జిడ్డు కృష్ణమూర్తి
జిడ్డు కృష్ణమూర్తి | |
---|---|
![]() జిడ్డు కృష్ణమూర్తి (1920లలో) | |
జననం | |
మరణం | 1986 ఫిబ్రవరి 17 ఓహాయ్, కాలిఫోర్నియా | (వయసు 91)
వృత్తి | తత్వవేత్త, ఆధ్యాత్మిక ప్రాసంగికుడు, రచయిత, వక్త |
తల్లిదండ్రులు | జిడ్డు నారాయణయ్య, సంజీవమ్మ అనిబిసెంట్ (దత్తత తీసుకున్న వారు) |
వెబ్సైటు | www |
జిడ్డు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక తత్వవేత్త. జిడ్డు కృష్ణమూర్తి తాత్విక ధ్యానం అనే అంశంపై ప్రభావంతమైన రచయిత మరియ తత్వవేత్తగా పరిగణించబడ్డారు. సమాజంలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి. వ్యక్తుల ఆలోచన ధోరణి మారినప్పుడే సామాజిక మార్పు సాధ్యమవుతుందని ఆయన విశ్వసించారు. జిడ్డు కృష్ణమూర్తి ఆధ్యాత్మిక విషయాలను కూడా చర్చించాడు. మరియు ప్రతి ఒక్కరూ సామాజిక రాజకీయ మతపరమైన విప్లవాన్ని పరిగణించాలని సూచించారు. జిడ్డు కృష్ణమూర్తికి తన బాల్యం మొత్తం గుర్తులేదు.
ఆరంభ జీవితం[మార్చు]
[[జిడ్డు కృష్ణమూర్తి నారాయణయ్య సంజీవమ్మ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి బ్రిటిష్ పరిపాలనలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని తల్లి 10 సంవత్సరాల వయసులో మరణించింది. 1903వ సంవత్సరములో జిడ్డు కృష్ణమూర్తి పాఠశాలకు వెళ్లిన తన స్థానం నుండి అతనిని మార్చాడు. జిడ్డు కృష్ణమూర్తి అంతుచిక్కని వ్యక్తిగా పరిగణించబడ్డాడు. మరియు మానసిక వికలాంగుడిగా పరిగణించబడ్డాడు. జిడ్డు కృష్ణమూర్తి 18 సంవత్సరాల వయసులో తన చిన్ననాటి జ్ఞాపకాలను రాయడం ప్రారంభించాడు. మరణించిన తన సోదరి తనకు ఆసాధారమైన దృష్టి ఉందని జిడ్డు కృష్ణమూర్తి చెప్పాడు.
జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ముఖ్య ఘట్టాలు[మార్చు]
1911లో ఇతడు పాఠశాలలో కొత్త సంవత్స కొత్త సమూహానికి నాయకుడిగా పేర్కొంది. ప్రపంచ ఉపాధ్యాయుడు కోసం ప్రపంచానికే శిక్షణ ఇది అంతర్జాతీయ పత్రిక కవరేజీని ప్రచారాన్ని పొందిన సంఘటన. తన చుట్టూ ఉన్న పబ్లిసిటీ మరియు తన విధిని అంచనా వేయడంతో అతను సంతోషంగా లేడని ఉపాధ్యాయుల 1911లో జిడ్డు కృష్ణమూర్తి ఇంగ్లాండుకు వెళ్లాడు. అక్కడ మొదటిసారిగా ప్రసంగం ఆ ప్రసంగం వేదిక మీద ఉన్న ప్రజలందరినీ ఆకట్టుకుంది. తరువాత జిడ్డు కృష్ణమూర్తి ప్రచురణాలు పత్రికల కోసం రాయడం మొదలు పెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక చర్చలు సమావేశాలకు జిడ్డు కృష్ణమూర్తి 1982లో రోషలిండు విలియమ్స్ తో విలియంతో సమావేశమయ్యాడు. ప్రపంచ ఉపాధ్యాయ ప్రాజెక్టు గురించి చర్చించారు. జిడ్డు కృష్ణమూర్తి కి ఆధ్యాత్మికతలో జీవితకాలపు అనుభవం మొదట శారీరక అసౌకర్యంగా తరువాత అపస్మా రాక రకా స్థితిని అనుభవించాడు. 