సికందర్ బఖ్త్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సికందర్ బఖ్త్

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
మే 21, 1996 – జూన్ 1, 1996
ముందు ప్రణబ్ ముఖర్జీ
తరువాత ఐ. కె. గుజ్రాల్

రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
జులై 7, 1992 – మే 21, 1996
ముందు ఎస్ జైపాల్ రెడ్డి
తరువాత శంకరరావు చవాన్
పదవీ కాలం
జూన్ 1, 1996 – మార్చి 19, 1998
ముందు శంకరరావు చవాన్
తరువాత మన్మోహన్ సింగ్

చాందిని చౌక్ లోక్ సభ నియోజకవర్గం ప్రతినిధి - Member of Parliament
పదవీ కాలం
1977 – 1980
ముందు సుభద్ర జోషి
తరువాత భికూ రామ్ జైన్

వ్యక్తిగత వివరాలు

జననం ఆగస్టు 24, 1918
ఢిల్లీ, బ్రిటిష్ ఇండియా
మరణం 2004 ఫిబ్రవరి 23(2004-02-23) (వయసు 85)
తిరువనంతపురం, కేరళ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ(after 1980)
జనతా పార్టీ (1977–1980)
కాంగ్రెస్ (ఓ) (1969–1977)
కాంగ్రెస్ (ముందు 1969)
సంతానం 2
పూర్వ విద్యార్థి ఆంగ్లో-అరబిక్ కళాశాల, ఢిల్లీ
మతం ఇస్లాం

సికందర్ బఖ్త్ (ఆగస్టు 24, 1918 - ఫిబ్రవరి 23, 2004) ఈయన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఈయన పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత.[1]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈయన 1918, ఆగస్టు 24 న న్యూఢిల్లీ లో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను న్యూఢిల్లీలోని ఆంగ్లో అరబిక్ సీనియర్ సెకండరీ స్కూల్లో పూర్తిచేసాడు. ఈయన న్యూఢిల్లీలోని ఆంగ్లో-అరబిక్ కళాశాల (ప్రస్తుతం జాకీర్ హుస్సేన్ కళాశాల అని పిలుస్తారు) నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశాడు. ఈయన తన పాఠశాల, కళాశాల రోజులలో హాకీ ఆటగాడు, వివిధ టోర్నమెంట్లలో ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ తరపున తన ప్రాతినిధ్యం వహించేవాడు.

బఖ్ట్ గారు ముస్లిం మతస్థులు అయినప్పటికీ రాజ్ శర్మ అనే హిందూ బ్రాహ్మణ యువతి ని ప్రేమ వివాహాం చేసుకొని హిందూ మతాన్ని అవలభించారు, ఆయన కుమారుల పేర్లను సైతం హిందూ పేర్లు పెట్టుకున్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

ఈయన 1952 లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఢిల్లీ పురపాలక కార్పొరేషన్‌కు ఎన్నికయ్యాడు. 1968 లో ఢిల్లీ విద్యుత్ సరఫరా సంఘం చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 1969 లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిన తరువాత ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్) లో కాకుండా బఖ్త్ గారు పాత కాంగ్రెస్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ (ఓ)తో కొనసాగారు , ఆ పార్టీ అభ్యర్థిగా మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ కి ఎన్నికయ్యాడు. ఈయన జూన్ 25, 1975 న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు ఈయనతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు జైలు పాలయ్యారు. 1976 డిసెంబర్‌లో విడుదలయ్యే వరకు ఈయన్ని రోహ్తక్ జైలులో ఉంచారు. ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మార్చి 1977 లో సాధారణ ఎన్నికలకు ఆదేశించారు అప్పుడు ప్రతిపక్ష నాయకులను విడుదల చేసిన వెంటనే వారు అన్ని ప్రతిపక్ష పార్టీలను విలీనం చేసి జనతా పార్టీని ఏర్పాటు చేశారు. మార్చి 1977 లో న్యూ ఢిల్లీలోని చాందిని చౌక్ నుండి జనతా పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు (భారత పార్లమెంటు దిగువ సభ) కు ఎన్నికయ్యాడు. అప్పుడు మొరార్జీ దేశాయ్‌ను ప్రధానిగా నియమించారు.ఈయన వర్క్స్, హౌసింగ్, సప్లై, పునరావాసం మంత్రివర్గ మంత్రిగా నియమించారు. ఈ హోదాలో జూలై 1979 వరకు విధులు నిర్వహించాడు.1980 లో జనతా పార్టీ లో చీలికలు ఏర్పడిన తరువాత పూర్వ జనసంఘ్ నాయకులు కలిసి ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీలో చేరారు. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలో స్థాపించిన బీజేపీ పార్టీలో చేరిన మొదటి తరం ముస్లిం మైనారిటీ నాయకుల్లో వీరు ఒకరు, వాజపేయి గారు వీరికి పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ఢిల్లీ బీజేపీ లో కీలకమైన నాయకుడిగా వ్యవహరిస్తూ పార్టీని ముస్లిం మైనారిటీలకు చేరువ చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు.

1984 లో బీజేపీ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈయన 1990 లో మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు (భారత పార్లమెంటు ఎగువ సభ) ఎన్నికయ్యాడు. 1992 లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడయ్యాడు. ఈయన 1996 ఏప్రిల్ 10 న మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యాడు. మే 1996 లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రి పదవిని నిర్వహించాడు. ఈయన మే 24 న విదేశీ వ్యవహారాల మంత్రి పదవిలో ఉన్నాడు. కానీ ఆనాటి వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులు మాత్రమే కొనసాగింది. 1 జూన్ 1996 న వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోయినప్పుడు రాజీనామా చేయవలసి వచ్చినందున ఈయన ఒక వారం కన్నా ఎక్కువ కాలం విదేశాంగ మంత్రిగా ఉన్నాడు. వాజ్‌పేయి ప్రభుత్వం పతనం తరువాత ఈయన మరోసారి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడయ్యాడు. 1998 లో వాజ్‌పేయి మళ్లీ ప్రధానిగా అయిన తరువాత ఈయనకు పరిశ్రమ మంత్రిగా పనిచేశాడు. ఈ పదవిలో 2002 వరకు నిర్వహించాడు. పరిశ్రమల మంత్రిగా పదవి కాలం అయిపోయిన తరువాత ఈయన క్రియాశీల రాజకీయాల నుండి రిటైర్ అయ్యాడు. 2002 లో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యాడు. కేరళ గవర్నర్‌గా నియమితులైన తొలి బీజేపీ నాయకుడు ఇతనే.[2]

పురస్కారాలు[మార్చు]

ఈయనకు 2000 లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.[3]

మూలాలు[మార్చు]

  1. "Why Owaisi has suddenly become an attractive option for some". Archived from the original on 2018-12-25. Retrieved 2019-12-07.
  2. "List of Rajya Sabha members Since 1952". Archived from the original on 2019-02-14. Retrieved 2019-12-07.
  3. http://timesofindia.indiatimes.com/india/Bharat-Ratna-for-Malviya-Padma-Vibhushan-for-Advani-Badal/articleshow/46752293.cms