Jump to content

విశాఖపట్నం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
విశాఖపట్నం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
ప్రధాన కార్యాలయంవిశాఖపట్నం
మండలాల సంఖ్య6

విశాఖపట్నం రెవెన్యూ డివిజను, విశాఖపట్నంజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. విశాఖపట్నం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.

చరిత్ర

[మార్చు]

2022 ఏప్రిల్ 4 కు ముందు ఈ రెవెన్యూ డివిజన్ లో 10 మండలాలు, 146 రెవెన్యూ గ్రామాలు ఉండేయి. భీమునిపట్నం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో మండలాల సంఖ్య 6 కు తగ్గింది.[1]

రెవెన్యూ డివిజను లోని మండలాలు

[మార్చు]
  1. గాజువాక
  2. గోపాలపట్నం
  3. పెదగంట్యాడ
  4. పెందుర్తి
  5. మహారాణిపేట
  6. ములగాడ

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం డివిజన్ జనాభా 21,05,043 ఉండగా అందులో గ్రామీణ జనాభా 3,17,320 కాగా పట్టణ జనాభా 17,87,723 మంది ఉన్నారు.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 8.17% ఉండగా షెడ్యూల్డ్ తెగలు 1.14% ఉన్నారు.జనాభాలో హిందువులు 93.36% కాగా ముస్లింలు 3.29%, క్రైస్తవులు 2.67% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 93.23% తెలుగు మాట్లాడేవాళ్ళు ఉంటే ఉర్దూ 2.33%, హిందీ1.87% మాట్లాడే జనాభా ఉన్నారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. https://www.censusindia.gov.in/2011census/dchb/2813_PART_B_DCHB_VISAKHAPATNAM.pdf
  2. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.

వెలుపలి లంకెలు

[మార్చు]