Coordinates: 16°15′10″N 79°54′57″E / 16.252669°N 79.915951°E / 16.252669; 79.915951

సంతగుడిపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతగుడిపాడు
—  రెవెన్యూ గ్రామం  —
సంతగుడిపాడు is located in Andhra Pradesh
సంతగుడిపాడు
సంతగుడిపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°15′10″N 79°54′57″E / 16.252669°N 79.915951°E / 16.252669; 79.915951
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం రొంపిచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,216
 - పురుషుల సంఖ్య 2,564
 - స్త్రీల సంఖ్య 2,652
 - గృహాల సంఖ్య 1,398
పిన్ కోడ్ 522615
ఎస్.టి.డి కోడ్

సంతగుడిపాడు, పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన రొంపిచర్ల నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసరావుపేట నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1398 ఇళ్లతో, 5216 జనాభాతో 1850 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2564, ఆడవారి సంఖ్య 2652. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1126 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 471. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590133.[1]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి రొంపిచర్లలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నరసరావుపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి. ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలకి గుదే మధు మోహన్ గారు డిజిటల్ తరగతి గదిని బహూకరించారు.ఎంపిపి పాఠశాలకి సహృదయులు ఎంతోమంది తమ విరాళాలు అందించి తమవంతు సహకారం అందిస్తున్నారు.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

సంతగుడిపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

సంతగుడిపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామ చరిత్ర, విశేషాలు[మార్చు]

కల్యాణ మండపం

గ్రామ నామము సంఘటన నామ సూచికగా పేర్కొనవచ్చును . పూర్వం గుడిపాడుగా పిలవబడే ఈ గ్రామంలో సంతలు నిర్వహించడం వలన రానురాను సంతగుడిపాడుగా గ్రామనామము స్థిరపడింది. సంతగుడిపాడు గ్రామ నామానికి మరో కథనంకూడా ప్రచారంలో ఉన్నది . పద్నాలుగో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పర్యటన చేస్తూ... రొంపిచర్లలోని ఈ ప్రాంతానికి వచ్చేసరికి దాహం తీర్చుకోవాలనిపించి ఊరికి ఎడమ వైపుగా ఉన్న ఉత్తర కోనేరులో దాహం తీర్చుకున్నారు. అనంతరం అక్కడి ప్రశాంత వాతావరణాన్ని గమనించి అక్కడో గుడి కట్టించి...దానికి గుడిపాడుగా నామకరణం చేశారు. వేద అధ్యయన పద్ధతిని "సంత" అంటారు. అటువంటి "సంత" గుడిలో జరుగుతున్న కారణంగా గ్రామానికి సంతగుడిపాడు అని పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు.

సౌకర్యాలు, వృత్తి విశేషాలు[మార్చు]

వేణుగోపాల స్వామి గుడి
శివుడి గుడి

పాడిపంటల, ధన ధాన్యాల, విద్యా, వైఙ్ఞానిక, సాహిత్య కుసుమాల సంత సంతగుడిపాడు . ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్న శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయం అక్కడున్న శాసనాలను బట్టి పద్నాల్గవ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది . గ్రామంతో పాటు ఎస్. సి. కాలనీలు రెండు, ఎస్.టి కాలనీలు రెండు, ఇ.బి.సి.కాలనీలతో ఈ గ్రామం విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో 12వేల మంది జనాభా నివసిస్తున్నారు . అందులో 6100 మంది పురుషుల సంఖ్య, కాగా 5900 మంది స్త్రీల సంఖ్య. ఈ గ్రామంలో రెండు ప్రాథమిక పాఠశాలలు, ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నాయి. పశువుల వైద్యం నిమిత్తం ప్రభుత్వం వారి పశు వైద్యశాల, కూడా ఈ గ్రామంలో ఉంది. గ్రామంలో అక్షరాస్యత 75 % ఉన్నారు . మిగతా 25 % అక్షరాస్యులుగా తీర్చిదిద్దే నిమిత్తం అక్షరదీప్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి . వరి పంటతో పాటు మిరప, ప్రత్తి, అపరాలు పంటలు పండిస్తారు. వ్యవసాయం చెరువుల క్రింద, నాగార్జునసాగర్ కాలువల క్రింద సాగుచేయడం జరుగుతుంది. వ్యవసాయానికి ఆర్థిక సహాయనిమిత్తం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు తమ సేవలను అందిస్తున్నాయి . రైతులు పండించిన పంటలను నిల్వచేసుకునే నిమిత్తం పి.ఎ.సి.ఎస్.లో గోదాము సౌకర్యం ఉంది. గోదాముల నిర్మాణానికి చింతగుంట బిక్షాల్ రెడ్డి చేసిన కృషి అభినందనీయం . ఈ గ్రామంలో 1952 వ సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ గ్రామస్థులు విద్యాభివృద్ది పట్ల ఎక్కువ మక్కువ చూసేవారు. అప్పట్లో స్కూల్లో చదువుకునే విద్యార్థులకు మామిళ్ళపల్లి హనుమయ్య తన సొంత ఖర్చుతో హాస్టల్ వసతిని ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో స్కూలు బిల్డింగులన్నీ దాతలే సొంత ఖర్చుతో నిర్మించి యిచ్చారు . విద్యానిలయంగా భావించే ఈ గ్రామంలో ఎనిమిదిమంది ఎమ్.బి.బి.యస్. లోను, ఎనిమిదిమంది బి.డి.యస్. లోను, ఐదుగురు బి.వి.ఎస్.సి. లోను, ఇరవైమంది పోస్టుగ్రాడ్యుయేషన్ లోను, పదిమంది ఇంజనీరింగ్ లోను, నలుగురు న్యాయవాదులు గాను పట్టాలు పొందిన వారు ఉన్నారు .

