యం.వి.రమణారెడ్డి
Jump to navigation
Jump to search
యం.వి.రమణారెడ్డి కడప జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. రచయిత. మాజీ శాసన సభ్యుడు. ఇతడు గుంటూరు మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్. చదివాడు. గుంటూరులో చదివే రోజుల్లో కవిత అనే మాసపత్రికను కొంతమంది మిత్రులతో కలిసి నడిపాడు. ప్రభంజనం అనే రాజకీయ పక్షపత్రికను కొంతకాలం వెలువరించాడు. ఇతడు విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. ఇతని రచనలు ఉదయం, జ్యోతి, ఆంధ్రప్రభ, ఇండియాటుడే, ఈనాడు, సాక్షి, రచన, నవ్య, సీమ సాహితి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.[1]
రచనలు[మార్చు]
- తెలుగు సినిమా స్వర్ణయుగం (సమీక్షా వ్యాసాలు)
- చివరకు మిగిలింది? (అనువాదం, మూలం:గాన్ విత్ ది విండ్)
- ఆయుధం పట్టని యోధుడు (మార్టిన్ లూథర్ కింగ్ జీవిత చరిత్ర)
- పరిష్కారం (కథలసంపుటి)
- రెక్కలు చాచిన పంజరం (అనువాదం, మూలం: పాపియాన్)
- మహాభారత స్రవంతిలో తెలుగింటికొచ్చిన ద్రౌపది
- పురోగమనం (అనువాదం, మూలం: అవే విత్ ఆల్ పెస్ట్స్)
- రాయలసీమ కన్నీటిగాథ (రాయలసీమ సమస్యలు, వాటి పరిష్కారాల గురించి)
- పెద్దపులి ఆత్మకథ (అనువాదం, మూలం: ఎ టైగర్ ఫర్ మాల్గుడి)
- మాటకారి (అనువాదం, మూలం: టాకటివ్ మ్యాన్)
- కడుపుతీపి (అనువాదం, మూలం: ద మదర్)
- ప్రపంచ చరిత్ర (నాలుగు సంపుటాలు)
- తెలుగింటి వ్యాకరణం
- శంఖారావం (వ్యాస సంపుటి)
మరణం[మార్చు]
డాక్టర్ ఎంవీ రమణారెడ్డి (78) 29 సెప్టెంబర్ 2021న కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు.[2]
మూలాలు[మార్చు]
- ↑ Andrajyothy (30 September 2021). "అరుదైన సాహితీ 'సీమ' కారుడు". Archived from the original on 30 సెప్టెంబరు 2021. Retrieved 30 September 2021.
- ↑ Sakshi (29 September 2021). "మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత". Archived from the original on 30 సెప్టెంబరు 2021. Retrieved 30 September 2021.