ఆవిరి (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 29: | పంక్తి 29: | ||
== కథ == |
== కథ == |
||
రాజ్(రవిబాబు), లీనా(నేహా చౌహాన్) |
రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) దంపతులకు శ్రేయ, మున్ని అనే ఇద్దరు ఆడపిల్లలు. రాజ్ బిజినెస్మేన్. పిల్లలిద్దరికి ఆస్తమా ఉంటుంది. పిల్లలిద్దరూ స్విమ్మింగ్ చేస్తుండగా శ్రేయకు ఊపిరాడక స్మిమ్మింగ్ పూల్లోనే చనిపోతుంది. శ్రేయ చనిపోవడంతో లీనా ఆ ఇంట్లో ఉండలేకపోవడంతో వేరే ఇంటికి మారుతారు. కొత్త ఇంటికి వెళ్లాక చిన్న కూతురు మున్ని వింతగా ప్రవర్తిస్తుంది. ఒక ఆత్మతో మున్ని మాట్లాడుతూ ఉంటుంది. రెండుమూడు సార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఆస్తమా ఉన్న కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం లీనా తన ఇంటికి సెక్యురిటీ లాకర్స్ ఏర్పాటు చేస్తుంది. ఏ డోర్ తీసినా అలారం మోగేలా పోలీసుల సాయంతో సెట్ చేస్తుంది. అయితే ఒక రోజు మున్ని ఇంట్లో నుంచి మాయమైపోతోంది. అదే టైమ్లో రాజ్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తున్న జాన్వీ(ప్రియా వడ్లమాని) కూడా కనిపించకుండా పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందుతుంది. |
||
జాన్వీ మిస్సింగ్ కేసు రాజ్ స్నేహితుడైన పోలీసు అధికారి వినోద్(ముక్తా ఖాన్) విచారిస్తుంటాడు. ఆ కేసు విషయం గురించి రాజ్ను విచారిద్దామని అతని ఇంటికి వస్తే.. మున్ని కనిపించడం లేదన్న విషయం తెలిసి ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తారు. అందులో వినోద్కు సంచలన విషయాలు తెలుస్తాయి. మున్నితో ఒక ఆత్మ ఉందనే విషయం తెలుస్తుంది. ఆత్మల గురించి తెలిసిన తన మిత్రుడు డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్)ను పిలిపిస్తాడు. అప్పటి వరకు మామూలుగా ఉంటే రాజ్ భార్య లీనాలోకి ఒక్కసారిగా ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? మున్నిని ఎవరు తీసుకెళ్లారు? జాన్వీని ఎవరు చంపారు? అనే ఆసక్తికర అంశాలు సినిమాలో చూడాల్సిందే. |
జాన్వీ మిస్సింగ్ కేసు రాజ్ స్నేహితుడైన పోలీసు అధికారి వినోద్(ముక్తా ఖాన్) విచారిస్తుంటాడు. ఆ కేసు విషయం గురించి రాజ్ను విచారిద్దామని అతని ఇంటికి వస్తే.. మున్ని కనిపించడం లేదన్న విషయం తెలిసి ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తారు. అందులో వినోద్కు సంచలన విషయాలు తెలుస్తాయి. మున్నితో ఒక ఆత్మ ఉందనే విషయం తెలుస్తుంది. ఆత్మల గురించి తెలిసిన తన మిత్రుడు డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్)ను పిలిపిస్తాడు. అప్పటి వరకు మామూలుగా ఉంటే రాజ్ భార్య లీనాలోకి ఒక్కసారిగా ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? మున్నిని ఎవరు తీసుకెళ్లారు? జాన్వీని ఎవరు చంపారు? అనే ఆసక్తికర అంశాలు సినిమాలో చూడాల్సిందే. |
18:13, 1 నవంబరు 2019 నాటి కూర్పు
ఆవిరి | |
---|---|
దర్శకత్వం | రవిబాబు |
రచన | రవిబాబు |
స్క్రీన్ ప్లే | పి. సత్యానంద్ |
నిర్మాత | రవిబాబు |
తారాగణం | రవిబాబు, నేహా చౌహాన్ |
ఛాయాగ్రహణం | ఎన్.సుధాకర్ రెడ్డి |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | వైది |
నిర్మాణ సంస్థ | ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ |
పంపిణీదార్లు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీs | 1 నవంబరు, 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆవిరి[1][2] 2019, నవంబరు 1న విడుదలైన తెలుగు భయానక చలనచిత్రం. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవిబాబు, నేహా చౌహాన్,[3] బేబీ శ్రీ ముక్తా ప్రధాన పాత్రలు పోషించారు.