ప్రముఖులు[మార్చు]

సాహిత్యరంగంలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన వారిలో అష్టావధాని మంచికంటి వెంకటేశ్వర్లు, శతావధాని మైలవరం నరసింహా, వంద కవితలు వ్రాసిన అచ్చుల వెంకట సుబ్బారావు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత రెంటాల నాగేశ్వరరావు, సన్నాయి విద్వాంసుడు నసర్ధీ, ఘంటసాలకు సన్నిహితుడుగా భావింపబడే సంగీత విద్వాంసుడు మహావాది వెంకటప్పయ్య శాస్త్రిలు ఈ గ్రామం వారే.

బ్రహ్మం గారి గుడి

1992 లో రెంటాల నాగేశ్వరరావు రచించిన "తిలదానం" అనే కథ రాష్ట్రపతి అవార్డు అందుకున్నది. " అచ్చుల " రచించిన వందకవితలలో 35 కవితలు ప్రజాధారణ పొందాయి. వీరు రచించిన జీవిత గణితం జాతీయస్థాయిలో బహుమతి పొందింది . మంచకంటి వెంకటేశ్వర్లు రచించిన ప్రేమలీల కథ ఆధారంగా ప్రేమలీల అనే సినిమా తీశారు . ఉన్నత విద్యలనభ్యసించాలని విదేశాలలో స్థిరపడిన వారుకూడా ఈ గ్రామంలో ఉన్నారు .

ఈ గ్రామానికి సర్పంచులుగా బొల్లుచలమయ్య, చింతగుంట కోటిరెడ్డి, మామిళ్ళపల్లి వీరయ్య చౌదరి, పల్లకి ప్రకాశరెడ్డి, మామిళ్ళపల్లి హనుమయ్య, కోమిటినేని కృష్ణమూర్తి, ఎమ్.పెదమరియదాసులు, కాటా వెంకాయమ్మ ఈ గ్రామానికి సేవ చేసారు . మామిళ్ళపల్లి వీరయ్య చౌదరి పంచాయితీ కార్యాలయ నిర్మాణం, గ్రామంలో రోడ్ల నిర్మాణం, బ్రిడ్జీల నిర్మాణానికి కృషి చేశారు. పల్లకి ప్రకాశ రెడ్డి ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యానికి బావుల నిర్మాణం చేపట్టారు. ప్రాథమిక పాఠశాలకు ఒక తరగతి గదిని తన సొంత ఖర్చులతో నిర్మించి ప్రకాశరెడ్డి తన నిస్వార్ధ సేవను నిరూపించారు.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 9 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

సంతగుడిపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 201 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 14 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 64 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 16 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 108 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 101 హెక్టార్లు
  • బంజరు భూమి: 10 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1331 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 299 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1144 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

సంతగుడిపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1144 హెక్టార్లు

గణాంకాలు[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 5555, పురుషుల సంఖ్య 2716, మహిళలు 2839, నివాస గృహాలు 1324,,విస్తీర్ణం 1850 హెక్టారులు

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".