మీరా కుమార్: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:8వ లోకసభ సభ్యులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q467201 (translate me) |
||
పంక్తి 52: | పంక్తి 52: | ||
[[వర్గం:లోక్సభ స్పీకర్లు]] |
[[వర్గం:లోక్సభ స్పీకర్లు]] |
||
[[వర్గం:8వ లోకసభ సభ్యులు]] |
[[వర్గం:8వ లోకసభ సభ్యులు]] |
||
[[en:Meira Kumar]] |
06:21, 7 ఏప్రిల్ 2013 నాటి కూర్పు
మీరా కుమార్ | |||
మూడవ ప్రపంచ దేశాక సభాపతుల సదస్సు లో ప్రసంగిస్తున్న మీరా కుమార్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2009 | |||
ముందు | సోమనాధ్ ఛటర్జీ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ససారం, రోహ్తాస్, భారతదేశం | 1945 మార్చి 31||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | మంజుల్ కుమార్ | ||
సంతానం | 1 కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు | ||
నివాసం | ఢిల్లీ, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయము | ||
మతం | హిందూ | ||
జూన్ 3, 2009నాటికి | మూలం | http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=73 |
మీరా కుమార్ భారత పార్లమెంటు సభ్యురాలు మరియు లోక్సభకు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.
నేపధ్యము
బీహార్ లోని పట్నా జిల్లా లో సుప్రసిద్ద స్వాతంత్ర్య సమరయోధుడు మరియు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ మరియు ఇంద్రాణీ దేవి దంపతులకు జన్మించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం లోని ఇంద్రప్రస్థ కళాశాల మరియు మిరిండా కళాశాలల నుండి వరుసగా M.A, L.L.B పట్టాలను పొందింది.
జీవన పధం
విదేశీ జీవితము
ఈవిడ 1973 లో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి ఇండియన్ ఫారిన్ సర్వీసు కు ఎంపికైంది. ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో గడిపింది.
రాజకీయ జీవితము
1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన రాం విలాస్ పాశ్వాన్, మాయావతి లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. ఢిల్లీ లోని కరోల్ బాగ్ నియోజకవర్గానికి 8వ మరియు 12వ లోక్సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004 మరియు 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన బీహార్ లోని ససారం నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది.
2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మరియు సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే లోక్సభ సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత లోక్సభకు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది.
వ్యక్తిగత జీవితము
ఈమె వివాహము సుప్రీం కోర్టు న్యాయవాది అయిన మంజుల్ కుమార్ తో జరిగినది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్ మరియు కుమార్తెలు స్వాతి మరియు దేవయాని. అన్షుల్ వివాహము మినితా తో జరిగింది. వీరికి ఒక కుమార్తె అనాహిత. కుమార్తె స్వాతి వివాహము రంజీత్ తోనూ మరియు దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి మరియు రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత మరియు కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని మరియు అమిత్ లకు ఒక కుమారుడు ఫర్జాన్ సంతానము.
మీరా కుమార్ కి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఈవిడ రైఫిల్ షూటింగ్ లో అనేక పతాకాలను కూడా గెలుచుకుంది. అలాగే ఈవిడ రచనలు కూడా ప్రచురితమయ్యాయి.