విశ్వదర్శనం - భారతీయ చింతన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వదర్శనం - భారతీయ చింతన
రచయిత(లు)నండూరి రామమోహనరావు
దేశంభారత దేశం
భాషతెలుగు

విశ్వదర్శనం - భారతీయ చింతన నండూరి రామమోహనరావు విశ్వం యొక్క పుట్టుక గురించి భారతీయ తాత్విక చింతన ఎలా సాగిందో వివరించిన పుస్తకం.[1] ఈ పుస్తకం మొదటి సంచిక 1997 జనవరిలో విడుదల కాగా 2003లో రెండవ సంచిక విడుదలయింది. రచయిత ఈ పుస్తకాన్ని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సిలర్ అయిన కొత్త సచ్చిదానందమూర్తికి అంకితమిచ్చాడు.

పూర్వరంగం[మార్చు]

విశ్వదర్శనం అనే పేరుతో రెండు పుస్తకాలు వచ్చాయి. మొదటి పుస్తకం పాశ్చాత్య తత్వ చింతన గురించి చర్చిస్తుంది. రెండవదైన ఈ పుస్తకం భారతీయ తత్వ చింతన గురించి వివరిస్తుంది. ప్రపంచ దర్శన శాస్త్రాలను సంగ్రహంగా తెలుగు పాఠకులకు పరిచయం చేయడం ఈ రెండు పుస్తకాల ముఖ్యోద్దేశం. ఈ రెండు భాగాలు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 1980 - 1996 సంవత్సరాల మధ్య కాలంలో కొంత విరామాలతో ధారావాహికగా వెలువడ్డాయి. ఈ వ్యాసాలనే సంకలనం చేసి పుస్తకాలుగా విడుదల చేశారు. ఈ వ్యాసాలను రాయడానికి ప్రేరణ ఆంధ్రజ్యోతి వారపత్రిక మొదటి సంపాదకుడైన పురాణం సుబ్రహ్మణ్య శర్మ అని రచయిత ముందుమాటలో రాశాడు.[2] మొదటి భాగంగా విడుదలైన పాశ్చాత్య చింతన వ్యాసాలు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలోనే వెలువడగా తర్వాతి సంపాదకులైన తోటకూర రఘు ఆధ్వర్యంలో రెండోభాగం (భారతీయ చింతన) వ్యాసాలు ప్రచురించబడ్డాయి.

ఈ పుస్తకం ప్రకారం భారతీయుల చింతనకు మూల పురుషులు ఆర్యులు. వారి పూర్వరంగంతో ప్రారంభించి వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధం, జైనం, చార్వాకం, భగవద్గీత మొదలైన వాటిని చర్చించి, జిడ్డు కృష్ణమూర్తి ఆధ్యాత్మిక చింతనతో ఈ పుస్తకం ముగుస్తుంది. పశ్చిమ దేశాల తాత్వికులు పరలోకం కంటే ఇహలోకానికి ప్రాధాన్యమిస్తే భారతీయ తాత్వికులు అందుకు భిన్నంగా ఇహలోకం కంటే పరలోకానికి ప్రాధాన్యతనిచ్చారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Nanduri no more". News18. Retrieved 2020-03-17.
  2. నండూరి, రామమోహనరావు (2015). విశ్వదర్శనం భారతీయ చింతన. విజయవాడ: విక్టరీ పబ్లికేషన్సు. p. 7.