1930 దశకంలో గాంధీజీ యూరప్ అమెరికా మరియు ఆస్ట్రేలియా అంటట ప్రసంగాలు చేశారు. ఈ ప్రసంగాలు జిడ్డు కృష్ణమూర్తిని ఆకట్టుకున్నాయి. అడయారు గ్రంథాలయాధికారి ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డాడు. ఈ విషయం డాక్టర్ అనిబిసెంట్ కి తెలియజేసి, ఆ ఇద్దరినీ ఆమె వద్దకు రప్పించాడు. ఆ సొదరులిద్దరినీ చూసి అనిబిసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. అంతటితో వారిద్దరినీ విద్యార్జన నిమిత్తం ఇంగ్లాండ్ పంపించింది. పారిస్ లోని సారబాన్ విశ్వ విద్యాలయంలో కృష్ణమూర్తి సంస్కృతమూ, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేయసాగాడు. తన కొడుకులను తనకు తిరిగి ఇప్పించమని కృష్ణమూర్తి తండ్రి కోర్టులో దావా వేశాడు. చివరికి అనిబిసెంట్ కు ఆ దావా వ్యతిరేకమైంది. అయినప్పటికీ ఏదో విధంగా ఆ సోదరులిద్దరూ తన వద్దే ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నది. జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువని ఆమె విశ్వాసం. ఆ మేరకు ప్రపంచమంతా చాటింది. అప్పటికి కృష్ణమూర్తి తాను జగద్గురువును అవునని కాని, కాదని కాని ఏమీ వెల్లడించలేదు. ఇంతలో తన తమ్మునికి జబ్బు చేసినందున తన తమ్ముని తీసుకుని అతను అమెరికా లోని కాలిఫోర్నియాకు వెళ్ళిపోయాడు. అక్కడి వాతావరణం తమ్ముని ఆరోగ్యాన్ని ఏమైనా బాగు చేస్తుందేమో అని 1922 లో కాలిఫోర్నియా కొండల్లో ఒక ఇంటిలో సోదరులిద్దరూ నివాసం ఏర్పరుచుకున్నారు. 1925 లో తమ్ముడు నిత్యానంద మరణించాడు. తమ్ముని మరణం కృష్ణమూర్తిని శోకంలో ముంచింది. ఆ దుఃఖావేశంలో తనకు కనిపించే బాటసారులందరినీ తన తమ్ముడెక్కడైనా కనిపించాడా అని అడిగేవాడు. నిత్యానంద మరణం కృష్ణమూర్తిలో విపరీతమైన మార్పును తెచ్చింది. చిన్నప్పట్నుంచీ అతను ఏవిషయాన్ని పూర్తిగా నమ్మక, ప్రతీ విషయాన్నీ శంకించేవాడు. తనకు ప్రత్యక్ష ప్రమాణం దొరికినప్పుడు మాత్రమే దాన్ని నమ్మేవాడు. కరడు కట్టిన సాంప్రదాయ వాసనలతో బూజు పట్టిపోతున్న మతాలమీద అతనుకు నమ్మకముండేది కాదు. థియోసాఫికల్ సొసైటీవారు నమ్మే గుప్తవిద్య (Occultism) మీద కూడా అతనుకు నమ్మకముండేది కాదు. తనను జగద్గురువని ప్రచారం చేసిన దానిలోనూ అతనుకు నమ్మకముండేది కాదు. తమ్ముని మరణంతో అతను దృక్పథం మరింత బలీయమైంది.
