బోలిశెట్టి శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోలిశెట్టి శ్రీనివాస్
బోలిశెట్టి శ్రీనివాస్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
నియోజకవర్గం తాడేపల్లిగూడెం

వ్యక్తిగత వివరాలు

జననం 1962
తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
తల్లిదండ్రులు సత్యనారాయణ
జీవిత భాగస్వామి అనురాధ
నివాసం గణేష్ నగర్ రోడ్, తాడేపల్లిగూడెం

బోలిశెట్టి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తాడేపల్లిగూడెం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

బొలిశెట్టి శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి 1981లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి 2014 నుండి 2019 వరకు మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేసి 2019లో జనసేన పార్టీలో చేరి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] బొలిశెట్టి శ్రీనివాస్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తాడేపల్లిగూడెం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై 62492 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. EENADU (25 March 2024). "ఎన్నికల రేసులో గెలుపు గుర్రాలు". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  4. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.