కథ
రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) దంపతులకు శ్రేయ, మున్ని అనే ఇద్దరు ఆడపిల్లలు. రాజ్ బిజినెస్మేన్. పిల్లలిద్దరికి ఆస్తమా ఉంటుంది. పిల్లలిద్దరూ స్విమ్మింగ్ చేస్తుండగా శ్రేయకు ఊపిరాడక స్మిమ్మింగ్ పూల్లోనే చనిపోతుంది. శ్రేయ చనిపోవడంతో లీనా ఆ ఇంట్లో ఉండలేకపోవడంతో వేరే ఇంటికి మారుతారు. కొత్త ఇంటికి వెళ్లాక చిన్న కూతురు మున్ని వింతగా ప్రవర్తిస్తుంది. ఒక ఆత్మతో మున్ని మాట్లాడుతూ ఉంటుంది. రెండుమూడు సార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఆస్తమా ఉన్న కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం లీనా తన ఇంటికి సెక్యురిటీ లాకర్స్ ఏర్పాటు చేస్తుంది. ఏ డోర్ తీసినా అలారం మోగేలా పోలీసుల సాయంతో సెట్ చేస్తుంది. అయితే ఒక రోజు మున్ని ఇంట్లో నుంచి మాయమైపోతోంది. అదే టైమ్లో రాజ్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తున్న జాన్వీ(ప్రియా వడ్లమాని) కూడా కనిపించకుండా పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందుతుంది.
జాన్వీ మిస్సింగ్ కేసు రాజ్ స్నేహితుడైన పోలీసు అధికారి వినోద్(ముక్తా ఖాన్) విచారిస్తుంటాడు. ఆ కేసు విషయం గురించి రాజ్ను విచారిద్దామని అతని ఇంటికి వస్తే.. మున్ని కనిపించడం లేదన్న విషయం తెలిసి ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తారు. అందులో వినోద్కు సంచలన విషయాలు తెలుస్తాయి. మున్నితో ఒక ఆత్మ ఉందనే విషయం తెలుస్తుంది. ఆత్మల గురించి తెలిసిన తన మిత్రుడు డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్)ను పిలిపిస్తాడు. అప్పటి వరకు మామూలుగా ఉంటే రాజ్ భార్య లీనాలోకి ఒక్కసారిగా ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? మున్నిని ఎవరు తీసుకెళ్లారు? జాన్వీని ఎవరు చంపారు? అనే ఆసక్తికర అంశాలు సినిమాలో చూడాల్సిందే.
నటవర్గం
- రవిబాబు
- నేహా చౌహాన్
- బేబీ శ్రీ ముక్తా
- భరణి శంకర్
- ముఖ్తర్ ఖాన్
- కాశీ విశ్వనాథ్
- హిమజ
సాంకేతికవర్గం
- రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు
- స్క్రీన్ప్లే: పి. సత్యానంద్
- ఛాయాగ్రహణం: ఎన్.సుధాకర్ రెడ్డి
- సంగీతం: వైది
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: ఫ్లైయింగ్ ఫ్రాగ్స్
- పంపిణీదారు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- ఆర్ట్: నారాయణ రెడ్డి
- యాక్షన్: సతీశ్
మూలాలు
- ↑ "First look of Ravibabu's Aaviri is out". The Times of India (in ఇంగ్లీష్).
- ↑ "Creative poster of Aaviri". Samayam Tollywood.
- ↑ "Ravi babu's next project first look released". The Hans India (in ఇంగ్లీష్).