తత్వవేత్త గా[మార్చు]
కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్" అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి, కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. కొంతకాలం వరకూ కృష్ణమూర్తి అందుకు అభ్యంతరం ఏమీ చెప్పలేదు. అంతవరకూ తాను కృష్ణమూర్తినా లేక జగద్గురువునా అనే విషయంలో ఏ నిర్ణయానికీ రాలేకపోయాడు. సోదరుని మరణం అతనిలో తెచ్చిన దుఃఖం కొంతకాలానికి అతనులో ప్రతిక్రియను తెచ్చింది. దుఃఖం సమసిపోయి ఒక విధమైన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తీసుకువచ్చింది. ఆయనలో జీవం ప్రవేశించింది. తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు అతనికి జరగసాగేయి. అతను నడచేదారిలో గులాబిపూలు పోసేవారు. హాలెండ్ లో ఒకరు బ్రహ్మాండమైన సౌధాన్నీ, అయిదువేల ఎకరాలు భూమిని సమర్పిస్తామంటే వద్దని నిరాకరించాడు. ఇటువంటి అద్భుతమైన గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి ఆ గౌరవాలకు విలువ ఇవ్వక, తన ఎప్పటి సాదా జీవితాన్నే గడపసాగేడు. చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది. అది తనకు ఇష్టంలేదు. తనకు బయట జరుగుతున్న దానికి అంతకూ వ్యతిరేకం కాజొచ్చాడు. తన విశ్వాసానికి విరుద్ధంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా ఉండే నిమిత్తమో, భౌతిక లాభాల నిమిత్తమో, అతను ప్రవర్తించదలచక చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువును కాదని ప్రకటించి "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ "ను రద్దుచేశాడు.
ఈ మహాత్యాగానికి జగత్తంతా విస్తుపోయింది. డాక్టర్ అనిబిసెంట్ లాంటి పెద్దలంతా నిరాశతో బాధపడ్డారు. అభిప్రాయాన్ని మార్చుకోమని ఒత్తిడి తెచ్చారు. కాని లాభం లేకపోయింది. తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని జగద్గురువును కానని చాటసాగేడు. చివరకు లాభం లేకపోయింది. ఎక్కడివారక్కడ అసంతృప్త హృదయాలతో మౌనం దాల్చారు. అప్పటినుంచీ కృష్ణముర్తి స్వతంత్రమానవుడు, స్వేచ్ఛాచింతన కలవాడు, నవమానవతావాది, ఎవరి అభిమానాలనూ ఆశించక, ఎవరి సహాయాలనూ కాంక్షించక, ఎవరి నిందలనూ లెక్కచేయక, జీవన సంగ్రామపు వాస్తవాన్ని గుర్తించి, గొప్ప జీవన శిల్పిగా రూపొందాడు.
బోధనలు[మార్చు]
మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించాడు.
