మయూరి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు |
Andhulo 'matter ledu ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
16 వ పుట్టిన రోజుకు నాలుగు నెలల సమయం ఉండగా తమిళనాడులో ఒక ప్రమాదానికి గురౌతుంది. కుడికాలు ఎముక విరగడమే కాకుండా కొన్ని గాయాలు కూడా తగులుతాయి. ఆమెను ఆసుపత్రికి చేర్చే సమయంలో రోగులతో రద్దీగా ఉండగా ఆమెకు కొంతమంది జూనియర్ వైద్యులు చికిత్స చేస్తారు. గాయాల తీవ్రత గమనించకుండా కాలుకు కట్టుకట్టడంతో గాయం ముదిరి మోకాలి కింద కొంత భాగం తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాట్య ప్రపంచంలో ఆమె కన్న కలలు కల్లలవుతాయి. ఒక్కసారిగా నిరాశకు లోనవుతుంది. కానీ ఆమెకు నాట్యం పై ఉన్న ప్రేమ కుదురుగా ఉండనీయదు. జైపూర్ కాలు సాయంతో తిరిగి నడవడం నేర్చుకుంటుంది. అదే స్ఫూర్తితో నాట్యం కూడా సాధన చేయడం మొదలుపెడుతుంది. |
16 వ పుట్టిన రోజుకు నాలుగు నెలల సమయం ఉండగా తమిళనాడులో ఒక ప్రమాదానికి గురౌతుంది. కుడికాలు ఎముక విరగడమే కాకుండా కొన్ని గాయాలు కూడా తగులుతాయి. ఆమెను ఆసుపత్రికి చేర్చే సమయంలో రోగులతో రద్దీగా ఉండగా ఆమెకు కొంతమంది జూనియర్ వైద్యులు చికిత్స చేస్తారు. గాయాల తీవ్రత గమనించకుండా కాలుకు కట్టుకట్టడంతో గాయం ముదిరి మోకాలి కింద కొంత భాగం తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాట్య ప్రపంచంలో ఆమె కన్న కలలు కల్లలవుతాయి. ఒక్కసారిగా నిరాశకు లోనవుతుంది. కానీ ఆమెకు నాట్యం పై ఉన్న ప్రేమ కుదురుగా ఉండనీయదు. జైపూర్ కాలు సాయంతో తిరిగి నడవడం నేర్చుకుంటుంది. అదే స్ఫూర్తితో నాట్యం కూడా సాధన చేయడం మొదలుపెడుతుంది. |
||
==పాత్రలు- |
==పాత్రలు-పాత్రధారులుతాతాజాజాజైజాజాజై== |
||
* [[సుధా చంద్రన్]] - మయూరి |
* [[సుధా చంద్రన్]] - మయూరి |
||
* [[శుభాకర్]] - మోహన్ |
* [[శుభాకర్]] - మోహన్ |
00:53, 23 జనవరి 2021 నాటి కూర్పు
మయూరి | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | సుధా చంద్రన్, బేతా సుధాకర్, శైలజ, పి.ఎల్.నారాయణ |
సంగీతం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1985 |
భాష | తెలుగు |
మయూరి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1985లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించాడు. ఇది నర్తకియైన సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తీశారు.[1] ఈ సినిమాలో సుధా చంద్రన్ తన జీవితాన్ని పోలిన మయూరి అనే నర్తకి పాత్ర పోషించింది. మయూరి ఒక ప్రమాదంలో తన కాలును కోల్పోతుంది. ఆ స్థితిలో ఆమె నాట్యం చేయలేకపోయినా జైపూర్ కాలుతో మళ్ళీ నాట్యం సాధన చేసి ప్రదర్శనలు ఇస్తుంది.
కథ
ముంబైలోని తెలుగు కుటుంబంలో జన్మిస్తుంది మయూరి. తల్లిదండ్రులకు ఆమె ఒక్కటే కూతురు. పెరిగే కొద్దీ నాట్యం అన్నా, కళలు అన్నా ఆసక్తి పెంచుకుంటుంది. ఆమె ఉత్సాహాన్ని గమనించిన తండ్రి ఆమెను చిన్న వయసులోనే నాట్యశిక్షణాకేంద్రంలో చేరుస్తాడు. మూడేళ్ళకే నాట్యం చేయడం ప్రారంభించి 8 ఏళ్ళకే మొదటిసారిగా ప్రదర్శన ఇస్తుంది. చదువుతో పాటు నాట్యం కూడా నేర్చుకుంటూ 16 ఏళ్ళ వయసు వచ్చేసరికి 75 ప్రదర్శనలు ఇస్తుంది. చదువులో కూడా ముందు ఉంటుంది కానీ నాట్యం అంటే ఆమెకు ప్రాణం.
16 వ పుట్టిన రోజుకు నాలుగు నెలల సమయం ఉండగా తమిళనాడులో ఒక ప్రమాదానికి గురౌతుంది. కుడికాలు ఎముక విరగడమే కాకుండా కొన్ని గాయాలు కూడా తగులుతాయి. ఆమెను ఆసుపత్రికి చేర్చే సమయంలో రోగులతో రద్దీగా ఉండగా ఆమెకు కొంతమంది జూనియర్ వైద్యులు చికిత్స చేస్తారు. గాయాల తీవ్రత గమనించకుండా కాలుకు కట్టుకట్టడంతో గాయం ముదిరి మోకాలి కింద కొంత భాగం తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాట్య ప్రపంచంలో ఆమె కన్న కలలు కల్లలవుతాయి. ఒక్కసారిగా నిరాశకు లోనవుతుంది. కానీ ఆమెకు నాట్యం పై ఉన్న ప్రేమ కుదురుగా ఉండనీయదు. జైపూర్ కాలు సాయంతో తిరిగి నడవడం నేర్చుకుంటుంది. అదే స్ఫూర్తితో నాట్యం కూడా సాధన చేయడం మొదలుపెడుతుంది.
పాత్రలు-పాత్రధారులుతాతాజాజాజైజాజాజై
- సుధా చంద్రన్ - మయూరి
- శుభాకర్ - మోహన్
- శైలజ
- పి.ఎల్.నారాయణ - లాయర్
- నిర్మలమ్మ
- సుబ్బరాజు
- వై. విజయ - లాయర్ భార్య
- పొట్టి ప్రసాద్
అవార్డులు
- జాతీయ సినిమా అవార్డు - సుధా చంద్రన్ - 1986.
- ఉత్తమ సినిమాగా నంది అవార్డు - 1985 .
- ఉత్తమ సంగీత దర్శకత్వం, నేపథ్య గాయకుడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - 1985