకున్నది. ఆయన వాల్టర్ బిసెంట్ తమ్ముడు. ఆయన క్రైస్తవ ఒక క్రైస్తవ మతవిశ్వాసి. అనీ బిసెంట్ ఆయనతో తన ఆలచనలు పంచుకున్నాడు. వివాహం అయిన సాయంత్రం ఆమెనుకలుసుకున్న మిత్రులు ఆమె తీవ్రంగా రాజకీయాలలో పాల్గొనేలా చేసారు. నగరంలోని పేదసమాజానికి చెందిన ఆంగ్లేయులు మరియు ఐరోపా వారితో సంబంధాలు ఏర్పడడానికి ఆ మిత్రులే కారణం అయ్యారు.
త్వరగానే ఫ్రాంక్ లింకన్ షైర్ లోని సిబ్సే ప్రీస్ట్ అయ్యాడు. అన్నీ తన భర్తతో సిబ్సేకు మకాం మార్చుకున్నది. తరువాత కొంత కాలానికి వారికి ఆర్తర్ మరియు మాబెల్ అనే పిల్లలు పుట్టారు. ఏదిఏమైనా వివాహ జీవితం భగ్నమైంది. మొదటి వివాదం ధనం మరియు అన్నే స్వాతంత్రం విషయంలో మొదలింది. అన్నే పిల్లల కోసం చిన్న కథలు, పుస్తకాలు మరియు వ్యాసాలు రచింవింది. వివాహిత అయిన స్త్రీకి చట్టరీత్యా ధనం మీద అధికారం లేదు కనుక అన్నీ సంపాదించిన ధనాన్ని ఫ్రాంక్ తీసుకున్నాడు. దంపతులను రాజకీయాలు మరింత వేరు చేసాయి. అన్నే సంఘాలుగా ఏర్పడి పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి పోరాటం సాగిస్తున్న తోటపనివారికి అండగా నిలిచింది. ట్రాయ్ సభ్యుడైన ఫ్రాంక్ భూస్వాముల వైపు నిలిచాడు. వివాదాలు తారస్తాయికి చేరుకోగానే అన్నే తిరిగి కలుదుకోవడానికి నిరాకరించింది. 1873 నాటికి ఆమె భర్తను విడిచి లండనుకు తిరిగివెళ్ళింది. చట్టరీత్యా వారు విడిపోగానే అన్నే తన కుమార్తెను బాధ్యతను తీసుకున్నది.
బిసెంట్ ఆమె విశ్వాసాన్ని తనకుతానే ప్రశ్నించుకుంది. ఆమె ఇంగ్లండ్ చర్చ్ కాథలిక్ శాఖ నాయకుడైన ఏడ్వర్డ్ బివరీ పుసె ని కలుసుకుని సలహా అడిగింది. ఆమె తన ప్రశ్న్లకు సమాధానం తెలియజేయగల పుస్తకాలను చెప్పమని ఆయనను అడిగినప్పుడు ఆయన ఇప్పటికే నీవు చాలా చదివావు అని చెప్పాడట. ఆమె చివరిసారిగా ఫ్రాంకును కలుసుకుని చివరిసారిగా వివాహజీవితం చక్కదిద్దడానికి విఫలప్రయత్నం చేసి చివరికి లండన్ విడిచి పెట్టింది.
బ్రిక్ బెక్
అనీబిసెంట్ బ్రిక్బెక్ లిటరరీ అండ్ సైటిఫిక్ ఇంస్టిట్యూట్ పార్ట్-టైం విద్యాభ్యాసం ఆరంభించింది. అక్కడ ఆమె మతవిశ్వాసం మరియు రాజకీయాలు రేపిన అలజడి కారణంగా ఇంస్టిట్యూషన్ గవర్నర్ ఆమె పరిక్షా ఫలితాలను ఇవ్వడానికి నిరస్కరించింది.
సంస్కర్త మరియు సామ్యవాదం
అనీ బిసెంట్ తన ఆలోచనలు సరిఅయినవని విశ్వసింవి వాటి కొరకు పోరాటం సాగించింది. ఆలోచనా స్వాతంత్రం, స్త్రీహక్కులు, సామ్యవాదం, సంతాన నిరోధం, ఫాబియన్ సోషలిజం మరియు శ్రామికుల హక్కుల కొరకు పోరాటం కొనసాగించింది.
ఫ్రాంక్ వివాహరద్దును తేలికగా తీసుకోలేక పోయాడు. ఆ కాలంలో వివాహరద్దు అన్నది మద్యతరగతి జీవితాలను అంతగా చేరుకోలేదు. అన్నీ తన మిగిలిన జీవితంలో బిసెంట్గానే మిగిలి పోయింది. ప్రారంభంలో ఆమె తన ఇద్దరు పిల్లలతో సత్సంబంధాలను కలిగి ఉంది. మాబెల్ ఆమెతోనే ఉంది. ఆమెకు భర్త నుండి స్వల్పంగా భరణం అందుతూ వచ్చింది. ఫ్రాంక్ నుండి స్వేచ్చపొందిన తరువాత ఆమెలో నుండి శక్తివంతమైన ఆలోచనలు వెలువడ్డాయి. ఆమె తాను అధిక కాలం నమ్మిన మతవిశ్వసాన్ని కూడా ప్రశ్నించడం మొదలు పెట్టింది. ఆమె చర్చిలను వారు ప్రజలజీవితాలను నియంత్రించడాన్ని విమర్శిస్తూ వ్రాయడం మొదలు పెట్టింది. ప్రత్యేకంగా ఇంగ్లండ్ చర్చిలు మతప్రచారాన్ని తోవ్రంగా విమర్శించసాగింది.