ఇతరములు[మార్చు]
కృష్ణమూర్తిని అతను బాల్యంలో చూచిన లెడ్ బీటర్ (దివ్యజ్ఞాన సమాజోద్యమనేత. మేడమ్ బ్లావెట్స్కీతో పని చేసినవారు), ఆ బాలుని చుట్టూ కనిపించిన అసాధారణ కాంతివలయాన్ని గమనించి అతడు మహాపురుషుడవుతాడని ప్రకటించారు. కృష్ణమూర్తినీ, అతను సోదరుడినీ చేరదీసిన లెడ్బీటర్ చదువు చెప్పించి వృద్ధిలోకి తీసుకొని రావాలనుకొన్నారు. కృష్ణమూర్తి స్వతంత్ర భావాలు త్వరలోనే బయటకొచ్చి అతను విశిష్టమూర్తిమత్వం లోకానికి వెల్లడైంది. కృష్ణమూర్తి ఎక్కువ కాలం విదేశాలలో గడిపారు. కానీ, ప్రతి సంవత్సరం భారతదేశానికి వస్తుండేవారు. తెలుగువారైనా తెలుగు దాదాపు మరచిపోయారు. ఈ గ్రంథకర్త ‘‘ఆంధ్రప్రభ’’ సచిత్ర వార పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, ప్రతి సంవత్సరం కృష్ణమూర్తితో ఒక ఇంటర్వ్యూ ప్రకటించడం ఆనవాయితీగా ఉండేది. కృష్ణమూర్తిని గురించి సమగ్రంగా అధ్యయనం చేసిన శ్రీ నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తుండేవారు. కృష్ణమూర్తి జీవితం చివరి సంవత్సరం వరకు ఈ ఇంటర్వ్యూల ప్రచురణ కొనసాగింది. ఒక సారి ‘‘మీరు తెలుగువారు కదా. తెలుగు ఏమైనా జ్ఞాపకం ఉందా?’’ అని ప్రశ్నిస్తే ఒంట్లు లెక్కించడానికి ప్రయత్నించి, మూడు - నాలుగు అంకెలు పలికి, ఇటాలియన్ భాషలోకి మారిపోయారు.
తాను గురువును గానీ, ప్రవక్తను గానీ కానని అతను చాలా సార్లు ఖండితంగా ప్రకటించారు. అతను బోధించిన తత్త్వం ఏ నిర్ణీత తాత్త్విక చట్రంలోకీ ఇమడదు. దాని ప్రత్యేకత దానిదే. సమస్త జీవరాసుల పట్ల అతను కారుణ్యాన్ని వ్యక్తం చేస్తుండేవారు. తనదంటూ ఏ వస్తువునూ అతను ఏర్పరచుకోలేదు, మిగుల్చుకోలేదు.[1]
కృష్ణమూర్తి ప్రసంగాల సారాంశం[మార్చు]
“ | అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. | ” |
“ | రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్బంధించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది. | ” |

తెలుగులో వెలువడిన కొన్ని రచనలు[మార్చు]
- కృష్ణమూర్తి తత్వం-పరిచయ సంపుటం.[2]
- శ్రీలంక సంభాషణలు.
- గతం నుండి విముక్తి
- ఈ విషయమై ఆలోచించండి (1991) [3], [4]
- ముందున్న జీవితం
- ధ్యానం
- విద్య, అందు జీవితమునకుగల ప్రాధాన్యత
- మన జీవితాలు-జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు
- స్వీయజ్ఞానం
- స్వేచ్ఛ (ఆది లోనూ-అంతంలోనూ)
- నీవే ప్రపంచం [5]
- గరుడయానం
- నిరంతర సత్యాన్వేషణ [6]
- చేతన [7]
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ శ్రీవిరించి (1998). నిరంతర సత్యాన్వేషణ-జిడ్డు కృష్ణమూర్తి తత్వం. జయంతి పబ్లికేషన్స్.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Jiddu-intro
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఈ విషయమై ఆలోచించండి, మొదటి భాగము.
- ↑ ఈ విషయమై ఆలోచించండి, రెండవ భాగము.
- ↑ నీవే ప్రపంచం.
- ↑ నిరంతర సత్యాన్వేషణ.
- ↑ చేతన.
బయటి లింకులు[మార్చు]

- జిడ్డుకృష్ణమూర్తి-తెలుగు's channel యూట్యూబ్లో
- జిడ్డు కృష్ణమూర్తి (2020). నిజమైన సంక్షోభం (PDF). Krishnamurti Foundation of India.
- "Krishnamurti Foundation of India website". Retrieved 2021-03-13.
- మూలాల లోపాలున్న పేజీలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- మదనపల్లె వ్యక్తులు
- 1895 జననాలు
- 1986 మరణాలు
- 20వ శతాబ్దపు తత్వవేత్తలు
- చిత్తూరు జిల్లా తత్వవేత్తలు