శాంతా రంగస్వామి
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | Shantha Rangaswamy | |||
జననం | Madras, తమిళనాడు, India | 1954 జనవరి 1|||
బ్యాటింగ్ శైలి | Right-hand bat | |||
పాత్ర | All Rounder | |||
International information | ||||
టెస్టు అరంగ్రేటం | 31 October 1976 v West Indies women | |||
చివరి టెస్టు | 26 January 1991 v Australia women | |||
ODI debut | 10 January 1982 v Australia women | |||
చివరి వన్డే | 27 July 1987 v England women | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | Tests | ODI | ||
మ్యాచులు | 16 | 19 | ||
చేసిన పరుగులు | 750 | 287 | ||
బ్యాటింగ్ సరాసరి | 32.60 | 15.10 | ||
100s/50s | 1/6 | 0/1 | ||
అత్యధిక స్కోరు | 108 | 50 | ||
బౌలింగ్ చేసిన బంతులు | 1,555 | 902 | ||
వికెట్లు | 21 | 12 | ||
బౌలింగ్ సరాసరి | 31.61 | 29.41 | ||
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | – | - | ||
మ్యాచ్ లో 10 వికెట్లు | – | - | ||
ఉత్తమ బౌలింగ్ | 4/42 | 3/25 | ||
క్యాచులు/స్టంపులు | 10/– | 6/– | ||
Source: ESPNcricinfo, 11 January 2013 |
1954, జనవరి 1న మద్రాసు (చెన్నై) లో జన్మించిన శాంతా రంగస్వామి (Shantha Rangaswamy) భారతదేశపు మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1976 నుంచి 1991 మధ్యకాలంలో ఆమె భారత మహిళా క్రికెట్ జట్టు తరఫున 16 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. 1976-77 లో 8 టెస్టులకు, 1983-84 లో 4 టెస్టులకు ఆమె నాయకత్వం కూడా వహించింది. 1981-82 నుంచి 1986 మధ్యకాలంలో ఆమె 19 వన్డే మ్యాచ్లను ఆడింది. అందులో 16 వన్డేలకు నేతృత్వం వహించింది.
కుడిచేతితో బ్యాటింగ్ చేసే శాంతా రంగస్వామి టెస్టులలో 32.6 సగటుతో మొత్తం 750 పరుగులు సాధించింది. ఇందులో న్యూజీలాండ్ పై సాధించిన ఒక సెంచరీ కూడా ఉంది.[1]. ఆమె అత్యధిక స్కోరు 108 పరుగులు. బౌలింగ్ లో 16 వికెట్లు కూడా సాధించింది. బౌలింగ్ లో ఆమె అత్యున్నత గణాంకము 42 పరుగులకు 4 వికెట్లు. ఇది ఇంగ్లాండు పై సాధించింది.
వన్డే క్రికెట్లో 19 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించి 15.1 సగటుతో 287 పరుగులు సాధించింది. బౌలింగ్లో 29.41 సగటుతో 12 వికెట్లు పడగొట్టింది. 1982లో న్యూజీలాండ్ లో జరిగిన మహిళా ప్రపంచ కప్ క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆమె ప్రథమస్థానం పొందింది. ఇదే ప్రపంచ కప్ పోటీలలో న్యూజీలాండ్పై ఆమె వన్డేలలో ఏకైక అర్థ శతకం సాధించింది. ప్రస్తుతం శాంతా రంగస్వామి క్రికెట్ రచయిత్రిగా పనిచేస్తుంది.
అవార్డులు[మార్చు]
ఆమె యొక్క ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం 1976లో భారత క్రీడారంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డును ప్రధానం చేసింది.