బసవరాజు రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి +{{Authority control}}
పంక్తి 35: పంక్తి 35:
== ఇవి కూడా చూడండి ==
== ఇవి కూడా చూడండి ==
[[బసవరాజు అప్పారావు]]
[[బసవరాజు అప్పారావు]]

==వర్గాలు==
{{Authority control}}


[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]
==వర్గాలు==
[[వర్గం:1904 జననాలు]]
[[వర్గం:1904 జననాలు]]

19:35, 25 ఆగస్టు 2018 నాటి కూర్పు

బసవరాజు రాజ్యలక్ష్మి తెలుగు కవయిత్రి. జననం 1904లో. ఆమె ప్రముఖ కవి బసవరాజు అప్పారావు భార్య. అప్పారావుగారు చనిపోయిన తరవాత ఆమె గుంటూరు శారదానికేతనములో శేషజీవితము గడిపేరు.

రచన రంగంలో

రాజ్యలక్ష్మి సౌదామిని కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు.[1] అప్పారావు గారు - నేను పేరుతో ఆత్మకథ రచించారు.

ఉదాహరణలు

సూర్యుండు పడమటా కుంకేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
చంద్రకాంతం పూలు పూచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
ఆవు లంబా యనుచు అరిచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
బీరల్ల పూవుల్లు పూచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
అరుణోదయమ్ము వేళను
ఆకసమున బారె పిట్ట
లానందముగను బాడుచు
మంగళగీతములతోను!

పారిజాత పూవులన్ని
పడిపోయెను పాదులలో
పుణ్య భరతభూమి పైన
పూలక్షతలు చల్లినటుల!

నే నిటులే గడుపుచుంటి
నీవు లేని జీవితమ్ము,
నొంటిగా విసిగివేసట
నావికుడు లేని నావవలె![2]

రచనలు

  • దురదృష్టము కావ్యము

మూలాలు

  1. రాజ్యలక్ష్మి ఆత్మకథ "అప్పారావు గారు - నేను"
  2. చైతన్యదేహళి:ఇరవైయవ శతాబ్దపు తెలుగు కవితాసంపుటి(సం:డా.కల్లూరి శ్యామల; ప్ర:నేబుట్ర)

ఇవి కూడా చూడండి

బసవరాజు అప్పారావు

వర్గాలు